అన్వేషించండి

గూగుల్‌లో ఇట్టా కొడితే అట్టా వచ్చేస్తున్నాయిగా- సీఎం జగన్‌పై లోకేష్‌ సెటైర్లు

అమరావతి గురించి సీఎం జగన్ గతంలో చేసిన ప్రకటనలు గూగల్‌లో ఇట్ట కొడితే అట్టా వచ్చేస్తాయంటున్నారు తెలుగుదేశం జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్‌. ట్విట్టర్ వేదికగా జగన్, వైసీపీపై సెటైర్లు వేశారు.

విశాఖ గర్జన పేరుతో వైఎస్‌ఆర్‌సీపీ చేస్తున్న ర్యాలీ, అక్కడ మంత్రులు, నేతలు చేస్తున్న విమర్శలకు దీటుగా టీడీపీ కౌంటర్ అటాక్ చేసింది. ఫేక్ ఉద్యమానికి విద్యార్థులు తరలించడమే కాకుండా మార్ఫింగ్ ఫొటోలతో జనాలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడింది. 

అమరావతి గురించి సీఎం జగన్ గతంలో చేసిన ప్రకటనలు గూగల్‌లో ఇట్ట కొడితే అట్టా వచ్చేస్తాయంటున్నారు తెలుగుదేశం జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్‌. ట్విట్టర్ వేదికగా జగన్, వైసీపీపై సెటైర్లు వేశారు. "జగన్ రెడ్డి చెప్పే మాటలు వేరు. చేసే పనులు వేరు. తాను విశ్వసనీయతకి మారు పేరు అని సెల్ఫ్ డబ్బా కొట్టుకుని నాడు మద్యనిషేధం హామీ ఇచ్చిన జగన్.. నేడు సొంతంగా విషమద్యం అమ్ముతూ జనం ప్రాణాలపై కోట్లు దండుకుంటూ. "విషపు"నీయత కోరలు చాచారు." అంటూ తీవ్ర విమర్శలు చేశారు లోక్షేష్‌ 

తన మేనిఫెస్టో బైబిల్,ఖురాన్,భగవద్గీతతో సమానమని చెప్పిన జగన్‌... అమరావతియే రాజధాని అని ప్రతిపక్షనేతగా హామీలిచ్చి ప్రభుత్వంలోకి వచ్చాక మూడుముక్కలాట మొదలెట్టి పవిత్ర మత గ్రంథాలని అవమానించారని విమర్శించారు లోకేష్. తాను ఇచ్చిన మాటలు జగన్ మరిచిపోయినట్టు నటిస్తున్నారని ధ్వజమెత్తారు. 

జగన్ ఎన్ని చేసినా ఆయన గతంలో చేసిన ప్రకటనలను జనం మర్చిపోరకని... గూగుల్ ఇట్టా కొడితే అట్టా కార్తీక దీపం సీరియల్లా వరసగా అమరావతిపై జగన్ రెడ్డి మాట తప్పుడు-మడమ తిప్పుడు బాగోతం వచ్చేస్తుందన్నారు. 

విశాఖ గర్జనకు, వికేంద్రీకరణకు మద్దతు ఇస్తున్నట్టు కొన్ని ఫొటోలను, స్టేట్‌మెంట్‌లను వైసీపీ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. అందులో ఉన్న వాళ్లంతా ఫేక్‌ బ్యాచ్ అంటూ టీడీపీ ఫ్యాక్ట్‌చెక్‌ మొదలు పెట్టింది. ఎవర్రా వీళ్ళంతా ? మీరు ఫేక్ గాళ్ళు అని తెలుసు కానీ, ఏకంగా మనుషులనే ఫేక్ చేసి పడేస్తున్నారుగా.. అంటు వైఎస్‌ఆర్‌సీపీ పెట్టిన ఫొటోలపై పోస్ట్‌మార్టం చేసింది టీడీపీ. 
ఏపిలో రైతు ఫోటో దొరకలేదా ? ఏకంగా ఒడిశా నుంచి ఫోటో లేపుకొచ్చారని సెటైర్లు వేసింది. దానికి సంబంధించిన ఆధారాల లింక్‌ను కూడా ట్విట్టర్‌లో పెట్టిందా పార్టీ. ఒడిశా రైతుకు మూడు రాజధానులతో పనేంటని ప్రశ్నించింది. నెట్‌లో ఫొటోలు తీసుకొచ్చి  ఫేక్ కథలు అల్లుతున్నారని మండిపడింది. 

అంతే కాదు విశాఖ గర్జనకు జనాలు లేకపోయేసరికి కొన్ని కాలేజీల నుంచి విద్యార్థులను తరలించారని చెబుతూ ఓ వీడియోను పోస్టు చేసింది. ప్రపంచ విద్యార్థుల దినోత్సవం రోజున కాలేజీల్లో ఉండాలసిన విద్యార్థులను రోడ్డున పడేశారని ఎద్దేవా చేసింది తెలుగుదేశం పార్టీ. జగన్ రెడ్డి ఫేక్ గర్జన కోసం కాలేజీ మానిపించి సభకు తరలించారని విమర్శించింది. వైజాగ్‌లో విద్యార్థులు ఎవరినీ బడికి వెళ్ళొద్దని అంతా గర్జనకు రావాలని హుకుం జారీ చేశారట పాపం అంటూ ట్వీట్ చేసిందా పార్టీ. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget