అన్వేషించండి

Vizag AI Data Center: విశాఖలో ఏఐ డేటా సెంటర్‌కు నారా లోకేష్ శంకుస్థాపన, రెండు దశల్లో అభివృద్ధికి ప్లాన్

Nara Lokesh విశాఖపట్నంలో ఏఐ డేటా సెంటర్‌ (AI Data Center)కు ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. సిఫీ టెక్నాలజీస్‌ ఈ సెంటర్ ఏర్పాటు చేస్తుందని తెలిసిందే.

AI Data Center In Visakhapatnam: విశాఖపట్నం: విశాఖపట్నం సిటీలో పలు కీలక ప్రాజెక్టుల ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh)  శంకుస్థాపన చేశారు.  మొదటి ఏఐ ఎడ్జ్‌ డేటా సెంటర్‌తో పాటు ఓపెన్‌ కేబుల్‌ ల్యాండింగ్‌ స్టేషన్‌కు ఆదివారం ఉదయం నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ప్రముఖ డిజిటల్‌ ఐటీ సొల్యూషన్స్‌ ప్రొవైడర్‌ సిఫీ టెక్నాలజీస్‌ అనుబంధ సంస్థ సిఫీ ఇన్ఫినిట్‌ స్పేసెస్‌ లిమిటెడ్‌ విశాఖలో 50 మెగావాట్ల ఏఐ ఆధారిత ఎడ్జ్‌ డేటా సెంటర్‌ (AI Data Center) తో పాటు ఓపెన్‌ కేబుల్‌ ల్యాండింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేస్తోంది.


Vizag AI Data Center: విశాఖలో ఏఐ డేటా సెంటర్‌కు నారా లోకేష్ శంకుస్థాపన, రెండు దశల్లో అభివృద్ధికి ప్లాన్

సిఫీ టెక్నాలజీస్‌ నాస్‌డాక్‌లో నమోదైన కంపెనీ. సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ దాదాపు  రూ.1,500 కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసి అభివృద్ధి చేయనుంది. ఈ ఏఐ డేటా సెంటర్‌ ఏర్పాటుతో గ్లోబల్‌ డిజిటల్‌ గేట్‌వేగా విశాఖపట్నం నగరం మారుతుందని నారా లోకేష్ ధీమా వ్యక్తంచేశారు. ఈ డేటా సెంటర్ ఏర్పాటుతో వెయ్యి మంది యువతకు ఉద్యోగాలు, ఉపాధి లభించనుందని ప్రభుత్వం తెలిపింది.


Vizag AI Data Center: విశాఖలో ఏఐ డేటా సెంటర్‌కు నారా లోకేష్ శంకుస్థాపన, రెండు దశల్లో అభివృద్ధికి ప్లాన్

 హైదరాబాద్‌ను మించేలా పదేళ్లలో విశాఖ అభివృద్ధి

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. 1990 దశకంలో హైదరాబాద్ నగరానికి ఐటీ కంపెనీలు రావడానికి ఎలాంటి పరిస్థితులు కల్పించారో.. ఇప్పుడు విశాఖ నగరానికి ఐటీ కంపెనీలు రావడానికి చంద్రబాబు అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సైబర్ టవర్ తో పలు కంపెనీలు హైదరాబాద్ కు వచ్చాయి. హైదరాబాద్ 30 ఏళ్లలో ఎంత అభివృద్ది చెందిందో.. కేవలం 10 ఏళ్ల కాలంలోనే విశాఖను అదే స్థాయిలో అభివృద్ధి చేస్తాం. ఇతర రాష్ట్రాలతో కాదు, ఇతర దేశాలతో ఏపీ పోటీ పడుతుంది. నేడు విశాఖకు ఐటీ కంపెనీలు, డేటా సెంటర్ల ఏర్పాటుకు రావడానికి ఎంతో మంది కృషి చేశారు. భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేస్తాయి, తద్వారా లక్షల మంది ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయని’ నారా లోకేష్ దీమా వ్యక్తం చేశారు.

2047 నాటికి జీవీఎంసీ 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీ
విశాఖ వేగంగా అభివృద్ది చెందుతున్న నగరం. 2047 నాటికి విశాఖపట్నం 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారుతుంది. ఇది మా అజెండా. ప్రతి రాష్ట్రానికి ఒకే రాజధాని ఉంటుంది. కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. మేం పోటీ చేసిన స్థానాల్లో 94 శాతం సీట్లు నెగ్గాం. 2019లో మేం చాలా చోట్ల ఓడినా విశాఖలో మాత్రం మేం నెగ్గాం. 2014లో ఎన్డీయే కూటమినెగ్గింది. చంద్రబాబు సీఎం అయ్యాక వెంటనే హుదూద్ తుఫాన్ వచ్చి, విశాఖ మొత్తం నాశనం అయింది. కానీ చంద్రబాబు నాయుడు ఉన్నారని విశాఖ ప్రజల్లో నమ్మకం కనిపించింది. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల్లో 50 శాతం విశాఖకే వచ్చాయి. 

సూపర్ సిక్స్ ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు
సూపర్ సిక్స్ హామీ ప్రకారం రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. అందులో కేవలం విశాఖలోనే 5 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని ఐటీ శాఖ మంత్రిగా హామీ ఇస్తున్నాను. టీసీఎస్ కంపెనీకి 99 పైసలకు భూమి ఇచ్చారని విమర్శించారు. కొందరు రాజకీయం చేసి కోర్టుకు వెళ్లారు. కానీ మేం చేసిన చర్యలతో గూగుల్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ లాంటి చాలా కంపెనీలు విశాఖకు వస్తున్నాయి. ప్రభుత్వ పరంగా అవసరమైన పాలసీలు తీసుకొచ్చాం. 

ఇది కేవలం డబుల్ ఇంజిన్ సర్కార్ మాత్రమే కాదు
ఏపీలో ఉన్నది కేవలం డబుల్ ఇంజిన్ సర్కార్ మాత్రమేకాదు. బుల్లెట్ ట్రైన్ మీద ఉన్న డబుల్ ఇంజిన్ సర్కార్. రెండు డబుల్ ఇంజిన్లు బుల్లెట్ ట్రైన్ వేగంతో వెళ్తుంటే ఇలా ఉంటుంది. ఒకేచోట 3 లక్షల మంది యోగా చేసి విశాఖలో రికార్డులు నెలకొల్పాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకున్నాం. కేంద్రం రూ.11 వేల కోట్లు ప్రకటిస్తే.. ఏపీప్రభుత్వం రూ.3 వేల కోట్లుతో చర్యలు చేపట్టింది. విశాఖ స్టీల్ ప్లాంటును లాభాల బాట పట్టించి పరుగులు పెట్టిస్తాం. వచ్చే 3 నెలల్లో విశాఖలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, కొత్త కంపెనీలు, పెట్టుబడులు వస్తాయన్నారు నారా లోకేష్.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
Falcon MD Amardeep Arrest: డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Rukmini Vasanth: 'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా
'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా
Advertisement

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
Falcon MD Amardeep Arrest: డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Rukmini Vasanth: 'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా
'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా
Most Cheapest Cars in India: భారత్‌లో ఏ కారు కొంటే అధిక ప్రయోజనం ? టాప్ 5 చౌకైన కార్ల జాబితా ఇదిగో
భారత్‌లో ఏ కారు కొంటే అధిక ప్రయోజనం ? టాప్ 5 చౌకైన కార్ల జాబితా ఇదిగో
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Countries with the Deadliest Snakes : పాముల ముప్పు ఎక్కువ ఉన్న దేశాలు.. ఇండియాలోని విషపూరితమైనవి ఇవే
పాముల ముప్పు ఎక్కువ ఉన్న దేశాలు.. ఇండియాలోని విషపూరితమైనవి ఇవే
Embed widget