అన్వేషించండి

Srikakulam Latest News: తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం

Amadalavalasa News Today: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ రోజు రోజుకు డీలా పడుతోంది. ఓటమితో కొందర నేతలు ఇంటి నుంచి బయటకి రావడం లేదు. మరోవైపు పార్టీలో జరుగుతున్న మార్పులు మరికొందర్ని ఇబ్బంది పెడుతోంది.

Tammineni Sitaram Latest News: ఆమదాలవలసలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి సీనియర్ నాయకుడు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన తనయుడు నానితో పాటు కిల్లి సత్యనారాయణ హాజరుకాలేదు. వారితోపాటు వారి మద్దతుదారులు కొందరు సమావేశానికి ముఖం చాటేశారు. వారు హాజరుకాని వైనం ఇప్పుడు వైసీపీలో హాట్‌ టాపిక్‌గా మారింది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్తగా చింతాడ రవికుమార్‌ను నియమించారు. మొన్నటి వరకూ ఇన్‌చార్జిగా ఉన్న మాజీ శాససభాపతి తమ్మినేని సీతారాంను మార్చి యువకుడైన రవికుమార్‌కి అవకాశాన్ని "జగన్ ఇచ్చారు. ఊహించని ఈ పరిణామంతో తమ్మినేని సీతారాం తీవ్ర నిరాశకి లోనయ్యారు. ఆయనతోపాటు మొదట నుంచి తమ్మినేని కుటుంబం వెంట నడిచిన వారి మద్దతుదారులు షాక్‌కి గురయ్యారు. ఆ ప్రకటన వెలువడిన తర్వాత పలువురు నేతలు తమ్మినేని సీతారాంని కలుసుకుని ఆయనతో తాజా పరిణామాలపై చర్చించారు. వాస్తవానికి తమ్మినేని సీతారాం ఎన్నికల ముందే తనకు బదులుగా తనయుడు తమ్మినేని చిరంజీవి నాగ్‌కి ఆమదాలవలస నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలని అధినేతను కోరారు. దీన్ని జగన్ తిరస్కరించారు. 

తమ్మినేని సీతారాంనే పోటీ చేయాలని సూచిస్తూ ఆయననే 2024 ఎన్నికల్లో అభ్యర్ధిగా ప్రకటించారు. వైసీపీ ఓటమి పాలైన తర్వాత కూడా ఆయన నియోజకవర్గ ఇన్ చార్జీగా కొనసాగుతూ పార్టీ కార్యక్రమాలకు తమ్మినేని చిరంజీవి నాగ్ హాజరవుతూ వస్తున్నారు. ఉన్నట్లుండి చింతాడ రవికుమార్‌ను ఆమదాలవలస సమన్వయకర్తగా ప్రకటించడంతో వారు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. అందుకే చింతాడరవికుమార్ తొలిసారి నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశానికి హాజరుకాలేదని తెలుస్తోంది. 

ఇటీవల రాష్ట్రకార్యదర్శిగా నియమితులైన మరో సీనియర్ నాయకుడు కిల్లి సత్యనారాయణ కూడా ఈ సమావేశానికి హాజరుకాలేదు. తమ్మినేని, కిల్లి ఇద్దరు గైర్హాజరవడం చర్చనీయాంశమైంది. కిల్లి సత్యన్నారాయణ స్థానికంగా అందుబాటులోలేకపోవడం వల్లనే హాజరుకాలేదని అంటున్నారు. తమ్మినేని సీతారాం, చిరంజీవి నాగ్, వారి మద్దతుదారులు సమావేశానికి రాకపోవడానికి కారణాలు ఏంటో తెలియదని నాయకులు అంటున్నారు. 
నూతన సమన్వయకర్త చింతాడ రవికుమార్ మాత్రం ఆమదాలవలస నియోజకవర్గంలో గ్రామ స్థాయి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చింతాడ రవికుమార్ అన్నారు. నాయకులు, కార్యకర్తలందరిని కలుపుకుని పని చేస్తానన్నారు. ఆమదాలవలసలో వైసీపీ జెండా ఎగురవేసే లక్ష్యంగా ముందుకు వెళ్తానన్నారు. 

ఆమదాలవలసలో శుక్రవారం నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. నియోజకవర్గ సమన్వయకర్తగా చింతాడ రవికుమార్‌ను నియమించిన తర్వాత తొలిసారి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆమదాలవలస మున్సిపాల్టీతోపాటు మండలం, బూర్జ, సరుబుజ్జిలి, పొందూరు మండలాలకి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశానికి వచ్చిన నాయకులందరిని పలుకరించి వారితో మాట్లాడారు. 

ఈ సమావేశంలో సీనియర్ నాయకులతోపాటు కార్యకర్తలు అంతా వచ్చారు. ఎంపిపి, జడ్పీటీసి, ఎంపిటిసిలు, కౌన్సిలర్లు ఇలా ప్రస్తుతం పదవిల్లో ఉన్న వారితోపాటు మాజీలు కూడా హాజరయ్యారు. పలువురు సీనియర్ నాయకులు మాట్లాడుతూ భవిష్యత్ కార్యాచరణపై తమ మనస్సులలోని మాటలను తెలియజేశారు. ఈ సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ మాట్లాడుతూ తనపై ఉన్న నమ్మకంతో ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించిన జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలను తెలియజేశారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో వైకాపా జెండాను ఆమదాలవలసలో ఎగురవేసేందుకు కలసి పని చేస్తామన్నారు. 

చిన్నచిన్న సమస్యలు పార్టీలోఉన్నాయని అవన్నీ సద్దుమణిగిపోతాయని రవికుమార్ అన్నారు. సమన్వయకర్తగా తన పేరును జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన తర్వాత నాయకులు అందరిని కలుసుకుని సహకరించాలని కోరడం జరిగిందన్నారు. అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పిందే తనకు వేదమని అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్దితో నిర్వహించేందుకు కృషి చేస్తానన్నారు. వివిద కారణాల వల్ల కొందరు నాయకులు ఈ సమావేశానికి రాలేనప్పటికీ భవిష్యత్‌లో వారంతా కూడా ఆమదాలవలసలో వైసీపీ కోసం పని చేస్తారన్నారు. 

ఎన్‌డిఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉందో అందరూ చూస్తున్నారన్నారు రవి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దాట వేత ధోరణిని అవలంభిస్తున్నారన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకి ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చరాని గుర్తు చేసారు. ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలో ఇసుక దోపిడి యథేచ్చగా సాగుతుందన్నారు. ఈ విషయం అధికారులకి తెలిసినా వారు పట్టించుకోవడం లేదన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఎటువంటి పరిణామలు జరుగుతున్నాయో ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. రానున్న రోజులలో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు నాయకులు, కార్యకర్తలు అంతా కలసి పనిచేయాలని చింతాడ రవికుమార్ పిలుపునిచ్చారు. సమన్వయకర్తగా ఎంపికైన వ్యక్తి నిర్వహించే తొలి సమావేశానికి కీలక నేతలు హాజరుకాకపోవడం సంచలనంగా మారింది. ఈ పరిణామాలు ఎటుదారి తీస్తాయోననేది కార్యకర్తలు, జిల్లా నేతలు చర్చించుకుంటున్నారు. 

Also Read: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
HYDRA Jobs: ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన
ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన
Embed widget