అన్వేషించండి

Hud Hud Cyclone: హుద్ హుద్ విలయానికి నేటితో 8 ఏళ్ళు, ఒళ్లు గగుర్పొడిచేలా ఆ కాళరాత్రి జ్ఞాపకాలు

విలయాన్ని సృష్టించిన హుద్ హుద్ తుఫాన్ వచ్చి నేటికి (అక్టోబర్ 14) సరిగ్గా ఎనిమిదేళ్లు పూర్తయింది.

కొత్తగా ఏర్పడిన రాష్ట్రం.. ఇంకా పూర్తిగా ఖరారు కాని రాజధాని ఏపీ లోని ప్రజలందరి దృష్టి వీటి వైపే చూస్తున్న సమయంలో ముంచుకువచ్చిన ప్రకృతి ప్రళయం హుద్ హుద్ తుఫాన్. గంటకు 220 కిలో మీటర్ల వేగంతో వీచిన గాలులు విశాఖను చిగురుటాకులా వణికించాయి. దాదాపు 5 లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలించాల్సి వచ్చింది. తుపాను సందర్బంగా గాలులు ఎంత బలంగా వీచాయంటే షో రూముల్లో నుండి కొత్త కార్లు రోడ్డు పైకి వచ్చి పడిపోతున్న దృశ్యాలు ఇంకా విశాఖ ప్రజల కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. అంతటి విలయాన్ని సృష్టించిన హుద్ హుద్ తుఫాన్ వచ్చి నేటికి (అక్టోబర్ 14) సరిగ్గా ఎనిమిదేళ్లు పూర్తయింది. రాష్ట్ర  సీఎం స్వయంగా విశాఖ వచ్చి సహాయక చర్యల్లో పాల్గొనడం, దేశ ప్రధాని వచ్చి విశాఖ కలెక్టర్ ఆఫీసులో కూర్చుని రివ్యూ మీటింగ్ పెట్టడం వంటి ఘటనలను వైజాగ్ వాసులు ఇంకా మర్చిపోలేదు.

2014 అక్టోబర్ 9 న తోలి హెచ్చరిక:

హుద్ హుద్ గమనాన్ని తీవ్రతను గమనించిన తుపాను హెచ్చరికల కేంద్రం అక్టోబర్ 8 వ తేదీనే దాని పరిధి సుమారు 500 కిలో మీటర్లు ఉండవచ్చని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల ప్రభుత్వాలను ముందస్తుగానే హెచ్చరించింది. ముందుగా ఒడిశాలో తీరం దాటొచ్చని భావించారు. అయితే అది దిశను మార్చుకుని విశాఖ వద్ద తీరం దాటింది. అక్టోబర్ 13,14 తారీఖుల్లో వైజాగ్ వద్ద గల పూడిమడక వద్ద తీరం దాటింది. అయితే, తుపాను తీవ్రతను ముందుగానే అంచనా వేసిన ఏపీ ప్రభుత్వం 5 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. అయితే, ఎంతమంది చనిపోయారు అనేదానిపై ఇప్పటికీ అనేక అంచనాలు ఉన్నాయి. 24 మంది చనిపోయినట్టు అధికారులు చెబితే.. ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని ప్రవేటు నివేదికలు  తెలిపాయి.


వేల కోట్లలో ఆస్తినష్టం

హుద్ హుద్ తుపాను సందర్బంగా జరిగిన ఆస్తినష్టం అంతకు ముందు ఏపీ ఎన్నడూ చూడలేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే.. ఆనాటి  లెక్కల ప్రకారం 1. 63 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తి నష్టం జరిగింది అని చెబుతారు. ఆంధ్ర ప్రదేశ్ సహా ఒడిశా, అండమాన్ అండ్ నికోబర్ ద్వీపాలు ఈ తుపాను ధాటికి దెబ్బ తిన్నాయి.


రెండు విడతలుగా వచ్చిన హుద్ హుద్

హుద్ హుద్ తుపాను అనేది ఒకదాని వెంట మరొకటి గా వచ్చిన రెండు తుపానులు అని చెప్పాలి అంటారు. ఎందుకంటే వైజాగ్ పై దాని ప్రభావం రెండు భాగాలుగా పడింది. మొదట అక్టోబర్ 13 రాత్రి 8-12 గంటల సమయంలో ప్రచండమైన గాలులతో విధ్వసం సృష్టించింది. దీనివల్ల తీర ప్రాంతాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే 12 గంటలు గ్యాప్ తీసుకుని మరోసారి భారీ వర్షం తో తుపాను విరుచుకుపడింది. దీనివల్ల జనావాసాలు దెబ్బ తినడంతోపాటు,సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. వైజాగ్ లో ముగ్గురు చనిపోయినట్టు తెలిపారు. తుపాను ప్రభావంతో ఉమ్మడి విశాఖ సహా,తూర్పుగోదావరి ,విజయ నగరం,శ్రీకాకుళం జిల్లాలు బాగా దెబ్బతిన్నాయి. రోడ్లు పాడైపోయాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోగా,కరెంటు స్తంభాలు విరిగిపోయాయి. NDRF నుండి 240 మంది,ఆర్మీ నుండి 240 మంది సైనికులు,నేవీ నుండి 120 ,గజ ఈతగాళ్లు 270 మంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఒక్క విశాఖ లోనే 139 మిల్లీ లీటర్ల వర్షపాతం నమోదైంది. 


దెబ్బతిన్న పరిశ్రమలు

విశాఖ లోని చాలా ఇండస్ట్రీలు హుద్ హుద్ బారిన పడ్డాయి. స్టీల్ ప్లాంట్ లో పని నిలిచిపోవడం తో పాటు,వైజాగ్ పోర్ట్, గంగవరం పోర్ట్,షిప్ యార్డ్ లు దెబ్బతిన్నాయి. సరుకు రవాణా తాత్కాలికంగా నిలిచిపోయింది. వైజాగ్ లో 144, విజయనగరం లో 83 ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ లు విధ్వంసం పాలయ్యాయి. కేవలం పరిశ్రమలకే  1000 కోట్లు నష్టం వాటిల్లింది అని  లెక్కలు చెబుతున్నాయి. 


వైజాగ్ లోనే మకాం వేసిన సీఎం -1000 కోట్లు సహాయం ప్రకటించిన ప్రధాని

తుపాను వల్ల కలిగిన నష్టం ఎలా ఉందో  గమనించిన నాటి సీఎం చంద్రబాబు వైజాగ్ లోనే మకాం వేసి సహాయక చర్యల్లో స్వయంగా పాల్గొన్నారు. సీఎం వచ్చి క్షేత్ర స్థాయిలో పాల్గొనడం తో అధికారులు,సిబ్బంది నిద్రాహారాలు లేకుండా కష్టించి మూడు రోజుల్లోనే జనజీవనానికి ఇబ్బంది లేకుండా చేశారు. అలాగే దేశ ప్రధాని మోదీ కూడా విశాఖలో పర్యటించి,కలెక్టర్ ఆఫీసులో రివ్యూ మీటింగ్ పెట్టి పరిస్థితిని సమీక్షించారు.  తక్షణ సాయంగా రూ.1000 కోట్లను ప్రకటించారు. 

విలయాన్ని తట్టుకుని నిలిచిన విశాఖ

హుద్ హుద్ లాంటి కేటగిరీ 4 స్థాయి తీవ్ర  తుపాను ధాటికి దెబ్బతిన్న విశాఖ మళ్ళీ కోలుకోవడానికి చాలా ఏళ్ళు పడుతుంది అని కొందరు భయపడినా ఇక్కడి ప్రజల మనోధైర్యంతో వైజాగ్ మళ్ళీ ఒకటి రెండు సంవత్సరాల్లోనే పూర్వ స్థితికి చేరింది. అయితే,నాటి విలయ తాండవాన్ని గుర్తు చేస్తే మాత్రం వైజాగ్ వాసుల మదిలో ఆ కాళరాత్రి పుట్టించిన భయాలు మళ్లీ మెదులుతుంటాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget