అన్వేషించండి

Indian Flogs:  ప్రతీ ఇంటిపై జెండా ఎగురవేసేందుకు వైజాగ్ సిద్ధం, మొత్తం ఎన్ని జెండాలంటే? 

Indian Flogs: ప్రధాని మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా ప్రతీ ఇంటిపై జెండా ఎగుర వేసేందుకు విశాఖపట్నం సిద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా ఐదున్నర లక్షలకు పైగా జెండాలను తయారు చేశారు. 

Indian Flogs: విశాఖ జిల్లాలో ఆగస్టు 11 నుండి 15 వరకూ జాతీయ పతాకాలు ప్రతీ ఇంటిపైనా రెపరెపలాడనున్నాయి . వీటికోసం వైజాగ్ జిల్లాలో ఇళ్ల సంఖ్య 5 లక్షల 57 వేల 576 ఉంటాయని అంచనా వేశారు. అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతీ ఇంటికీ జాతీయ పతాకాన్ని పంపిణీ చేయనున్నారు. ఈ లెక్క కోసం 2011 జనాభా లెక్కల్ని ప్రాతిపదికగా తీసుకున్నారు. అప్పటి లెక్కల ప్రకారమే విశాఖ జిల్లాలో 4 లక్షల 97 వేల వరకూ ఇళ్ళు ఉంటాయని అంచనా అధికారులు అంచనా వేశారు. వైజాగ్ సిటీతో పాటు చుట్టుపక్కల ఉన్న నాలుగు గ్రామీణ మండలాల్లో గల వాలంటీర్ల సాయంతో ప్రతీ ఇంటికీ జాతీయ పతాకాన్ని పంపిణీ చెయ్యాలని విశాఖ కలెక్టర్ మల్లిఖార్జున ఆదేశించారు. 

బీచ్ రోడ్డులో 100 అడుగుల జాతీయ పతాకం..

దీనికోసం 10 వేల 331 మంది వాలంటీర్లను ఉపయోగించుకోనున్నారు. వీరితో పాటు విశాఖ జిల్లాలో ఉన్న 607 గ్రామాల్లోని గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బంది సేవలనూ వాడుకోనున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. అలాగే జిల్లాలోని 607 సచివాలయాలు, 625 రేషన్ షాపుల వద్ద జాతీయ పతాకాలను ఎగుర వేస్తున్నారు. వారితో పాటు అంగన్ వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు వారరి వారి ఆఫీసుల్లో జెండాను ఎగురవేస్తుండగా..   సిటీలోని బీచ్ రోడ్ లో 100 అడుగుల జాతీయ పతాకాన్ని ఆగస్టు 11 నుండి 15 వరకూ ఎగుర వేయాలని నిర్ణయించారు. 

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తి..

భారత దేశానికి పరాయి పాలన నుండి స్వేచ్ఛ వచ్చి 75 ఏళ్ళు పూర్తి అవుతున్న నేపథ్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం పిలుపును ఇచ్చింది. అందులో భాగంగానే దేశంలోని ప్రతీ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయడంతో పాటు ప్రతీ నగరాన్ని అందంగా తీర్చిదిద్దనున్నారు. విశాఖ నగరాన్ని కూడా పూర్తి స్థాయిలో విద్యుత్ దీపాలతో డెకరేట్ చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని బావికొండ, తొట్లకొండ లాంటి చారిత్రిక ప్రాంతాలతో పాటు , సింహాచలం వంటి పుణ్య క్షేత్రాలనూ అందంగా తీర్చిదిద్దనున్నారు.

తనదైన ముద్ర వేసేందుకు తయారవుతున్న విశాఖ..

ఆగస్టు 1 న గ్రామాల వారీగా సభలు నిర్వహించి, రెండో తారీఖున జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య జన్మదినాన్ని ఘనంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 11 న హెరిటేజ్ వాక్, 12న స్పోర్ట్స్ కాంపిటీషన్స్, 13న ప్రతీ ఒక్కరూ జాతీయ పతాకాన్ని ధరించడం, 14 న స్వాతంత్య్ర సమర యోధుల ఇళ్లకు వెళ్లి వారిని సత్కరించాలని, 15 న ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాలని కేంద్రం తెలిపింది. ఆ కార్యక్రమాలకు అనుగుణంగా విశాఖ సిటీ కూడా తనదైన ముద్ర చూపేందుకు రెడీ అవుతుందని కలెక్టర్ డాక్టర్ మల్లి ఖార్జున తెలిపారు. 

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan On Panchadarla Land Issue: పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
Andhra Pradesh Latest News: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు! వీలైనంత వరకు సమస్యల పరిష్కారానికి మంత్రుల బృందం హామీ!
ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు! వీలైనంత వరకు సమస్యల పరిష్కారానికి మంత్రుల బృందం హామీ!
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Bhogapuram International Airport: జులై 31 వరకు భోగాపురం ఎయిర్‌పోర్టుపై విస్తృత ప్రచారం.. ప్రధాని మోదీ ప్రారంభించే ప్రాజెక్టులివే
జులై 31 వరకు భోగాపురం ఎయిర్‌పోర్టుపై విస్తృత ప్రచారం.. ప్రధాని మోదీ ప్రారంభించే ప్రాజెక్టులివే

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan On Panchadarla Land Issue: పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Embed widget