అన్వేషించండి

Visakha News: చేప దాడిలో జాలరి మృతి.. విశాఖ తీరంలో విషాదం..

చేపదాడిలో జాలరి మృతి. కొమ్ముకోనాం అనే చేప దాడి చేసిన ఓ జాలరిని చంపేసింది. అందర్నీ ఆశ్చర్యపరిచే ఈ ఘటన విశాఖలో జరిగింది.

విశాఖ జిల్లా పరవాడలో తీవ్ర విషాదం చోటు చేసుంది. చేప దాడిలో ఓ జాలరి మృతి చెందాడు. ముత్యాలపాలెం నుంచి కొందరు జాలర్లు వేటకు వెళ్లారు. వీళ్ల వలకు ఓ భారీ చేప పడింది. ఇదే ఆనందంలో ఉండగానే ఓ పెద్ద చేప జాలరిపై దాడి చేసింది. చేపను బయటకు తీసే క్రమంలో జోగన్నపై  కొమ్ముకోనాం అనే చేప అటాక్ చేసింది. ఈ దాడికి ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. 
  
వలలో మంచి చేపలు పడ్డాయన్న ఆనందతో ఉన్న జాలర్లు ఈ ఘటనలో ఒక్కసారిగా విషాదంలోకి జారిపోయారు. జోగన్న మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. ఆ డెడ్‌బాడీని చూసి ఆయన ఫ్యామిలి కన్నీరుమున్నీరుగా విలపించింది. 

మృతి సంగతి తెలుసుకున్న పోలీసులు ముత్యాలపాలెం చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. చేప ఎలా ఉంటుందీ .. ఎలా దాడి చేసింది... జోగన్న ఎన్ని గంటలకు చనిపోయాడు వంటి విషయాలపై ఆరా తీశారు. 

కొమ్ముకోనాం అనే చాలా అరుదైన చేప ఈ దాడి చేసి జోగన్న ప్రాణాలను తీసింది. ఈ చేప దొరికిందంటే జాలర్లు ఆ రోజంతా పండగ చేసుకుంటారు. అలాంటి లాభాలను అందించే చేప ప్రాణాలు తీసింది. 

బంగాళాఖాతంలో దొరికే అతి అరుదైనా చేపల్లో ఒకటే ఈ కోనాం. కొమ్ము కోనాం భారీ సైజ్‌లో ఉంటుంది. సాధారణంగా దీన్ని కొన్ని ప్రాంతాల్లో వంజరం అని కూడా పిలుస్తారు. చిన్నగా ఉంటే అలా అంటారు. సైజ్‌ పెరిగితే కోనాం అంటారు. 

ఈ కోనాం చేపకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. కిలో వెయ్యిరూపాయల వరకు ధర పలుకుతుంది. అందుకే ఈ చేప పడిందంటే జాలర్లు ఫుల్ హ్యాపీ. కానీ ఆ చేపే ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. 

ఈ కొమ్ము కోనాం వలకు దొరకడం అంత ఈజీ కాదు. దొరికినా కొన్నిసార్లు వలను చీల్చుకొని తప్పించుకుంటుంది. ఇప్పుడు కూడా ఇదే జరిగిందంటున్నారు జోగన్నతో వెళ్లిన జాలర్లు. వలను పైకి లాగే టైంలో చేప జోగన్నను కొట్టి సముద్రంలో పడిపోయిందంటున్నారు. చేపకు ఉండే మూతి భాగం గట్టిగా తగిలేసరికి జోగన్న అక్కడికక్కడే పడిపోయాడని చెబుతున్నారు. 

Also Read: తూర్పుగోదావరి జిల్లాలో కలకలం... కల్లు తాగిన నలుగురు మృతి.. ఇంకొకరి పరిస్థితి విషమం

Also Read: ఈ ఊర్లో వారికి పిల్లను ఇవ్వటంలేదు, హైవేకు దగ్గర్లోనే గ్రామం.. 100 ఏళ్లుగా ఎన్నో కష్టాలు

Also Read త్వరలోనే ‘ఫిష్ ఆంధ్ర’ పథకం.. ట్రయల్ రన్‌లో జగనన్న చేపల వాహనాలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Embed widget