అన్వేషించండి

Avanthi Srinivas Resign To YSRCP: వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా

Vizag Latest News: ఎన్నికల ఓటమి తర్వాత వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే కీలకమైన నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పుడు ఉత్తరాంధ్రలో పెద్ద దెబ్బ తగలనుంది.

YSRCP Leader Avanthi Srinivas Resigned: వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. విశాఖలో కీలక నేతగా ఉన్న అవంతి శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అధికారికంగా ఇవాళ ప్రకటించారు. వైసీపీ ఒడిపోయిన తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. 2024లో భీమిలి నుంచి గంటా శ్రీనివాస రావుపై పోటీ చేసి ఓడిపోయారు. ఒకప్పుడు వీళ్లిద్దరూ మిత్రులుగా ఉండే వాళ్లు. తొలిసారి ఇద్దరూ పరస్పరం పోటీ పడ్డారు. 

పార్టీకి రాం రాం

వైసీపీ అధిష్ఠానానికి తన రాజీనామా లేఖను పంపించిన అవంతి శ్రీనివాస్‌ రాజకీయాలకు  దూరంగా ఉంటున్నట్టు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉంటానని లేఖలో తెలిపారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతలకి కూడా రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. తన రాజీనామాను ఆమోదించాలని అధిష్ఠానానికి సూచించారు. 

ప్రజలు ఎందుకు తిరస్కరించారో?

రాజీనామా తర్వాత మీడియాతో మాట్లాడుతూ వైసీపీ, జగన్‌పై విమర్శలు చేశారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారని ఆరోపించారు. కార్యకర్తలకు, నాయకులకు వైసీపీలో గౌరవం లేదని బాంబు పేల్చారు. కొత్త ప్రభుత్వానికి ఆరునెలల సమయం ఇవ్వాల్సింది పోయి అప్పుడే దాడి చేయడం సరికాదన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు తాను రాజకీయాల్లోకి వచ్చానంటు చెప్పుకొచ్చిన అవంతి... ఎలాంటి అవినీతికి పాల్పడలేదని అభిప్రాయపడ్డారు. ప్రజలకు న్యాయం చేయడానికి ప్రయత్నించినా ఎందుకు తమను తిరస్కరించారో అర్థం కావడం లేదని అన్నారు.  

పీఆర్‌పీ, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, ఇప్పుడు మళ్లీ ఏ పార్టీ?

అవంతి శ్రీనివాస్‌గా బాగా పరిచయమైన ముత్తంశెట్టి శ్రీనివాసరావు విద్యావేత్తగా ఉంటూ రాజకీయ రంగప్రవేశం చేశారు. చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయనపై ఉన్న అభిమానంతో అవంతి శ్రీనివాస్‌ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ పార్టీ తరఫున 2009లో భీమిలి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం అవ్వడంతో పరిస్థితి మారిపోయింది. ఆయన కాంగ్రెస్‌లో ఉండలేక టీడీపీలో చేరారు. 2014లో టీడీపీ నుంచి ఎంపీగా విజయం సాధించారు. అప్పుడు లోక్ సభలో రూల్స్ కమిటీ సభ్యుడిగా, పరిశ్రమపై స్టాండింగ్ కమిటీ, కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా చేశారు. 

Also Read: ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిన 2024 - కొత్త స్టార్‌ పవన్ కల్యాణ్ - జగన్ బిగ్గెస్ట్ లూజర్ !

జగన్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన అవంతి శ్రీనివాస్

2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందని ముందే గ్రహించిన అవంతి శ్రీనివాస్‌ వైసీపీలో చేరిపోయారు. అక్కడ భీమిలి నుంచి అసెంబ్లీ టికెట్‌ సంపాదించి విజయం సాధించారు. అంతేకాకుండా మంత్రిగా కూడా పని చేశారు. ఏపీ పర్యాటక, సంస్కృతి, యువజనాభివృద్ధి శాఖ మంత్రిగా సేవలు అందించారు. 

Image

టీడీపీలోకి వెళ్తారని టాక్ నడుస్తోంది

2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత అవంతి శ్రీనివాస్‌ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు.  ఇప్పుడు ఆయనపార్టీకి రాజీనామా చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టీడీపీ నేతలతో మాట్లాడారాని ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని టాక్ నడుస్తోంది. మరి ఆయన ఏం చెప్పబోతున్నారు... అనేది సస్పెన్స్‌గా మారింది. 

Also Read: మమతా బెనర్జీ నేతృత్వంలోకి ఇండియా కూటమి - చేరేందుకు వైఎస్ఆర్‌సీపీ సిద్దమని సంకేతాలు ?

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Utnoor Gond Fort: ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
Embed widget