అన్వేషించండి

Roja Comments: ఆంధ్ర దిష్టిబొమ్మ చంద్రబాబు ఫోటో వేయాలా.? : ఆడుదాం ఆంధ్రా ఫైనల్ పోటీల ప్రారంభంలో మంత్రి రోజా

Minister Roja Comments In Vizag: చంద్రబాబునాయుడుపై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. ఆడదాం ఆంధ్ర కిట్లపై సీఎం జగన్ ఫోటో కాకుండా ఆంధ్ర దిష్టిబొమ్మ చంద్రబాబు ఫోటో వేయాల అని ఆమె ప్రశ్నించారు.

Adudam Andhra News: విశాఖలో ఆడుదాం ఆంధ్రా తుది పోటీలను విశాఖలోని రైల్వే స్టేడియంలో శుక్రవారం ఉదయం పర్యాటక, క్రీడాశాఖ మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. ఈ నెల 9 నుంచి 13 వరకు ఫైనల్ పోటీలు జరగనున్నాయి. ఫైనల్ పోటీలను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన మంత్రి రోజా ప్రతిపక్షాలు, వారికి సహకరించే మీడియాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆడుదాం ఆంధ్రా కిట్‌లపై సీఎం ఫోటో వేస్తే తప్పేంటి? అని ప్రశ్నించిన మంత్రి రోజా.. ఆంధ్రా దిష్టిబొమ్మ చంద్రబాబు ఫోటో వేయాలా? అని పేర్కొన్నారు. పచ్చ మీడియా కడుపు మంటతో రగిలిపోతోంద‌ని మంత్రి రోజా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 2024 ఎన్నికల తర్వాత నాన్ లోకల్‌ పొలిటీషియన్‌లు చంద్రబాబు, పవన్,  లోకేష్, షర్మిల తెలంగాణా  పారిపోవడం ఖాయమని, జగన్‌మోహన్‌రెడ్డి సింహంలా మ్యానిఫెస్టోతో సిద్దంగా వుంటే, ప్రతి పక్ష పార్టీలు  ఇంకా సిద్దంగా లేరని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో వార్ వన్ సైడ్‌ అని, మళ్లీ జగన్‌ సీఎం కావడం ఖాయమ‌ని ఆమె ధీమా వ్య‌క్తం చేశారు. 

షర్మిలపైనా రోజా తీవ్ర ఆగ్రహం

షర్మిల ఇప్పుడు ఏ పార్టీలో ఉందో ఒకసారి గమనించాలని, వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డిని జైలు పాలు చేసిన పార్టీతో చేతులు కలిపి అన్యాయం చేశారని ఆరోపించారు. షర్మిలకి తాను ఒక సలహా ఇస్తున్నానని, ఇప్పుడు తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి నుంచి మనకి రావాల్సిన ఆరు వేల కోట్లు, ఉమ్మడి ఆంధ్ర హయాంలో ఏపీకి రావాల్సిన లక్ష 80 కోట్ల ఆస్తులు రాబ‌ట్టాలన్నారు. టూర్ లు పెట్టి ప్రచారం చేస్తున్నారని, తెలంగాణలో పోరాటం చేస్తా అని చెప్పి కాంగ్రెస్ లో విలీనం ఎందుకు చేసిందో షర్మిల చెప్పాలని మంత్రి రోజా డిమాండు చేశారు. ఏపీలో ఏమి లబ్ది పొందడానికి కాంగ్రెస్ తరుపున ప్రచారం చేస్తున్నారో షర్మిల చెప్పాలని, వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే కాంగ్రెస్ మీద ఉమ్మేసి ఉండే వాళ్ళు అని చెప్పిన షర్మిల.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని కాంగ్రెస్ లో మళ్ళీ జాయిన్ అయ్యారో చెప్పాలని మంత్రి నిల‌దీశారు. గట్స్‌ ఉన్న నాయకుడు వైయ‌స్ జ‌గ‌న్‌ అని, చంద్రబాబు, లోకేశ్‌, టీడీపీని జాకీలు పెట్టి లేపినా జాకీలు విరిగిపోతున్నాయన్నారు. బాబు తమ చిత్తూరు జిల్లాలో పుట్టడం సిగ్గుచేటు అని మంత్రి దుయ్య‌బ‌ట్టారు. అధికారంలోకి రావాలన్న కాంక్షతోనే కాంగ్రెస్‌తో ఒకసారి, బీజేపీతో ఇంకోసారి పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పొలిటికల్‌గా రోజురోజుకు చంద్ర‌బాబు దిగజారిపోతున్నారని ఎద్దేవా చేశారు. 

ఆడుదాం ఆంధ్రతో యువతకు మేలు

గ్రామీణస్థాయి నుంచి యువతలో క్రీడా నైపుణ్యాలను వెలికి తీయడమే లక్ష్యంగా ప్రారంభించిన మెగా టోర్నీ ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో పోటీల‌ను నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. నాలుగు దశల్లో నిర్వహించిన క్రికెట్‌, వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్‌ పోటీలకు విశేష స్పందన వచ్చిందని, జిల్లా స్థాయిలో సత్తా చాటిన జట్లతో రాష్ట్ర స్థాయి పోటీలను ఈ నెల 13 వరకు ఫైన‌ల్ పోటీలు నిర్వ‌హించ‌నున్నట్టు తెలిపారు. ఆడుదాం ఆంధ్ర ఫైనల్స్ కు 260 జట్లతో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నరని, ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు మహా సంగ్రామం జరగనుందని,13న ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి జగన్‌ హాజరుకానున్నారని తెలిపారు. ఈ క్రీడల్లో విజేతలకు దాదాపు రూ.12 కోట్ల బహుమతులుగా ఇస్తున్నామని పేర్కొన్నారు. ఆమెతో పాటు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టాప్ హెడ్ లైన్స్

AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Rains In AP, Telangana: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Embed widget