అన్వేషించండి

నెగ్గుతోంది ప్రభుత్వ పంతం.. టైంసరికి పడుతుందా వేతనం..

జీతాలు, పెన్షన్ ల ప్రాసెస్ మొదలు పెట్టిన ట్రెజరీ శాఖ. ఒకటో తారీఖు జీతాలు పడతాయా లేదా అన్నదానిపై అంతా ఉత్కంఠ. సమ్మె పై ఆర్టీసీ ఉద్యోగుల్లో మొదలైన చీలిక. మిగతా సంఘాల్లోనూ విభేదాలు ఖాయమంటూ సంకేతాలు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల ఉద్యమంపై కన్నెర్రజేస్తుంది. పీఆర్సీ సాధనా సమితి పేరుతో ఉద్యోగులు చేస్తున్న ఉద్యమం  ప్రారంభమై చాలా రోజులు కావడం..ఉద్యోగ సంఘాలు వచ్చేనెల 7 నుంచి సమ్మెకు వెళ్ళడానికి సిద్ధం అవుతుండడం లాంటివి ప్రభుత్వ ప్రతిష్ట  ఇబ్బందిగా మారుతుండడంపై ఉద్యోగులను దారికి తేవడానికి కొత్త వ్యూహాలు రచిస్తుంది ఏపీ సర్కార్ .  

విఫలమైన మంత్రుల కమిటీ చర్చల వ్యూహం 
కేవలం 23శాతం  పీఆర్సీ , HRA తగ్గింపు లాంటి అంశాలపై ఉద్యోగులకు నచ్చజెప్పడానికంటూ ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. అయితే కొత్త పీఆర్సీ జీవోలను రద్దు చెయ్యకుండా చర్చలకు వచ్చేది లేదని పీఆర్సీ సాధనా సమితి చెప్పడంతో ఆ వ్యూహం పని చెయ్యలేదు. అదే సమయంలో కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు రెడీ చెయ్యాలంటూ ట్రెజరీ శాఖను ఆదేశించగా వారు సైతం ఉద్యోగుల నిరసనకు మద్దతు ప్రకటించారు. సాటి ఉద్యోగుల వైపే తాముంటామని సంపూర్ణ మద్దతు ప్రకటించారు . 

ట్రెజరీ ఉద్యోగులపై ప్రభుత్వం కన్నెర్ర 
జనవరి నెల జీతాలను ప్రాసెస్ చేయాలని, విధులకు హాజరు కాకపోతే తీవ్ర చర్యలు ఉంటాయని మళ్లీ మళ్లీ ఆదేశాలు ఇస్తున్నప్పటికీ ట్రెజరీ ఉద్యోగులు మాత్రం నిన్నటివరకూ మెట్టు దిగలేదు. ఈ పరిణామాల మధ్య అనూహ్యంగా ట్రెజరీ ఉద్యోగులు, డీడీవోలు విధులకు హాజరు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆదివారం సెలవురోజు అయినప్పటికీ- వారు విధులకు హాజరయ్యారు. వేతనల ప్రాసెసింగ్‌ను మొదలుపెట్టారు. జిల్లా కేంద్రాల్లో ట్రెజరీ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులు, ఇతర సిబ్బంది విధులకు హాజరయ్యారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన పింఛన్ మొత్తాన్ని ఇదివరకే ప్రాసెస్ చేశారు. మూడు శాఖల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని, ఆ ఉద్యోగులకు కూడా జీతాలు చెల్లించేలా ప్రాసెసింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. న్యాయస్థానాలు, పోలీస్ శాఖల్లో పనిచేస్తోన్న ఉద్యోగుల జీతాలను చెల్లించేలా ట్రెజరీ సిబ్బంది తమ ప్రాసెసింగ్‌ను కొనసాగిస్తున్నట్లు వారు చెబుతున్నారు. మున్సిపల్ ఉద్యోగుల వేతనాలను కూడా చెల్లించేలా చర్యలు తీసుకున్నారు . దీనికోసం 50 శాతం మంది ట్రెజరీ ఉద్యోగులు హాజరయ్యారు. దీనితో ఉద్యోగుల ఐక్యత చీలిక ప్రారంభమైందా అన్న అనుమానాలు మొదలయ్యాయి . 

ఒక్కసారిగా బయటపడిన  ఆర్టీసీ ఉద్యోగుల్లో చీలిక 
  
ఉద్యోగ సంఘాలు తమ ఉద్యమ పోరాటంలో ఆశలు పెట్టుకున్న విభాగం ఆర్టీసీ. ఫిబ్రవరి 7 నుంచి సమ్మెకు నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో ఆర్టీసీ కూడా రంగంలోకి దిగితే ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరుగుతుంది అని ఉద్యోగసంఘాల భావిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆర్టీసీ సంఘాల్లోనూ చీలికలు వస్తున్నట్టు తెలుస్తుంది. ఫిబ్రవరి7 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్జీవో సంఘాల నాయకులు తలపెట్టిన
సమ్మెకు ఏపీఎస్ ఆర్టీసీ వైఎస్సార్ ఎంప్లాయిస్ అసోసియేషన్ దూరంగా ఉంటున్నట్లు వైఎస్సార్ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు ఫక్రుద్దీన్ స్పష్టం చేశారు. వైఎస్సార్ ఎంప్లాయిస్ యూనియన్ తరపున ఎవరూ సమ్మెలో పాల్గొనేది లేదని ఫక్రుద్దీన్ స్పష్టం చేశారు. గతంలో ఆర్టీసీ కార్పొరేషన్‌గా ఉన్నప్పుడు కార్మికులను, ఉద్యోగులను పట్టించుకున్న నాథుడే లేడని, నాడు అనేక కార్మిక వ్యతిరేక చట్టాలు తెచ్చినా ఒక్కరు స్పందించలేదని మండిపడ్డారు.
తన పాదయాత్రలో ఆర్టీసీ కార్మికులకు, ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు 2019 లో ముఖ్యమంత్రి అయిన వెంటనే వైఎస్ జగన్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారని పేర్కొన్నారు. ఆర్టీసీలో మెజారిటి యూనియన్ సభ్యులు సమ్మెకు దూరంగా ఉంటారన్నారు. ఆర్టీసీ కార్మికులను  , ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఉద్యోగుల అందరి తరపున ధన్యవాదాలు తెలిపారు. 54 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులు గా గుర్తించారని, కరోనా కష్ట కాలంలోనూ అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి నెల జీతాలు క్రమం తప్పకుండా చెల్లించారని స్పష్టం చేశారు. 7 నుంచి జరిగే సమ్మె బహిష్కరించి అన్ని ఆర్టీసీ సేవలు అందిస్తామని వైఎస్సార్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యులు స్పష్టం చేశారు. దీనితో అసలు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల్లోనూ చీలిక మొదలైందని స్పష్టం అవుతుంది . 

ఉద్యోగ సంఘాల డిమాండ్  పీఆర్సీ పైనా ? HRA పైనా అంటున్న ప్రభుత్వం ?
  
ఉద్యోగ సంఘాలు నిజానికి ప్రభుత్వం పీఆర్సీ విషయంలో 23 శాతం ఫిట్మెంట్ ప్రకటించినప్పుడు స్వాగతించాయి. తరువాత HRA తగ్గించినప్పుడు మాత్రమే తమ ఉద్యమాన్ని ఉద్దృతం చేసిన మాట వాస్తవం. అయితే పీఆర్సీ సాధనా సమితి డిమాండ్ చేస్తున్న ప్రాథమిక అంశాల్లో HRA కన్నా పీఆర్సీకే ప్రాధాన్యత ఇస్తున్నారు . కిందిస్థాయి ఉద్యోగులకు HRA కన్నా పీఆర్సీపైనే ఆందోళన ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ఎక్కువగా ఎక్కువ పీఆర్సీ నే డిమాండ్ చేస్తున్నాయి. దానితో ఉద్యమం మొదలైన HRA తగ్గింపు అంశం కన్నా పీఆర్సీపై దృష్టి వెళ్ళింది. ఇది అవకాశంగా తీసుకునే ప్రభుత్వ కమిటీలు ఉద్యోగ సంఘాలను విమర్శిస్తున్నాయి . 

అకస్మాత్తుగా HRA పెంచిన ప్రభుత్వం -విజయవాడ ఉద్యోగులకే అంటూ మెలిక :
ఉద్యోగ సంఘాలను చీల్చడానికి ఏ అవకాశం వచ్చినా వదులుకోకుండా వ్యూహం పన్నుతున్న ప్రభుత్వం తాజాగా విభజన తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి పనిచేస్తున్న ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏను 8 శాతం నుంచి 16 శాతంకు పెంచుతూ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు. హెచ్ఓడీ అధికారుల సిఫార్సుల మేరకు హెచ్ఆర్ఏను ప్రభుత్వం సవరించింది. ఇది ఉద్యోగుల ఉద్యమానికి పెద్ద దెబ్బ అని ప్రభుత్వం భావిస్తుంది. అయితే దీనిపై అప్పుడే అంచనాకు రాలేమని విశ్లేషకులు అంటున్నారు. 

ఉద్యమ కార్యాచరణపై తగ్గేదే లేదు  :పీఆర్సీ సాధనా సమితి 
అయితే ఉద్యోగ సంఘాల వాదన మరోలా ఉంది. తమ ఐక్యతను దెబ్బతీయడానికి ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తున్న మాట వాస్తవమే అని అయితే తమ పోరాటం మాత్రం ముందుకే వెళుతుంది తప్ప భయపడేది లేదని వారు అంటున్నారు. తాము తలపెట్టిన చలో విజయవాడ మొదలుకొని 7వ తేదీ నుంచి ప్రకటించిన సమ్మె వరకూ తమ కార్యాచరణ అమలై తీరుతుంది అంటున్నారు వారు. వీటన్నటి నేపథ్యంలో ఉద్యోగ సంఘాలను చీల్చాలన్న ప్రభుత్వ వ్యూహం పని చేస్తుందా లేక పీఆర్సీపై తాడో-పేడో తేల్చుకోవాలనుకుంటున్న ఉద్యోగ సంఘాల పట్టుదల ఫలిస్తుందా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే .. !

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: గన్‌పార్క్‌కు చేరిన రుణమాఫీ రాజకీయం- రాజీనామాకు రావాలని రేవంత్‌కు హరీష్‌ సవాల్
గన్‌పార్క్‌కు చేరిన రుణమాఫీ రాజకీయం- రాజీనామాకు రావాలని రేవంత్‌కు హరీష్‌ సవాల్
Bhuvaneswari Audio: భువనేశ్వరి పేరుతో సోషల్ మీడియాలో బూతుల ఆడియో వైరల్‌- డీప్‌ ఫేక్‌ అంటున్న టీడీపీ
భువనేశ్వరి పేరుతో సోషల్ మీడియాలో బూతుల ఆడియో వైరల్‌- డీప్‌ ఫేక్‌ అంటున్న టీడీపీ
Jr NTR: ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
Renu Desai: పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్న రేణు దేశాయ్‌ పోస్ట్‌ - మాజీ భర్తకు కాకుండా, అనూహ్యంగా ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా.. 
పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్న రేణు దేశాయ్‌ పోస్ట్‌ - మాజీ భర్తకు కాకుండా, అనూహ్యంగా ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా.. 
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

SRH vs RCB Match Highlights | ఆర్సీబీ విక్టరీతో సంతోషంలో చెన్నై, ముంబై ఇండియన్స్ | ABP DesamSRH vs RCB Match Highlights | సన్ రైజర్స్ మీద మ్యాచ్ గెలిపించిన ఆర్సీబీ బౌలర్లు | IPL 2024 | ABPVirat Kohli Half Century | SRH vs RCB మ్యాచ్ లో మరో అర్థశతకం చేసిన విరాట్ కొహ్లీ | IPL 2024 | ABPSRH vs RCB Match Highlights | ఉప్పల్ లో సన్ రైజర్స్ కి ఓటమి రుచి చూపించిన ఆర్సీబీ | IPL 2024 | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: గన్‌పార్క్‌కు చేరిన రుణమాఫీ రాజకీయం- రాజీనామాకు రావాలని రేవంత్‌కు హరీష్‌ సవాల్
గన్‌పార్క్‌కు చేరిన రుణమాఫీ రాజకీయం- రాజీనామాకు రావాలని రేవంత్‌కు హరీష్‌ సవాల్
Bhuvaneswari Audio: భువనేశ్వరి పేరుతో సోషల్ మీడియాలో బూతుల ఆడియో వైరల్‌- డీప్‌ ఫేక్‌ అంటున్న టీడీపీ
భువనేశ్వరి పేరుతో సోషల్ మీడియాలో బూతుల ఆడియో వైరల్‌- డీప్‌ ఫేక్‌ అంటున్న టీడీపీ
Jr NTR: ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
Renu Desai: పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్న రేణు దేశాయ్‌ పోస్ట్‌ - మాజీ భర్తకు కాకుండా, అనూహ్యంగా ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా.. 
పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్న రేణు దేశాయ్‌ పోస్ట్‌ - మాజీ భర్తకు కాకుండా, అనూహ్యంగా ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా.. 
Lok Sabha Election 2024 Phase 2: కొనసాగుతున్న రెండో దశ పోలింగ్, బరిలో రాహుల్ గాంధీ సహా కీలక అభ్యర్థులు
Lok Sabha Election 2024 Phase 2: కొనసాగుతున్న రెండో దశ పోలింగ్, బరిలో రాహుల్ గాంధీ సహా కీలక అభ్యర్థులు
Megha Akash: పెళ్లి పీట‌లెక్క‌బోతున్న మేఘ ఆకాశ్? ఆ ఫొటోకి అర్థం అదేనా?
పెళ్లి పీట‌లెక్క‌బోతున్న మేఘ ఆకాశ్? ఆ ఫొటోకి అర్థం అదేనా?
KCR: ఇది దద్దమ్మ ప్రభుత్వం కాకుంటే ఏందన్నట్టు? నా బిడ్డను తీసుకపోయి అరెస్ట్ చేసిన్రు - కేసీఆర్
ఇది దద్దమ్మ ప్రభుత్వం కాకుంటే ఏందన్నట్టు? నా బిడ్డను తీసుకపోయి అరెస్ట్ చేసిన్రు - కేసీఆర్
ITR 2024: కొత్త పన్ను విధానం Vs పాత పన్ను విధానం - మీకు ఏది సూటవుతుంది?
కొత్త పన్ను విధానం Vs పాత పన్ను విధానం - మీకు ఏది సూటవుతుంది?
Embed widget