అన్వేషించండి

CM Jagan: విశాఖ జిల్లాలో ఈ నెల28న ముఖ్యమంత్రి పర్యటన- పైడివాడలో పట్టాల పంపిణీ

ముఖ్యమంత్రి జగన్ విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. 28న జరిగే పర్యటనలో హౌసింగ్ లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేస్తారు.

విశాఖ జిల్లాలోని సబ్బవరం మండలంలో ఈ నెల 28వ తేదీన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. పైడివాడ గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఈ పర్యటనకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నట్టు చెప్పారు జిల్లాకలెక్టర్‌ మల్లిఖార్జున. 

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ కార్యాలయంలో  కలెక్టర్‌ మల్లిఖార్జున సమీక్ష నిర్వహించారు. పైడివాడ గ్రామంలో హౌసింగ్ పట్టాలకు సంబంధించిన లే అవుట్ సిద్దం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశం వద్ద మహిళలకు, పురుషులకు వేర్వేరుగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని జివిఎంసి అధికారులకు సూచించారు. తాగునీరు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎండలు ఎక్కువగా ఉన్నందు వల్ల ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఆంబులెన్స్‌లు, మందులు అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య అధికారులకు ఆదేశించారు. పార్కింగ్ వద్ద సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి ఎస్ అధికారులకు ఆదేశించారు. సమావేశం వద్ద, హెలీప్యాడ్ వద్ద బ్యారికేడ్స్ ఏర్పాటు చేయాలని ఎస్ఇకి చెప్పారు. 

పైడివాడలో ఎంత మంది లబ్ధిదారులు ముఖ్యమంత్రి సమావేశానికి హాజరు కావాలో తెలియజేయాలని హౌసింగ్ పిడీని ఆదేశించారు జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున. పట్టా, గృహ మంజూరు పత్రాలు ముఖ్యమంత్రి చేతులు మీదుగా లబ్ధిదారులకు అందజేస్తారని పేర్కొన్నారు. వివిధ అభివృద్ధి పథకాలపై లబ్ధిదారులు, ఖర్చులు, సంబంధిత వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రెడీ చేయాలని విఎండిఎ అధికారులను ఆదేశించారు. ల్యాండ్ పూలింగ్, హౌస్ సైట్‌లపై లబ్ధిదారులు మాట్లాడుతారని దానికి సంబంధించిన వివరాలు అందజేయాలన్నారు. హౌసింగ్ మంజూరు, స్టాల్స్, భోజన ఏర్పాట్లు, పార్కింగ్స్, తదితర అంశాలపై చర్చించారు. 

రానున్న రెండు రోజుల్లో అనకాపల్లి జిల్లా అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని డిఆర్ఓను ఆదేశించారు విశాఖ జిల్లా కలెక్టర్. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి పట్టాల పంపిణీకి కౌంటర్లు ఏర్పాటు చేయాలని హౌసింగ్ పీడీని ఆదేశించారు. ఇళ్ల పట్టాలు, గృహ మంజూరు పత్రాలు పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అందుకు సంబంధించిన ఆర్డీవోలతో చర్చించాలన్నారు.  

ఈ మధ్య నిర్వహించిన వైసీపీఎల్పీలో మాట్లాడిన జగన్... నేతలంతా ప్రజల్లో ఉండాలని సూచించారు. ఇప్పుడు వారితో పాటు ముఖ్యమంత్రి కూడా ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇన్నాళ‌్లూ కరోనా కారణంగా బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు. ఇప్పుడు వ్యాధి తీవ్రత పూర్తిగా తగ్గిపోవడంతో మళ్లీ తరచూ ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. 

మంత్రి వర్గ విస్తరణ తర్వాత వచ్చి అసంతృప్తి స్వరాలు పూర్తిగా మూగబోయిన ఈ పరిస్థితుల్లో పార్టీ పటిష్టతపై జగన్ దృష్టి పెట్టారు. జిల్లా స్థాయి నేతలను కలవడం లేదన్న ఆరోపణలకు చెక్‌ చెప్పేలా... ఇలా జిల్లా టూర్లకు వెళ్లే ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget