అన్వేషించండి

Somu Veerraju On Janasena : జనంతోనే మా పొత్తు, కలిసి వస్తే జనసేనతో- సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు

Somu Veerraju On Janasena : జనసేనతో పొత్తుపై సోము వీర్రాజు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. జనంతోనే పొత్తు అని, కలిసి వస్తే జనసేనతో పొత్తు అన్నారు.

Somu Veerraju On Janasena : మోదీ ప్రభుత్వం వచ్చాక బడ్జెట్ పై ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ పై ప్రణాళికతో ముందుకెళ్తున్నామని, అందుకే ఆర్థిక క్రమశిక్షణను అమలు చేస్తున్నామన్నారు.  అభివృద్ధి, మౌలిక అవసరాలకు క్యాపిటల్ ఇన్వెస్ట్ మెంట్ పెంచుకుంటూ వస్తున్నామన్నారు. దేశంలో మత్య్స సంపద పెంచుతున్నామన్నారు. ఏపీ నుంచి 40 శాతం మత్స్యసంపద వస్తుందని గుర్తుచేశారు. సేంద్రియ వ్యవసాయంపై ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రపంచంలో 5వ ఆర్థిక దేశంగా భారత్ ఎదిగిందన్నారు. అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలకు కేంద్ర బడ్జెట్ అనుకూలంగా ఉందన్నారు. డిజిటలైజేషన్ లో ప్రపంచంలో భారత్ ముందు స్థానంలో ఉందని సోము వీర్రాజు అన్నారు. డిజిటల్ పేమెంట్స్ ద్వారా ఆర్థికంగా ప్రగతి సాధించామన్నారు. రూ.10 లక్షల కోట్లు మౌలిక పెట్టుబడులు, వివిధ వర్గాల కోసం బడ్జెట్ లో కేటాయించారమన్నారు.  మానవ వనరులపై ఎక్కువ దృష్టి పెట్టామన్నారు. యువ శక్తిని ఆర్థిక శక్తిని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయింపులు చేశారన్నారు. రూ.20 లక్షల కోట్లు వ్యవసాయ అబివృద్ధి, పాడి సంపద పెంపునకు కేటాయించారని తెలిపారు. 

" టూరిజం అబివృద్ధి చేయడంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. టూరిజం అబివృద్ధికి కేంద్రం కృషి చేస్తోంది. 10 నుంచి 5వ స్థానానికి వచ్చింది. ఏపీకి బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్రం న్యాయం చేసింది. రైల్వే స్టేషన్లకు నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తున్నాం. "- సోము వీర్రాజు 

జనసేనతో పొత్తుపై కీలక వ్యాఖ్యలు 

జనసేనతో పొత్తుపై సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ, టీడీపీలు ఒకే నాణానికి ఉన్న బొమ్మా, బొరుసు అన్నారు. అవి కుటుంబ పార్టీలన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా పోవడానికి కారణం కుటుంబ పార్టీలే అని సోము వీర్రాజు విమర్శించారు. జనసేన కుటుంబ పార్టీ కానే కాదన్న సోము వీర్రాజు..జనంతోపొత్తు లేకపోతే జనసేనతో పొత్తు అన్న మాటకు వివరణ ఇచ్చారు. జనంతో బీజేపీ పొత్తు అనే మాట చాలా బలమైందన్నారు. ఈ వ్యాఖ్య వెనుక ఎంతో అర్థం ఉందన్నారు. జనంతోనే పొత్తు.. వస్తే జనసేనతో పొత్తు అంటూ స్పష్టం చేశారు. ప్రజలను రోడ్ల మీద వదిలేసిన పార్టీలతో బీజేపీ పొత్తు ఉండదన్నారు. బీజేపీ రోడ్లు వేస్తే జగన్ అరగ్గొట్టారన్నారు.  ఇప్పుడు యువ నాయకుడు లోకేశ్ పాదయాత్ర ప్రారంభించారని ఎద్దేవా చేశారు. జగన్ సర్కార్ తప్పిదాలపై ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని సోము వీర్రాజు అన్నారు. త్వరలోనే పాదయాత్రలు చేస్తామన్నారు. అధికారం, అవినీతి కోసమే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. గతంలో టీడీపీ కూడా అదే పనిచేసిందని, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్లు అదే చేస్తున్నారన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget