అన్వేషించండి

Somu Veerraju On Janasena : జనంతోనే మా పొత్తు, కలిసి వస్తే జనసేనతో- సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు

Somu Veerraju On Janasena : జనసేనతో పొత్తుపై సోము వీర్రాజు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. జనంతోనే పొత్తు అని, కలిసి వస్తే జనసేనతో పొత్తు అన్నారు.

Somu Veerraju On Janasena : మోదీ ప్రభుత్వం వచ్చాక బడ్జెట్ పై ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ పై ప్రణాళికతో ముందుకెళ్తున్నామని, అందుకే ఆర్థిక క్రమశిక్షణను అమలు చేస్తున్నామన్నారు.  అభివృద్ధి, మౌలిక అవసరాలకు క్యాపిటల్ ఇన్వెస్ట్ మెంట్ పెంచుకుంటూ వస్తున్నామన్నారు. దేశంలో మత్య్స సంపద పెంచుతున్నామన్నారు. ఏపీ నుంచి 40 శాతం మత్స్యసంపద వస్తుందని గుర్తుచేశారు. సేంద్రియ వ్యవసాయంపై ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రపంచంలో 5వ ఆర్థిక దేశంగా భారత్ ఎదిగిందన్నారు. అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలకు కేంద్ర బడ్జెట్ అనుకూలంగా ఉందన్నారు. డిజిటలైజేషన్ లో ప్రపంచంలో భారత్ ముందు స్థానంలో ఉందని సోము వీర్రాజు అన్నారు. డిజిటల్ పేమెంట్స్ ద్వారా ఆర్థికంగా ప్రగతి సాధించామన్నారు. రూ.10 లక్షల కోట్లు మౌలిక పెట్టుబడులు, వివిధ వర్గాల కోసం బడ్జెట్ లో కేటాయించారమన్నారు.  మానవ వనరులపై ఎక్కువ దృష్టి పెట్టామన్నారు. యువ శక్తిని ఆర్థిక శక్తిని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయింపులు చేశారన్నారు. రూ.20 లక్షల కోట్లు వ్యవసాయ అబివృద్ధి, పాడి సంపద పెంపునకు కేటాయించారని తెలిపారు. 

" టూరిజం అబివృద్ధి చేయడంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. టూరిజం అబివృద్ధికి కేంద్రం కృషి చేస్తోంది. 10 నుంచి 5వ స్థానానికి వచ్చింది. ఏపీకి బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్రం న్యాయం చేసింది. రైల్వే స్టేషన్లకు నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తున్నాం. "- సోము వీర్రాజు 

జనసేనతో పొత్తుపై కీలక వ్యాఖ్యలు 

జనసేనతో పొత్తుపై సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ, టీడీపీలు ఒకే నాణానికి ఉన్న బొమ్మా, బొరుసు అన్నారు. అవి కుటుంబ పార్టీలన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా పోవడానికి కారణం కుటుంబ పార్టీలే అని సోము వీర్రాజు విమర్శించారు. జనసేన కుటుంబ పార్టీ కానే కాదన్న సోము వీర్రాజు..జనంతోపొత్తు లేకపోతే జనసేనతో పొత్తు అన్న మాటకు వివరణ ఇచ్చారు. జనంతో బీజేపీ పొత్తు అనే మాట చాలా బలమైందన్నారు. ఈ వ్యాఖ్య వెనుక ఎంతో అర్థం ఉందన్నారు. జనంతోనే పొత్తు.. వస్తే జనసేనతో పొత్తు అంటూ స్పష్టం చేశారు. ప్రజలను రోడ్ల మీద వదిలేసిన పార్టీలతో బీజేపీ పొత్తు ఉండదన్నారు. బీజేపీ రోడ్లు వేస్తే జగన్ అరగ్గొట్టారన్నారు.  ఇప్పుడు యువ నాయకుడు లోకేశ్ పాదయాత్ర ప్రారంభించారని ఎద్దేవా చేశారు. జగన్ సర్కార్ తప్పిదాలపై ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని సోము వీర్రాజు అన్నారు. త్వరలోనే పాదయాత్రలు చేస్తామన్నారు. అధికారం, అవినీతి కోసమే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. గతంలో టీడీపీ కూడా అదే పనిచేసిందని, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్లు అదే చేస్తున్నారన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Somu Veerraju: జగన్ నాకు సన్నిహితుడు కాదు, వైసీపీ అధినేతతో స్నేహంపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
జగన్ నాకు సన్నిహితుడు కాదు, వైసీపీ అధినేతతో స్నేహంపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
Telangana News: పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ !
పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ !
Nara Lokesh: రాష్ట్రంలో 125 కొత్త స్పెషల్ నీడ్స్ పాఠశాలలు: మంత్రి నారా లోకేష్
రాష్ట్రంలో 125 కొత్త స్పెషల్ నీడ్స్ పాఠశాలలు: మంత్రి నారా లోకేష్
Kannada Actress Ranya Rao: కోర్టులో బోరున విలపించిన రన్యా రావు... బంగారం స్మగ్లింగ్ కేసులో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
కోర్టులో బోరున విలపించిన రన్యా రావు... బంగారం స్మగ్లింగ్ కేసులో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

DMK Uncivilised Heated Argument in Parliament | నోరు జారిన ధర్మేంద్ర ప్రధాన్..ఒళ్లు దగ్గర పెట్టుకోమన్న స్టాలిన్ | ABP DesamChampions Trophy 2025 Winners Team India | కాలు కదపకుండా ఆడి ట్రోఫీ కొట్టేశామా | ABP DesamRohit Sharma Virat Kohli Kolatam | వైట్ కోటులతో రచ్చ చేసిన టీమిండియా హీరోలు | ABP DesamRohit Sharma Fitness Champions Trophy 2025 | ఫిట్ నెస్ లేకుండానే రెండు ఐసీసీ ట్రోఫీలు కొట్టేస్తాడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Somu Veerraju: జగన్ నాకు సన్నిహితుడు కాదు, వైసీపీ అధినేతతో స్నేహంపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
జగన్ నాకు సన్నిహితుడు కాదు, వైసీపీ అధినేతతో స్నేహంపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
Telangana News: పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ !
పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ !
Nara Lokesh: రాష్ట్రంలో 125 కొత్త స్పెషల్ నీడ్స్ పాఠశాలలు: మంత్రి నారా లోకేష్
రాష్ట్రంలో 125 కొత్త స్పెషల్ నీడ్స్ పాఠశాలలు: మంత్రి నారా లోకేష్
Kannada Actress Ranya Rao: కోర్టులో బోరున విలపించిన రన్యా రావు... బంగారం స్మగ్లింగ్ కేసులో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
కోర్టులో బోరున విలపించిన రన్యా రావు... బంగారం స్మగ్లింగ్ కేసులో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
ICC Champions Trophy: ప్లేయ‌ర్ ఆఫ్ ద టోర్నీ ఇండియ‌న్ కే ఇవ్వాల్సింది.. నేనేతై అలాగే చేసేవాడిని: అశ్విన్
ప్లేయ‌ర్ ఆఫ్ ద టోర్నీ ఇండియ‌న్ కే ఇవ్వాల్సింది.. నేనేతై అలాగే చేసేవాడిని: అశ్విన్
Weight Loss Meal Plan : పోషకాలతో కూడిన హెల్తీ డైట్​ ప్లాన్.. ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ ఇది
పోషకాలతో కూడిన హెల్తీ డైట్​ ప్లాన్.. ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ ఇది
Rohit Sharma Lands In Mumbai: దుబాయ్ నుంచి వచ్చిన రోహిత్ శర్మ, ముంబైకి చేరుకున్న భారత కెప్టెన్
దుబాయ్ నుంచి వచ్చిన రోహిత్ శర్మ, ముంబైకి చేరుకున్న భారత కెప్టెన్
Telugu TV Movies Today: చిరంజీవి ‘చూడాలని వుంది’, మహేష్ ‘ఒక్కడు’ to వెంకటేష్ ‘బొబ్బిలి రాజా’, నితిన్ ‘శ్రీ ఆంజనేయం’ వరకు - ఈ మంగళవారం (మార్చి 11) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
చిరంజీవి ‘చూడాలని వుంది’, మహేష్ ‘ఒక్కడు’ to వెంకటేష్ ‘బొబ్బిలి రాజా’, నితిన్ ‘శ్రీ ఆంజనేయం’ వరకు - ఈ మంగళవారం (మార్చి 11) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Embed widget