అన్వేషించండి

అసెంబ్లీ ఎన్నికలు 2026

(Source:  Poll of Polls)

Visakha Land Issue : విశాఖలో వ్యాపారం మానేస్తానంటున్న ఎంపీ ఎంవీవీ - కబ్జా ఆరోపణలే చేయలేదంటున్న ఎస్పీ

Visakha Land Issue : విశాఖ ఎంపీ వర్సెస్ ఎస్పీ భూవివాదం కీలక మలుపు తిరిగింది. వీరిద్దరూ కలిసి ఇవాళ వివాద స్థలంలోనే ప్రెస్ మీట్ పెట్టారు. ఇద్దరం కాంప్రమైజ్ అయ్యామని చెప్పుకొచ్చారు.

Visakha Land Issue : ఇకపై విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయనని వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. తనపై వరుసగా వస్తున్న భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారి మధుకు చెందిన భూమిని కబ్జా చేశారని ఆయనపై వచ్చిన ఆరోపణలపై ఎంపీ వివరణ ఇచ్చారు. విశాఖ పీఎం పాలెంలోని సర్వే నెంబర్ 90/1పీ లో ఎస్పీ మధు తన స్నేహితులతో కలిసి 2016లో స్థలం కొన్నట్టు చెప్పారు. తాజాగా ఆ స్థలంలో గోడ కట్టడానికి ప్రయత్నించగా ఇది ఎంపీ స్థలమంటూ ఆయన అనుచరులు తనను అడ్డుకున్నారని, తన స్థలం కబ్జాకు గురైందంటూ విశాఖ నార్త్ ఏసీపీకి కంప్లైంట్ చేసారు మధు. తాను ఆరేళ్ల క్రితం కొన్న 531 గజాల స్థలంలో కొంత ప్రభుత్వ భూమి అని తెలియడంతో అప్పటికే మోసపోయానని తెలుసుకున్న తను తనకు భూమిని అమ్మని వ్యక్తులపై కేసు వేశానని, మిగిలిన 168 గజాలలో ఇల్లు కట్టుకుందామని వస్తే దానిలో ఎంపీ మనుషులు కల్వర్టు కట్టేశారని తనకు న్యాయం చేయాలంటూ ఎస్పీ పోలీసులను ఆశ్రయించిన ఘటన వైరల్ అయింది. 

మధును వేరే వ్యక్తుల మోసం చేశారు 

ఈ ఘటనపై వివరణ ఇవ్వడం కోసం వివాదాస్పద స్థలం వద్దే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తాను చట్టప్రకారమే ల్యాండ్ కొన్నానంటూ చెప్పుకొచ్చారు. తన లే అవుట్ నుంచి వెళుతున్న మార్గాన్ని మూసివేసి, తన స్థలంలోనే వేరే దారి ఇచ్చానని ఆ దారిలో చిన్న కెనాల్ పై కల్వర్టు లాంటి నిర్మాణం చేశామని అయితే అది వేసిన స్థలం తనదని ఎస్పీ మధు అంటున్నారని ఎంపీ చెప్పారు. ఒకవేళ ఆ స్థలం తనదని ఎస్పీ మధు నిరూపిస్తే తప్పకుండా ఆ కల్వర్టును కూల్చేస్తానని ఎంపీ తెలిపారు. దారి వేసిన స్థలం తనదని చెప్పడానికి తన వద్ద అన్ని రుజువులు ఉన్నాయని ఎంపీ చెప్పారు. అర్ధరాత్రి గోడ కడుతున్న మధును ఎవరో కబ్జాదారుడు అనుకుని తన మనుసులు ఫోన్ చేయడంతో అడ్డుకున్నామని చెబుతున్న ఎంపీ, మధును వేరే వ్యక్తులు మోసం చేసి భూమిని అమ్మారని చెప్పుకొచ్చారు. తను కబ్జా చేసినట్టు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని ఆయన అన్నారు. 

ఎంపీ కబ్జా చేశారని అనలేదు : ఇంటిలెజెన్స్ ఎస్పీ మధు 

తన స్థలం కబ్జాకు గురైందని మొదట్లో ఆరోపించిన ఎస్పీ మధు ప్రస్తుతం ఎంపీ కబ్జా చేశారని అనలేదంటున్నారు. 531 గజాలను ప్రైవేటు భూమి అని తనకు వేరే వ్యక్తులు విక్రయించారని దానిలో అధికారులు 168 గజాలు మాత్రమే ప్రైవేటు భూమి అని నిర్ధారించడంతో తాను మోసపోయినట్టు గుర్తించాననీ, మిగిలిన 168 గజాలలో ఇల్లు కట్టుకుంటుంటే ఎంపీ మనుషులు అడ్డుకున్నారని మాత్రమే అన్నానని తెలిపారు.  ఈ సమస్యపై తాము మాట్లాడుకున్నామని, ఒక అవగాహనకు వచ్చినట్టు తెలిపారు. తన స్థలంలో తాను ఇల్లు కట్టుకోవాలన్నదే తన డిమాండ్ అని మధు చెప్పారు. అనంతరం అక్కడి నుంచి ఆయన వెళ్లిపోయారు.

ఇక విశాఖలో వ్యాపారం చేయను : ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ 

ఇకపై విశాఖలో తాను వ్యాపారం చేయనని అన్నారు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ. 30 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న తనపై ఎన్నడూ ఎలాంటి ఆరోపణలు రాలేదన్నారు.  ఎంపీ అయ్యాకే రాజకీయంగా తన ఎదుగుదల చూడలేక తనపై కొందరు వ్యక్తులు, ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని ఆయన అన్నారు. అందుకే ఇకపై తన వ్యాపారాన్ని హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు ఎంపీ చెప్పుకొచ్చారు. 

రాత్రికి రాత్రే మారిన మాటలు 

ఈ వ్యవహారం మొత్తంలో చాలా ప్రశ్నలకు సమాధానం లేదు.  మొన్న అంత ఆవేశంతో ఆరోపణలు చేసిన ఎస్పీ ఇప్పుడు ఎందుకు ఎంపీపై కబ్జా ఆరోపణలు చేయలేదు అంటున్నారు. పైగా అక్కడ అక్రమంగా నిర్మించారని తాను ఆరోపణలు చేసిన కల్వర్టు తీసేయడానికి ఎంపీ ఒప్పుకున్నారా అనేదానిపైనా స్పష్టత ఇవ్వలేదు. పైగా ఎంపీతో కలిసి ప్రెస్ మీట్ కోసం ఎందుకు అంత హడావుడిగా వచ్చారు అన్నది తెలియడం లేదు. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా మాట్లాడుకున్నామని ఎంపీ చెబుతున్న దానినిబట్టి ఏదైనా సెటిల్మెంట్ లాంటిది జరిగి ఉంటుందా అనే అనుమానాలూ తెరపైకి వస్తున్నాయి  అంటున్నారు ఈ వ్యవహారం గమనిస్తున్నవారు       

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP SSC Exam Results 2026: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి మార్క్‌షీట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఫలితాలు చూడటానికి ఉన్న మార్గాలేంటీ?
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి మార్క్‌షీట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఫలితాలు చూడటానికి ఉన్న మార్గాలేంటీ?
Raghurama: కోర్టులో రఘురామకు షాక్ - మీ పరిధి దాటొద్దని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!
కోర్టులో రఘురామకు షాక్ - మీ పరిధి దాటొద్దని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!
Viral News: ధర్మవరం- నరసాపురం రైలు టాప్ ఎక్కి టికెట్ లేని వ్యక్తి హైడ్రామా.. ప్యాసింజర్ల గుండె గుభేల్ !
ధర్మవరం- నరసాపురం రైలు టాప్ ఎక్కి టికెట్ లేని వ్యక్తి హైడ్రామా.. ప్యాసింజర్ల గుండె గుభేల్ !
Chandrababu Speech: టీడీపీ కార్యకర్తలు మీసం మెలేసి నిలబడతారు, ఎవ్వరికీ తలొగ్గరు: పార్టీ అధినేత చంద్రబాబు
టీడీపీ కార్యకర్తలు మీసం మెలేసి నిలబడతారు, ఎవ్వరికీ తలొగ్గరు: పార్టీ అధినేత చంద్రబాబు

వీడియోలు

RR vs PBKS IPL 2026 Highlights | రాజస్థాన్ రాయల్స్ సంచలన విజయం
Vaibhav Fun With Kids IPL 2026 | పిల్లలతో వైభవ్ సూర్యవంశీ ఫన్నీ ప్రాంక్
Yashasvi Jaiswal about Vaibhav IPL 2026 | వైభవ్ సూర్యవంశీపై యశస్వి జైస్వాల్ కామెంట్స్
RR vs DC IPL 2026 Suyash Sharma | ఐపీఎల్ చరిత్రలోనే సుయాశ్ శర్మ వరల్డ్ రికార్డ్
RCB vs DC IPL 2026 Highlights | ఢిల్లీని వణికించిన ఆర్‌సీబీ బౌలర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP SSC Exam Results 2026: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి మార్క్‌షీట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఫలితాలు చూడటానికి ఉన్న మార్గాలేంటీ?
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి మార్క్‌షీట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఫలితాలు చూడటానికి ఉన్న మార్గాలేంటీ?
Congress vs BRS: కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో యాంకర్లు - ఈ రాజకీయం గీత దాటిపోతోంది !
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో యాంకర్లు - ఈ రాజకీయం గీత దాటిపోతోంది !
Dhurandhar Japan Release: జపాన్‌లో రిలీజ్‌కు 'ధురంధర్' రెడీ... జూలైలో ఎప్పుడంటే?
జపాన్‌లో రిలీజ్‌కు 'ధురంధర్' రెడీ... జూలైలో ఎప్పుడంటే?
Komatireddy Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని కవిత ప్రజలకేం మేలు చేస్తారు - కొత్తపార్టీపై రాజగోపాల్ రెడ్డి విమర్శలు
తండ్రికి విలువ ఇవ్వని కవిత ప్రజలకేం మేలు చేస్తారు - కొత్తపార్టీపై రాజగోపాల్ రెడ్డి విమర్శలు
Delhi High Court: ఢిల్లీ హైకోర్టులో కలకలం - వర్చువల్ విచారణలో అశ్లీల వీడియోలు.. హ్యాకింగ్‌ చేసినట్లు అనుమానాలు!
ఢిల్లీ హైకోర్టులో కలకలం - వర్చువల్ విచారణలో అశ్లీల వీడియోలు.. హ్యాకింగ్‌ చేసినట్లు అనుమానాలు!
Raghurama: కోర్టులో రఘురామకు షాక్ - మీ పరిధి దాటొద్దని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!
కోర్టులో రఘురామకు షాక్ - మీ పరిధి దాటొద్దని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!
Hormuz: హోర్ముజ్ చిక్కులకు గల్ఫ్ దేశాల చెక్ - భారత్‌కు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు సరఫరా!
హోర్ముజ్ చిక్కులకు గల్ఫ్ దేశాల చెక్ - భారత్‌కు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు సరఫరా!
TS SSC Supplementary Exams Date: తెలంగాణ టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది, ఈ తేదీ నుంచే పరీక్షలు
తెలంగాణ టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది, ఈ తేదీ నుంచే పరీక్షలు
Embed widget