అన్వేషించండి

Visakha Land Issue : విశాఖలో వ్యాపారం మానేస్తానంటున్న ఎంపీ ఎంవీవీ - కబ్జా ఆరోపణలే చేయలేదంటున్న ఎస్పీ

Visakha Land Issue : విశాఖ ఎంపీ వర్సెస్ ఎస్పీ భూవివాదం కీలక మలుపు తిరిగింది. వీరిద్దరూ కలిసి ఇవాళ వివాద స్థలంలోనే ప్రెస్ మీట్ పెట్టారు. ఇద్దరం కాంప్రమైజ్ అయ్యామని చెప్పుకొచ్చారు.

Visakha Land Issue : ఇకపై విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయనని వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. తనపై వరుసగా వస్తున్న భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారి మధుకు చెందిన భూమిని కబ్జా చేశారని ఆయనపై వచ్చిన ఆరోపణలపై ఎంపీ వివరణ ఇచ్చారు. విశాఖ పీఎం పాలెంలోని సర్వే నెంబర్ 90/1పీ లో ఎస్పీ మధు తన స్నేహితులతో కలిసి 2016లో స్థలం కొన్నట్టు చెప్పారు. తాజాగా ఆ స్థలంలో గోడ కట్టడానికి ప్రయత్నించగా ఇది ఎంపీ స్థలమంటూ ఆయన అనుచరులు తనను అడ్డుకున్నారని, తన స్థలం కబ్జాకు గురైందంటూ విశాఖ నార్త్ ఏసీపీకి కంప్లైంట్ చేసారు మధు. తాను ఆరేళ్ల క్రితం కొన్న 531 గజాల స్థలంలో కొంత ప్రభుత్వ భూమి అని తెలియడంతో అప్పటికే మోసపోయానని తెలుసుకున్న తను తనకు భూమిని అమ్మని వ్యక్తులపై కేసు వేశానని, మిగిలిన 168 గజాలలో ఇల్లు కట్టుకుందామని వస్తే దానిలో ఎంపీ మనుషులు కల్వర్టు కట్టేశారని తనకు న్యాయం చేయాలంటూ ఎస్పీ పోలీసులను ఆశ్రయించిన ఘటన వైరల్ అయింది. 

మధును వేరే వ్యక్తుల మోసం చేశారు 

ఈ ఘటనపై వివరణ ఇవ్వడం కోసం వివాదాస్పద స్థలం వద్దే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తాను చట్టప్రకారమే ల్యాండ్ కొన్నానంటూ చెప్పుకొచ్చారు. తన లే అవుట్ నుంచి వెళుతున్న మార్గాన్ని మూసివేసి, తన స్థలంలోనే వేరే దారి ఇచ్చానని ఆ దారిలో చిన్న కెనాల్ పై కల్వర్టు లాంటి నిర్మాణం చేశామని అయితే అది వేసిన స్థలం తనదని ఎస్పీ మధు అంటున్నారని ఎంపీ చెప్పారు. ఒకవేళ ఆ స్థలం తనదని ఎస్పీ మధు నిరూపిస్తే తప్పకుండా ఆ కల్వర్టును కూల్చేస్తానని ఎంపీ తెలిపారు. దారి వేసిన స్థలం తనదని చెప్పడానికి తన వద్ద అన్ని రుజువులు ఉన్నాయని ఎంపీ చెప్పారు. అర్ధరాత్రి గోడ కడుతున్న మధును ఎవరో కబ్జాదారుడు అనుకుని తన మనుసులు ఫోన్ చేయడంతో అడ్డుకున్నామని చెబుతున్న ఎంపీ, మధును వేరే వ్యక్తులు మోసం చేసి భూమిని అమ్మారని చెప్పుకొచ్చారు. తను కబ్జా చేసినట్టు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని ఆయన అన్నారు. 

ఎంపీ కబ్జా చేశారని అనలేదు : ఇంటిలెజెన్స్ ఎస్పీ మధు 

తన స్థలం కబ్జాకు గురైందని మొదట్లో ఆరోపించిన ఎస్పీ మధు ప్రస్తుతం ఎంపీ కబ్జా చేశారని అనలేదంటున్నారు. 531 గజాలను ప్రైవేటు భూమి అని తనకు వేరే వ్యక్తులు విక్రయించారని దానిలో అధికారులు 168 గజాలు మాత్రమే ప్రైవేటు భూమి అని నిర్ధారించడంతో తాను మోసపోయినట్టు గుర్తించాననీ, మిగిలిన 168 గజాలలో ఇల్లు కట్టుకుంటుంటే ఎంపీ మనుషులు అడ్డుకున్నారని మాత్రమే అన్నానని తెలిపారు.  ఈ సమస్యపై తాము మాట్లాడుకున్నామని, ఒక అవగాహనకు వచ్చినట్టు తెలిపారు. తన స్థలంలో తాను ఇల్లు కట్టుకోవాలన్నదే తన డిమాండ్ అని మధు చెప్పారు. అనంతరం అక్కడి నుంచి ఆయన వెళ్లిపోయారు.

ఇక విశాఖలో వ్యాపారం చేయను : ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ 

ఇకపై విశాఖలో తాను వ్యాపారం చేయనని అన్నారు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ. 30 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న తనపై ఎన్నడూ ఎలాంటి ఆరోపణలు రాలేదన్నారు.  ఎంపీ అయ్యాకే రాజకీయంగా తన ఎదుగుదల చూడలేక తనపై కొందరు వ్యక్తులు, ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని ఆయన అన్నారు. అందుకే ఇకపై తన వ్యాపారాన్ని హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు ఎంపీ చెప్పుకొచ్చారు. 

రాత్రికి రాత్రే మారిన మాటలు 

ఈ వ్యవహారం మొత్తంలో చాలా ప్రశ్నలకు సమాధానం లేదు.  మొన్న అంత ఆవేశంతో ఆరోపణలు చేసిన ఎస్పీ ఇప్పుడు ఎందుకు ఎంపీపై కబ్జా ఆరోపణలు చేయలేదు అంటున్నారు. పైగా అక్కడ అక్రమంగా నిర్మించారని తాను ఆరోపణలు చేసిన కల్వర్టు తీసేయడానికి ఎంపీ ఒప్పుకున్నారా అనేదానిపైనా స్పష్టత ఇవ్వలేదు. పైగా ఎంపీతో కలిసి ప్రెస్ మీట్ కోసం ఎందుకు అంత హడావుడిగా వచ్చారు అన్నది తెలియడం లేదు. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా మాట్లాడుకున్నామని ఎంపీ చెబుతున్న దానినిబట్టి ఏదైనా సెటిల్మెంట్ లాంటిది జరిగి ఉంటుందా అనే అనుమానాలూ తెరపైకి వస్తున్నాయి  అంటున్నారు ఈ వ్యవహారం గమనిస్తున్నవారు       

టాప్ హెడ్ లైన్స్

Breaking News:హైదరాబాద్‌లో నిరుద్యోగుల మెరుపు ధర్నా- 19వేల పోలీస్‌ ఉద్యోగాలతో నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ !
హైదరాబాద్‌లో నిరుద్యోగుల మెరుపు ధర్నా- 19వేల పోలీస్‌ ఉద్యోగాలతో నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ !
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Embed widget