Ys Jagan Guntur Tour: గుంటూరులో టెన్షన్ టెన్షన్..! అంబటి ఇంటికి మాజీ సీఎం జగన్
గుంటూరు నగరానికి ఏపీ మాజీ సీఎం జగన్ రానున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబును పరామర్శించనున్న తరుణంలో గుంటూరులో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.

గుంటూరు నగరం లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ సీయం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఈరోజు గుంటూరు లో ఇటీవల దాడికి గురైన అంబటి రాంబాబు ఇంటికి వెళ్తున్నారు. అక్కడ అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను స్వయంగా పరామర్శించి ఓదార్చనున్నారు.
తాడేపల్లి నుండి ర్యాలీగా గుంటూరుకు
ఈరోజు ఉదయం 10-11 గంటల మధ్య జగన్ తాడేపల్లి లోని తన నివాసం నుండి ర్యాలీ గా బయలుదేరి గుంటూరు వెళ్ళానున్నట్టు వైసీపీ శ్రేణులు తెలిపాయి. గుంటూరు నగరం లోని సిద్దార్ధ నగర్ లో ఉన్న అంబటి రాంబాబు ఇంటికి వెళ్లే అయన రూట్ మ్యాప్ సిటీ లోని ముఖ్యమైన ప్రాంతాల గుండా వెళ్లేలా ప్లాన్ చేశారు. జగన్ తో పాటు పార్టీ కి చెందిన ముఖ్య నాయకులు కూడా అంబటి రాంబాబు ఇంటికి రానున్నారు.అంబటి రాంబాబు ప్రస్తుతం సీఎం చంద్రబాబు ను దుర్భాషలాడిన కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. దానితో ఆయన కుటుంబ సభ్యులను జగన్ ఈ రోజు గుంటూరు లో పరామర్శించనున్నారు
ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ సూచనలు..పోలీసుల అప్రమత్తం
ఆల్రెడీ గుంటూరు, ఇబ్రహీంపట్నం లో వరుసగా అంబటి రాంబాబు, జోగి రమేష్ ల ఇళ్ళు దాడికి గురైన నేపథ్యంలో ఇంకా ఆ రెండు చోట్లా ఉద్వేగ భరిత వాతావరణం టీడీపీ, వైసీపీ నేతల మధ్య కొనసాగుతోంది. ఇలాంటి స్థితి లో జగన్ అంబటి ఇంటికి వెళుతుండడం ఫై పోలీసులు అలెర్ట్ అయ్యారు. గతం లో జగన్ పర్యటన లు దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే గుంటూరు నగరం లో డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి చాలా చోట్ల ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి. మరి జగన్ టూర్ వల్ల ఎక్కువ వాహనాలు వస్తే అదో సమస్య గా మారే అవకాశం ఉంది. ఇప్పటికే వైసీపీ నేతలు, శ్రేణులు పెద్ద ఎత్తున గుంటూరు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. అంబటి రాంబాబు ఇల్లు, ఆఫీస్ ఉన్న సిద్దార్డ్ నగర్ కాలనీ లో పలు రాజకీయ నాయకుల ఇళ్ళు ఆఫీసులు ఉన్నాయి కాబట్టి మరింత జాగ్రత్త లు తీసుకుంటున్నారు.
మంత్రుల ప్రెస్ మీట్ కు కౌంటర్ ఇవ్వనున్న జగన్
నిన్న జరిగిన ఏపీ కాబినెట్ మీటింగ్ మొత్తం తిరుపతి కల్తీ లడ్డు వ్యవహారం లో వచ్చిన ఛార్జ్ షేట్ పైనే నడిచింది. కూటమి మంత్రులు మాట్లాడుతూ జగన్ హయాంలోనే తిరుపతి లడ్డు ల్లో నెయ్యి కల్టీ చేసారని అది జగన్ హయాంలో జరిగింది అనీ చెప్పుకొచ్చారు.ఈరోజు అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించాక జగన్ మంత్రుల వ్యాఖ్యలకు ఆరోపణలకు కౌంటర్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అందుకే ఈరోజు జగన్ గుంటూరు పర్యటన ఫై ఇతర రాజకీయ పార్టీలు సైతం ఆశక్తి గా ఎదురు చూస్తున్నాయి. ఈ పర్యటన పూర్తి అయ్యాక శుక్రవారం నాడు ఇబ్రహీంపట్నం లో దాడికి గురైన మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిని కూడా జగన్ సందర్శించి జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని వైసీపీ తెలిపింది.
ట్రెండింగ్ వార్తలు





















