![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Jagan Tour Update: ముగిసిన ముఖ్యమంత్రి లండన్ టూర్- రాష్ట్రానికి వచ్చిన జగన్కు ఘన స్వాగతం
CM Jagan Foreign Tour: ఎన్నికల అనంతరం ఫ్యామిలీతో లండన్, న్యూజిలాండ్ యాత్రకు వెళ్లిన సీఎం జగన్ ఈ ఉదయం రాష్ట్రానికి తిరిగి వచ్చారు. కాసేపట్లో కౌంటింగ్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలతో చర్చిస్తారు.
![Jagan Tour Update: ముగిసిన ముఖ్యమంత్రి లండన్ టూర్- రాష్ట్రానికి వచ్చిన జగన్కు ఘన స్వాగతం YCP leaders welcomed CM Jagan at Gannavaram Airport after completing his foreign tour in london and switzerland Jagan Tour Update: ముగిసిన ముఖ్యమంత్రి లండన్ టూర్- రాష్ట్రానికి వచ్చిన జగన్కు ఘన స్వాగతం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/390bc33f18d9e71d7b3515ef041955531717207674212215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Andhra Pradesh News Updates: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటన నిన్నటితో ముగిసింది. ప్రత్యేక విమానంలో విజయవాడలోని గన్నవరం చేరుకున్న వైసీపీ అధినేతకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. 15 రోజుల పాటు లండన్లో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తైన తర్వాత మే 17 జగన్ ఫారెన్ టూర్కు వెళ్లారు. అక్కడ లండన్, స్విట్జర్లాండ్లో ఫ్యామిలీతో తిరిగారు. పర్యటన ముంగించుకొని ప్రత్యేక విమానంలో రాష్ట్రానికి చేరుకున్నారు. ఆయనకు ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలోని వైసీపీ నేతల బృందం స్వాగతం పలికింది.
రాష్ట్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్, గన్నవరం విమానాశ్రయంలో వైకాపా శ్రేణుల ఘన స్వాగతం.#YSJagan #Gannavaram #UANow pic.twitter.com/Lwaj0v0puH
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) June 1, 2024
గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా తాడేపల్లిలోని నివాసానికి చేరుకున్న జగన్ ఇవాళ పార్టీ నేతలతో మాట్లాడనున్నారు. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేదానిపై చర్చలు జరపనున్నారు. 15 రోజులుగా రాష్ట్రంలో జరిగిన పరిణామాలపై కూడా సమీక్ష చేయనున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)