అన్వేషించండి

Nara Lokesh : ఎన్నికల్లో ఇచ్చిన హామీకి లోకేష్‌కు రూ.5 లక్షల ఖర్చు - ఏం జరిగిందో తెలుసా

TDP: ఎన్నికల్లో ఇచ్చిన హామీని ప్రభుత్వ పరంగా తీర్చడం సాధ్యం కాకపోవడంతో లోకేష్ సొంత డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇంతకీ ఆ హామీ ఏమిటంటే ?

Lokesh: మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ రూ. ఐదు లక్షలు ఖర్చు పెట్టి హామీ నెరవేర్చారు. ఎన్నికల ప్రచార సమయంలో మంగళగిరి ఎకో పార్క్ లో ఓ సారి ప్రచారం చేశారు. ఆ సమయంలో ఎకో పార్క్ వాకర్స్ అందరూ ఒకటే విజ్ఞప్తి చేశారు. మంగళగిరి ఎకోపార్కులో ప్రవేశరుసుం తొలగించాల్సిందిగా కోరారు. ఎన్నికల్లో గెలిచిన తరవాత ప్రభుత్వం ఏర్పడగానే .. ఈ డిమాండ్ పై పరిశీలన చేసి నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. 

ఎన్నికల సమయంలో మంగళగిరి ప్రజలకు హామీ 

మంగళగిరి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ పోతున్న నారా లోకేష్.. ఎకో పార్క్ హామీ నెరవేర్చడానికి ఇటీవల  అటవీ అధికారులతో మాట్లాడారు. అయితే ఫారెస్టుశాఖ పార్కుల్లో రుసుం వసూలు కేవలం నిర్వహణ కోసమేనని, రాష్ట్రవ్యాప్త పాలసీలో భాగమైనందున తొలగించడం వీలుకాదని చెప్పారు. ఒక్క చోట తొలగిస్తే అన్ని చోట్లా తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాని వల్ల అటవీ శాఖకు భారీగా అదాయం తగ్గిపోతుంది. నిర్వహణ కోసం ఖర్చులు రావు. అందుకే వాకర్స్ మిత్రులకు ఇచ్చిన మాటకు కట్టుబడి మంగళగిరి ఎకో పార్కులో మార్నింగ్ వాకర్స్ ద్వారా ఏటా లభించే రూ.5లక్షల రూపాయలను నా వ్యక్తిగత నిధులనుంచి చెల్లించినట్లుగా లోకేష్ ప్రకటించారు. ఇకపై మంగళగిరి ప్రాంత వాసులు ఎటువంటి రుసుం లేకుండా ఉదయం 6నుంచి 9గంటల వరకు ఎకోపార్కులో నడక సాగించవచ్చని లోకేష్ సోషల్ మీడియాలో తెలిపారు. 

ఐదేళ్లు ప్రజల్లో ఉండి ఘన విజయం సాధించిన లోకేష్ 

2019 ఎన్నికల్లో నారా లోకేష్ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేశారు. కానీ ఆయన ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఆరు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఐదేళ్ల పాటు మళ్లీ అదే నియోజకవర్గంలో పని చేశారు. మంగళగిరి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి 90వేలకుపైగా మెజార్టీతో విజయం సాధించారు. రాష్ట్రంలో మూడో హయ్యస్ట్ మెజార్టీ సాధించారు. చాలా కాలం నుంచి మంగళగిరిలో టీడీపీ గెలవలేదు. ఐదేళ్ల పాటు ప్రజలకు అందుబాటులో ఉండి.. వారికి కావాల్సిన అవసరాలు చూస్తూ వారి సమస్యల కోసం పోరాడుతూ ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్నారు. అయితే ఈ క్రమంలో ఆయన చాలా హామీలు ఇచ్చారు. ఈ హామీల అమలుకు ప్రయత్నిస్తున్నారు. 

ఒక్క ఏడాదికే ఐదు లక్షలు.. మరి ఏడాది తర్వాత ?             

చాలా సమస్యలు ప్రభుత్వ పరంగా పరిష్కరించగలిగినవే అయినా.. కొన్ని విషయాల్లో మాత్రం వ్యక్తిగత నిధులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అటవీ శాఖలోని ఎకో పార్క్ కు ఆయన తన పవర్ ను ఉపయోగించి.. హామీని అమలు చేయవచ్చు కానీ ఆ ప్రభావం రాష్ట్రమంతటా ఉంటుంది. అందుకే ఆయన సొంత నిధులు ఖర్చు పెట్టినట్లుగా తెలుస్తోంది.అయితే ఇది ఏడాదికి మాత్రమే..  ప్రతీ ఏడాది కట్టాల్సి వస్తుంది. కానీ లోకేష్ ప్రతీ ఏడాది కడతారా లేదా అన్నది మరో ఏడాది తర్వాత స్పష్టత వచ్చే చాన్స్ ఉంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget