అన్వేషించండి

Vijayawada News: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులకు ఏర్పాట్లు, అక్టోబర్ 15 నుంచి 23 వరకు ఉత్సవాలు

Vijayawada News: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులకు సర్వం సిద్ధమయ్యాయి. 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నట్లు అధికారులు తెలిపారు. 

Vijayawada News: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. దసరా ఉత్సవాల కోసం గతంలో ఇంజనీరింగ్ వర్క్స్ కు 2.5 కోట్లు ఖర్చు చేశామని ఇంద్రకీలాద్రి దుర్గగుడి పాలక మండలి చైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. పలు దేవాలయాల నుంచి సిబ్బందిని తీసుకొచ్చి దసరా కు వినియోగిస్తామని చెప్పారు. అలాగే పది రోజులకు కాంట్రాక్టు పద్ధతిలో కొంత మంది సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అన్నదాన భవనం కూడా త్వరలోనే పూర్తి చేస్తామని వివరించారు. ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 15 వ తేదీ నుంచి 23 వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు. 

15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అంగరంగ వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

అక్టోబర్‌ 15 వ తేదీన ఉత్సవాల తొలి రోజు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం ఇవ్వనుంది. అలాగే 16వ తేదీన గాయత్రీ దేవి అలంకారంలో, 17న అన్నపూర్ణా దేవి అలంకారంలో అమ్మవారు ఇవ్వనున్నారు. 18న మహాలక్ష్మి దేవి, 19వ తేదీన మహాచండీ దేవి రూపంలో కనిపించనున్నారు. 20వ తేదీన శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. 20వ తేదీ రోజున మధ్యాహ్నం 3 గంటల నుంచీ 4 గంటల మధ్యలో సీఎం జగన్.. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 21వ తేదీన లలితా త్రిపురసుందరీ, 22వ తేదీన శ్రీ దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు కనిపించనున్నారు. ఇక చివరి రోజు అయిన 23వ తేదీన మహిషాసుర‌ మర్ధనీ దేవి అలంకారంలో అదే రోజు మధ్యాహ్నం నుంచీ శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో కనిపిస్తారు. 


Vijayawada News: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులకు ఏర్పాట్లు, అక్టోబర్ 15 నుంచి 23 వరకు ఉత్సవాలు

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా ఏర్పాట్లు..

ఇంద్రకీలాద్రిపై ఘనంగా జరిగే ఊ శరన్నవరాత్రి ఉత్సవాలకు 200 మంది సిబ్బంది ఇతర దేవాలయాల నుంచి హాజరు అవుతారు. అన్ని శాఖల అధికారులు.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూస్తారు. కొండచరియలు జారిపడిన కారణంగా క్యూలైన్లు దుర్గాఘాట్ వైపు మార్చడం జరుగుతుందని ఇంద్రకీలాద్రి ఆలయ ఈఓ భ్రమరాంబ తెలిపారు. వినాయకుడి గుడి వద్ద నుంచీ క్యూలైన్లు ప్రారంభం అవతాయని.. ఎప్పటిలాగే ఐదు క్యూలైన్లు ఉంటాయని చెప్పుకొచ్చారు. అలాగే కేశఖండన శాలకు 600 మంది సిబ్బంది ఉంటారని.. భక్తులు నిలిచే ప్రదేశాలను గుర్తించి షెడ్లు వేస్తున్నామని వివరించారు. జల్లు స్నానాలకు షవర్ లు, పది ప్రసాదం కౌంటర్లు, మోడల్ గెస్ట్ హౌస్, స్టేట్ గెస్ట్ హౌస్ ల వద్ద కూడా ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

గతేడాది భక్తులు 16 లక్షల లడ్డూలు కొనుగోలు చేశారని.. ఈసారి 20 లక్షల లడ్డూలు తయారు చేయబోతున్నామని వివరించారు. అలాగే  మాలనక్షత్రం రోజున రూ.500 వీఐపీ టికెట్లు అందుబాటులో ఉంటాయని అన్నారు.  వీవీఐపీల దర్శనం పై స్లాట్లు కూడా నిర్ణయిస్తామని ఆలయ ఈఓ భ్రమరాంబ తెలిపారు. ఉత్సవాల కోసం 7 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు.. గతంలో లాగానే భక్తుల రద్దీ ఆశిస్తున్నామని వివరించారు. దసరా 9 రోజులూ అంతరాలయ దర్శనం లేదని ఆమె స్పష్టం చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: 20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
Secunderabad To Goa Train: హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
Prakash Raj: డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
Sobhita Dhulipala: సమంత నా సోల్‌మేట్‌ - నాగార్జునకు కాబోయే కోడలు శోభితా ధూళిపాళ కామెంట్స్ వైరల్!
సమంత నా సోల్‌మేట్‌ - నాగార్జునకు కాబోయే కోడలు శోభితా ధూళిపాళ కామెంట్స్ వైరల్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Prakash Raj Counters Pawan Kalyan | తమిళనాడులో పవన్ కళ్యాణ్ పరువు తీసిన ప్రకాశ్ రాజ్ | ABP Desamపసిపాపకి పాలు పట్టేందుకు అవస్థలు పడుతున్న తల్లిNirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: 20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
Secunderabad To Goa Train: హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
Prakash Raj: డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
Sobhita Dhulipala: సమంత నా సోల్‌మేట్‌ - నాగార్జునకు కాబోయే కోడలు శోభితా ధూళిపాళ కామెంట్స్ వైరల్!
సమంత నా సోల్‌మేట్‌ - నాగార్జునకు కాబోయే కోడలు శోభితా ధూళిపాళ కామెంట్స్ వైరల్!
Revanth Reddy : వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా  ?
వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా ?
AP Politics: క్రిస్టియన్ తో పెళ్లి, హిందూ మతం పేరుతో రాజకీయాలా?- పవన్ కళ్యాణ్‌పై గోరంట్ల మాధవ్ ఫైర్
క్రిస్టియన్ తో పెళ్లి, హిందూ మతం పేరుతో రాజకీయాలా?- పవన్ కళ్యాణ్‌పై గోరంట్ల మాధవ్ ఫైర్
Viswam Trailer: యాక్షన్, ఫన్‌తో నిండిపోయిన ‘విశ్వం’ ట్రైలర్ - బ్లాక్‌బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయా?
యాక్షన్, ఫన్‌తో నిండిపోయిన ‘విశ్వం’ ట్రైలర్ - బ్లాక్‌బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయా?
Israel Strikes Beirut: లెబనాన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం - ప్రాణాలు దక్కాలంటే పారిపోవాలని ప్రజలకు వార్నింగ్
లెబనాన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం - ప్రాణాలు దక్కాలంటే పారిపోవాలని ప్రజలకు వార్నింగ్
Embed widget