అన్వేషించండి

RajaShyamala Yagam: రాజశ్యామల యాగానికి సీఎం జగన్‌ను ఆహ్వానించిన విశాఖ శారదా పీఠం

Sri Sarada Peetham RajaShyamala Yagam: విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి రాజశ్యామల యాగానికి రావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. 

Sri Sarada Peetham RajaShyamala Yagam: విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి విశాఖ శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలకు హాజరు కావాలని ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను సీఎం జగన్‌కు అందజేశారు. వచ్చే ఏడాది జనవరి 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఐదు రోజుల పాటు విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలు జరగనున్నాయని సీఎంకు తెలిపారు. వార్షికోత్సవాల సందర్భంగా రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నామని అన్నారు. యాగంలో రాజశ్యామల అమ్మవారి మూల మంత్రాలతో లక్ష సార్లు హవనం జరుగుతుందని వివరించారు. ఉత్సవాలలో పాల్గొని రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం, పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు పొందాలని సూచించారు. సీఎం జగన్‌ను కలిసిన వారిలో స్వాత్మానందేంద్ర స్వామి వెంట టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా ఉన్నారు. 

ప్రతి ఏటా మాఘ మాసం పంచమి నుంతి దశమి వరకు..

ఏటా మాఘ మాసం పంచమి నుంచి దశమి వరకు శ్రీ శారదా పీఠం (Sri Sarada Peetham) వార్షికోత్సవాలు జరుగుతాయి. దేశ రక్షణ కోసం 5 రోజుల పాటు శారదా పీఠం రాజ్యశ్యామల అమ్మవారి యాగం నిర్వహిస్తూ వస్తోంది. అయితే ఇదే ఏడాది ఫిబ్రవరిలో కూడా ఈ యాగాన్ని నిర్వహించారు. కరోనా కారణంగా నిరాడంబరంగా ఈ ఉత్సవాలు చేశారు. కేవలం ఏపీ సీఎం జగన్ ఒక్కరినే ఆహ్వానించారు. శారదా పీఠంలో మూడో రోజు కొనసాగుతున్న రాజశ్యామలా దేవి యాగంలో పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి సమక్షంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు. విశాఖ శారదాపీఠం వార్షిక మహోత్సవాలకు హాజరైన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రుద్ర హోమం పూర్ణాహుతికి సీఎం హాజరయ్యారు.

సీఎంతో పాటు పలువురు మంత్రులు కూడా 

రాజశ్యామలా యాగంలో పాల్గొనే ముందు సీఎం జగన్ విజయ గణపతి, శంకరాచార్య, వనదుర్గ ఆలయాల సందర్శించారు. రాజశ్యామల పూజ కోసం వేద పండితులు.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో సంకల్పం చేయించారు. తర్వాత సీఎం చేతులమీదుగా కలశ స్థాపన చేయించారు. అనంతరం వేద పండిత సభలో ఆయన పాల్గొన్నారు. రాజశ్యామలా దేవి యాగంలో సీఎం వైఎస్‌ జగన్‌ తోపాటు మంత్రులు అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్, టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి కూడా పాల్గొన్నారు. 

స్వరూపానందేంద్ర స్వామితో సీఎం జగన్ కు సత్సంబంధాలు

విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామితో సీఎం జగన్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. ఈ కారణంగా పీఠంలో జరిగే కార్యక్రమాలకు జగన్ ప్రత్యేకంగా హాజరవుతూ ఉంటారు. పీఠంతో ప్రత్యేకమైన అనుబంధం సీఎం జగన్‌కు ఉన్నందున ఆయను మాత్రమే వీఐపీని ఆహ్వానిచామని శారదాపీఠాధిపతి స్వరూపానంద కూడా మీడియాకు చెప్పారు. ఈ క్రమంలోనే ఈసారి జరిగే రాజశ్యామలా దేవి యాగానికి కూడా ఆహ్వానించారు. అయితే ఈ ఏడాది కూడా ముఖ్యమంత్రి జగన్ ఈ యాగంలో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఎమ్మెల్సీలుగా సి. రామచంద్రయ్య, హరి ప్రసాద్ ఏకగ్రీవం
ఎమ్మెల్సీలుగా సి. రామచంద్రయ్య, హరి ప్రసాద్ ఏకగ్రీవం
UK Elections 2024: యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తులు ఓటమి - భారత సంతతి అభ్యర్థుల పరిస్థితి ఏంటంటే?
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తులు ఓటమి - భారత సంతతి అభ్యర్థుల పరిస్థితి ఏంటంటే?
Anasuya Bharadwaj: అనసూయకు లవ్ లెటర్ రాసేశాడు, ఎవరో తెలుసా? - ఆ ముద్దులు వద్దంటోన్న శేఖర్ మాస్టర్
అనసూయకు లవ్ లెటర్ రాసేశాడు, ఎవరో తెలుసా? - ఆ ముద్దులు వద్దంటోన్న శేఖర్ మాస్టర్
Viral News: నిద్రపోతుండగా కాటు వేసిన పాము, కసి తీరా కొరికి చంపిన బాధితుడు
నిద్రపోతుండగా కాటు వేసిన పాము, కసి తీరా కొరికి చంపిన బాధితుడు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Virat Kohli Emotional Speech About Jasprit Bumrah | బుమ్రా ఈ దేశపు ఆస్తి అంటున్న కోహ్లీ | ABP DesamVirat Kohli Emotional About Rohit Sharma |15 ఏళ్లలో రోహిత్ శర్మను అలా చూడలేదంటున్న విరాట్ కోహ్లీJagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఎమ్మెల్సీలుగా సి. రామచంద్రయ్య, హరి ప్రసాద్ ఏకగ్రీవం
ఎమ్మెల్సీలుగా సి. రామచంద్రయ్య, హరి ప్రసాద్ ఏకగ్రీవం
UK Elections 2024: యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తులు ఓటమి - భారత సంతతి అభ్యర్థుల పరిస్థితి ఏంటంటే?
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తులు ఓటమి - భారత సంతతి అభ్యర్థుల పరిస్థితి ఏంటంటే?
Anasuya Bharadwaj: అనసూయకు లవ్ లెటర్ రాసేశాడు, ఎవరో తెలుసా? - ఆ ముద్దులు వద్దంటోన్న శేఖర్ మాస్టర్
అనసూయకు లవ్ లెటర్ రాసేశాడు, ఎవరో తెలుసా? - ఆ ముద్దులు వద్దంటోన్న శేఖర్ మాస్టర్
Viral News: నిద్రపోతుండగా కాటు వేసిన పాము, కసి తీరా కొరికి చంపిన బాధితుడు
నిద్రపోతుండగా కాటు వేసిన పాము, కసి తీరా కొరికి చంపిన బాధితుడు
Telangana Politics: తెలంగాణ శాసన మండలికి రద్దు ముప్పు, చంద్రబాబును రేవంత్ సాయం కోరాలన్న బీఆర్ఎస్
తెలంగాణ శాసన మండలికి రద్దు ముప్పు, చంద్రబాబును రేవంత్ సాయం కోరాలన్న బీఆర్ఎస్
Raj Tarun Comments: లావణ్యకు మరో వ్యక్తితో ఎఫైర్‌ ఉంది - ఆమె చెప్పేవన్ని అబద్ధాలు, ప్రియురాలిపై రాజ్ తరుణ్ సంచలన ఆరోపణలు
లావణ్యకు మరో వ్యక్తితో ఎఫైర్‌ ఉంది - ఆమె చెప్పేవన్ని అబద్ధాలు, ప్రియురాలిపై రాజ్ తరుణ్ సంచలన ఆరోపణలు
MP Kalishetti Appalanaidu : ఆస్తుల్లో పేదవాడే కానీ ఆశయంలో ఉన్నతుడే - అమరావతికి తొలి జీతం విరాళం ఇచ్చేసిన టీడీపీ ఎంపీ
ఆస్తుల్లో పేదవాడే కానీ ఆశయంలో ఉన్నతుడే - అమరావతికి తొలి జీతం విరాళం ఇచ్చేసిన టీడీపీ ఎంపీ
Ramya Krishnan: రాజమాత ఏంటిది? రమ్యకృష్ణ బోల్డ్ ఫొటోలు వైరల్ - ఇది కూడా AI మాయేనా? దారుణం!
రాజమాత ఏంటిది? రమ్యకృష్ణ బోల్డ్ ఫొటోలు వైరల్ - ఇది కూడా AI మాయేనా? దారుణం!
Embed widget