అన్వేషించండి

కేఏ పాల్‌ పార్టీకి ఎంత విలువుందో బీజేపీకి అంతే విలువ ఉంది: జోగి రమేష్

మతతత్వ రాజకీయాలు చేసో, మతాన్ని అడ్డం పెట్టుకుని ఏపీలో పార్టీ వికసించాలంటే.. అదేమన్నా పువ్వు అనుకుంటున్నారా..? అని నిలదీశారు జోగి రమేష్‌.

బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ టీడీపీ ఆఫీస్‌ ఇచ్చిన స్క్రిప్టును చదివారని విమర్శించారు మంత్రి జోగి రమేష్. ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రిపైనా అర్థంపర్థం లేని విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ గురించి, ఇక్కడ పరిస్థితులు గురించి, ఇక్కడ పాలిస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గురించి ఏం తెలుసని నిలదీశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి తెలుసుకోకుండానే కేంద్ర మంత్రి మాట్లాడటం సరికాదన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌ గురించి కనీసం ఓనమాలు అయినా తెలుసుకుని వచ్చారా కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ను ప్రశ్నించారు జోగి రమేష్. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో అమలు జరగనన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏపీలో అమలవుతున్నాయని తెలిపారు. జగన్ అధికారంలోకి రాగానే.. గాంధీజీ కన్న కలలను నిజం చేస్తూ సచివాలయాల వ్యవస్థ తీసుకొచ్చామని వివరించారు. 2 లక్షల మంది యువతకు రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చారని పేర్కొన్నారు. ఈ విషయం మీకు తెలుసా, తెలియదా అని ప్రశ్నించారు.   

వికసించటానికి అదేమైనా పువ్వా..?  

మతతత్వ రాజకీయాలు చేసో, మతాన్ని అడ్డం పెట్టుకుని ఏపీలో పార్టీ వికసించాలంటే.. అదేమన్నా పువ్వు అనుకుంటున్నారా..? అని నిలదీశారు జోగి రమేష్‌.  బీజేపీ లీడర్ల కలలు కల్లలుగానే మిగిలిపోతాయన్నారు. ఇక్కడ నాయకులు పిలవగానే... ఢిల్లీ నుంచి వచ్చి ఏపీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిగారిని విమర్శించడం ఢిల్లీ వెళ్ళడం బీజేపీ లీడర్లకు అనవాయితీగా మారిందన్నారు. 2014-19 మధ్యకాలంలో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న మీ హయాంలో మీరు చేసిన పనులేంటి..?. మీరు చేసిన మాఫియాలేంటి..? చంద్రబాబు దోపిడీలో మీరు భాగస్వామి అవునా.. కాదా..? అని నిలదీశారు. చంద్రబాబు-మీరు కలిసి నాలుగేళ్ళపాటు అధికారంలో ఉండి దోచుకుని దాచుకుంది నిజం కాదా...?. చంద్రబాబు అవినీతి సామ్రాజాన్ని మీరు పెంచి పోషించలేదా..? చంద్రబాబును, ఆయన దత్తపుత్రుడి మాటలు నమ్మి తమపై నిందలు వేస్తారా అని సీరియస్ అయ్యారు. ఈ రాష్ట్రంలో అవినీతి చక్రవర్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడేనన్నారు.  

విభజన హామీలపై మాట్లాడకుండా.. మత చిచ్చు పెట్టలేరు: జోగి రమేష్

విభజిత ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రంలోని బీజేపీ ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చిందా..? అని ప్రశ్నించారు జోగి రమేష్. విభజన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. ఎందుకు నెరవేర్చలేదని అడిగారు. వాటి గురించి విజయవాడ మీటింగ్‌లో ఎందుకు మాట్లాడలేకపోయారన్నారు. చేయాల్సింది మాత్రం చెప్పకుండా.. తమపై నిందలు వేసి వెళతామంటే.. జనం చూస్తూ ఊరుకోరు అన్నారు. రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీల్చి, ప్రజలను నట్టేట ముంచిన పాపంలో బీజేపీ కూడా భాగస్వామి అన్నారు. బీజేపీకి  ఆంధ్రప్రదేశ్‌లో ఓటు అడిగే నైతిక హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. విభజన హామీల గురించి మాత్రం ఒక్క మాట మాట్లాడకుండా.. మతతత్వ రాజకీయాలతో ఈ రాష్ట్రంలో చిచ్చు పెట్టాలనుకుంటారా..? అని క్వశ్చన్ చేశారు. 

మీ పార్టీలన్నింటినీ ప్రజలు ఒకే గాటిన కట్టారు...

 రాష్ట్రంలో బీజేపీ, కేఏపాల్ పార్టీ, జనసేనను ప్రజలు ఒకేగాటిన కట్టారన్నారు జోగి రమేష్. కేఏ పాల్ పార్టీకి ఎంత విలువ ఉందో.. బీజేపీకి అంతే విలువ ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వార్డు మెంబరుగా కూడా బీజేపీ వాళ్ళు గెలవలేరన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇంత అన్యాయం చేసి.. రాష్ట్రానికి ఏ మొహం పెట్టుకుని వస్తారని ప్రశ్నించారు. వచ్చి సోది చెప్పుకుని పోతే తమకు ఎటువంటి అభ్యంతరం లేదు, తమపై నిందలు మోపడంపైనే తాము ప్రశ్నిస్తున్నామన్నారు.  

పవన్ కల్యాణ్ బుర్ర తక్కువ మాటలు మాట్లాడుతున్నారని హాట్ కామెంట్స్ చేశారు మంత్రి జోగి రమేష్. పవన్ కల్యాణ్ రాష్ట్రానికి టూరిస్టులాంటి వారని...ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు ఏ పార్టీతో పొత్తులో ఉంటారో అతనికే తెలియదన్నారు. మూడు నెలలకో, ఆరు నెలలకో ఒకసారి రావడం, నాలుగు మాటలు మాట్లాడి వెళతాడన్నారు. రాజకీయాల్లో అసలు ఉంటారో... పోటీ చేస్తారో ఏదీ స్పష్టంగా చెప్పరని విమర్శించారు. ఒక రాజకీయ పార్టీగా.. రాష్ట్రంలోని 175 స్థానాల్లో పోటీ చేస్తావా అంటే దానికీ సమాధానం చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎవరంటే అదీ చెప్పలేరన్నారు. అతనిదొక రాజకీయ పార్టీ, అతనొక నాయకుడా  అని ప్రజలు నవ్వుకుంటున్నార‌ని మంత్రి జోగి ఎద్దేవా చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Why did K. Annamalai read the Quran | బీజేపీ యంగ్ లీడర్ అన్నామలై ఖురాన్ ఎందుకు చదివారు..?  | ABPKadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP DesamRR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
Ticket For Raghurama :  ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు -  ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు - ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
Sreemukhi Photos: చుడిదార్‌లో శ్రీముఖి ఎంత ముద్దొస్తుందో - బుల్లితెర రాములమ్మ భలే ఉంది కదూ!
చుడిదార్‌లో శ్రీముఖి ఎంత ముద్దొస్తుందో - బుల్లితెర రాములమ్మ భలే ఉంది కదూ!
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
Embed widget