అన్వేషించండి

కేఏ పాల్‌ పార్టీకి ఎంత విలువుందో బీజేపీకి అంతే విలువ ఉంది: జోగి రమేష్

మతతత్వ రాజకీయాలు చేసో, మతాన్ని అడ్డం పెట్టుకుని ఏపీలో పార్టీ వికసించాలంటే.. అదేమన్నా పువ్వు అనుకుంటున్నారా..? అని నిలదీశారు జోగి రమేష్‌.

బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ టీడీపీ ఆఫీస్‌ ఇచ్చిన స్క్రిప్టును చదివారని విమర్శించారు మంత్రి జోగి రమేష్. ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రిపైనా అర్థంపర్థం లేని విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ గురించి, ఇక్కడ పరిస్థితులు గురించి, ఇక్కడ పాలిస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గురించి ఏం తెలుసని నిలదీశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి తెలుసుకోకుండానే కేంద్ర మంత్రి మాట్లాడటం సరికాదన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌ గురించి కనీసం ఓనమాలు అయినా తెలుసుకుని వచ్చారా కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ను ప్రశ్నించారు జోగి రమేష్. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో అమలు జరగనన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏపీలో అమలవుతున్నాయని తెలిపారు. జగన్ అధికారంలోకి రాగానే.. గాంధీజీ కన్న కలలను నిజం చేస్తూ సచివాలయాల వ్యవస్థ తీసుకొచ్చామని వివరించారు. 2 లక్షల మంది యువతకు రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చారని పేర్కొన్నారు. ఈ విషయం మీకు తెలుసా, తెలియదా అని ప్రశ్నించారు.   

వికసించటానికి అదేమైనా పువ్వా..?  

మతతత్వ రాజకీయాలు చేసో, మతాన్ని అడ్డం పెట్టుకుని ఏపీలో పార్టీ వికసించాలంటే.. అదేమన్నా పువ్వు అనుకుంటున్నారా..? అని నిలదీశారు జోగి రమేష్‌.  బీజేపీ లీడర్ల కలలు కల్లలుగానే మిగిలిపోతాయన్నారు. ఇక్కడ నాయకులు పిలవగానే... ఢిల్లీ నుంచి వచ్చి ఏపీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిగారిని విమర్శించడం ఢిల్లీ వెళ్ళడం బీజేపీ లీడర్లకు అనవాయితీగా మారిందన్నారు. 2014-19 మధ్యకాలంలో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న మీ హయాంలో మీరు చేసిన పనులేంటి..?. మీరు చేసిన మాఫియాలేంటి..? చంద్రబాబు దోపిడీలో మీరు భాగస్వామి అవునా.. కాదా..? అని నిలదీశారు. చంద్రబాబు-మీరు కలిసి నాలుగేళ్ళపాటు అధికారంలో ఉండి దోచుకుని దాచుకుంది నిజం కాదా...?. చంద్రబాబు అవినీతి సామ్రాజాన్ని మీరు పెంచి పోషించలేదా..? చంద్రబాబును, ఆయన దత్తపుత్రుడి మాటలు నమ్మి తమపై నిందలు వేస్తారా అని సీరియస్ అయ్యారు. ఈ రాష్ట్రంలో అవినీతి చక్రవర్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడేనన్నారు.  

విభజన హామీలపై మాట్లాడకుండా.. మత చిచ్చు పెట్టలేరు: జోగి రమేష్

విభజిత ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రంలోని బీజేపీ ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చిందా..? అని ప్రశ్నించారు జోగి రమేష్. విభజన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. ఎందుకు నెరవేర్చలేదని అడిగారు. వాటి గురించి విజయవాడ మీటింగ్‌లో ఎందుకు మాట్లాడలేకపోయారన్నారు. చేయాల్సింది మాత్రం చెప్పకుండా.. తమపై నిందలు వేసి వెళతామంటే.. జనం చూస్తూ ఊరుకోరు అన్నారు. రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీల్చి, ప్రజలను నట్టేట ముంచిన పాపంలో బీజేపీ కూడా భాగస్వామి అన్నారు. బీజేపీకి  ఆంధ్రప్రదేశ్‌లో ఓటు అడిగే నైతిక హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. విభజన హామీల గురించి మాత్రం ఒక్క మాట మాట్లాడకుండా.. మతతత్వ రాజకీయాలతో ఈ రాష్ట్రంలో చిచ్చు పెట్టాలనుకుంటారా..? అని క్వశ్చన్ చేశారు. 

మీ పార్టీలన్నింటినీ ప్రజలు ఒకే గాటిన కట్టారు...

 రాష్ట్రంలో బీజేపీ, కేఏపాల్ పార్టీ, జనసేనను ప్రజలు ఒకేగాటిన కట్టారన్నారు జోగి రమేష్. కేఏ పాల్ పార్టీకి ఎంత విలువ ఉందో.. బీజేపీకి అంతే విలువ ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వార్డు మెంబరుగా కూడా బీజేపీ వాళ్ళు గెలవలేరన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇంత అన్యాయం చేసి.. రాష్ట్రానికి ఏ మొహం పెట్టుకుని వస్తారని ప్రశ్నించారు. వచ్చి సోది చెప్పుకుని పోతే తమకు ఎటువంటి అభ్యంతరం లేదు, తమపై నిందలు మోపడంపైనే తాము ప్రశ్నిస్తున్నామన్నారు.  

పవన్ కల్యాణ్ బుర్ర తక్కువ మాటలు మాట్లాడుతున్నారని హాట్ కామెంట్స్ చేశారు మంత్రి జోగి రమేష్. పవన్ కల్యాణ్ రాష్ట్రానికి టూరిస్టులాంటి వారని...ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు ఏ పార్టీతో పొత్తులో ఉంటారో అతనికే తెలియదన్నారు. మూడు నెలలకో, ఆరు నెలలకో ఒకసారి రావడం, నాలుగు మాటలు మాట్లాడి వెళతాడన్నారు. రాజకీయాల్లో అసలు ఉంటారో... పోటీ చేస్తారో ఏదీ స్పష్టంగా చెప్పరని విమర్శించారు. ఒక రాజకీయ పార్టీగా.. రాష్ట్రంలోని 175 స్థానాల్లో పోటీ చేస్తావా అంటే దానికీ సమాధానం చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎవరంటే అదీ చెప్పలేరన్నారు. అతనిదొక రాజకీయ పార్టీ, అతనొక నాయకుడా  అని ప్రజలు నవ్వుకుంటున్నార‌ని మంత్రి జోగి ఎద్దేవా చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Iran War Effect On Vijayawada Hotels: విజయవాడను తాకిన గ్యాస్ సంక్షోభం! హోటల్స్‌లో సాంబార్ కట్!
విజయవాడను తాకిన గ్యాస్ సంక్షోభం! హోటల్స్‌లో సాంబార్ కట్!
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న

వీడియోలు

AIMIM MLAs Walkout Vandematarm | తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రుల ఫైర్ | ABP Desam
Jay Shah Smashes T20W C 2026 Controversies | పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు జై షా వార్నింగ్ | ABP Desam
Abhishek Sharma T20WC 2026 Secret Revealed | అభిషేక్ కు గంభీర్ సలహా | ABP Desam
Rishabh Pant Transformation IPL 2026 | యువరాజ్ సింగ్ శిక్షణలో రిషబ్ పంత్ | ABP Desam
Sanju Samson Funny Advice to Abhishek | అభిషేక్ శర్మకు సంజూ పెళ్లి సలహా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pakistan Airstrike: కాబూల్‌లో పాక్ వైమానిక దాడులు.. 400 మందికి పైగా మృతి- హాస్పిటల్స్, నివాస ప్రాంతాలే టార్గెట్
కాబూల్‌లో పాక్ వైమానిక దాడులు.. 400 మందికి పైగా మృతి- హాస్పిటల్స్, నివాస ప్రాంతాలే టార్గెట్
Jeevan Reddy: జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Iran War Updates: నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Nandini Sidda Reddy : తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
Sreeleela : శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
Embed widget