అన్వేషించండి

రంజుగా మైలవరం వైసీపీ రాజకీయం- తండ్రి కామెంట్స్‌తో ఇరుకున పడ్డ కృష్ణప్రసాద్!

మైలవరం వైసీపీలో అంతర్గత విభేదాలు నడుస్తున్నాయని ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా మంత్రి జోగి రమేష్, వసంత కృష్ణ ప్రసాద్ మధ్య విభేదాలు ఉన్నాయనే అంశం బహిరంగ రహస్యమే.

మైలవరం వైసీపీ రాజకీయం రంజుగా మారింది. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చుట్టూ రాజకీయం ఆసక్తిగా సాగుతుంది. ఇప్పటికే జిల్లాకు చెందిన మంత్రి జోగి రమేష్‌తో విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన తండ్రి చేసిన వ్యాఖ్యలతో కూడా వసంత కృష్ణ ప్రసాద్‌పై ఒత్తిడి పెరిగిందని అంటున్నారు. చిన్నతనంలో మంత్రిగా తండ్రి ఉన్నప్పుడు ఆయనకు మాట రాకూడదని పద్దతిగా ఉండేవాడినని ఇప్పుడు తన తండ్రి కామెంట్స్ తనకు ఇబ్బందిగా మారాయని వసంత కృష్ణ ప్రసాద్ కామెంట్ చేశారు. 

జగన్‌తో మాట్లాడిన తరువాత స్పందిస్తా...
మైలవరం వైసీపీలో అంతర్గత విభేదాలు నడుస్తున్నాయని ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా మంత్రి జోగి రమేష్, వసంత కృష్ణ ప్రసాద్ మధ్య విభేదాలు ఉన్నాయనే అంశం బహిరంగ రహస్యమే. అయితే తాజాగా వసంత కృష్ణ ప్రసాద్ కూడ జోగితో ఉన్న విభేదాలపై స్పందించారు. అధినేత జగన్‌తో మాట్లాడిన తరువాతనే ఈ విభేదాలపై తాను మాట్లాడతానని వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. దీంతో ఇప్పటి వరకు విభేదాలపై ఉన్న ఊహగానాలు నిజమేనని వైసీపీ నేతలు, క్లారిటికి వచ్చారు. అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రతి అంశం రాజకీయంగా మారి ప్రతిపక్షాలకు అలుసుగా మారటం ఇష్టం లేకనే ఎక్కువగా మాట్లాడటం లేదని వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు.
 
మైలవరంలో వసంత...జోగి....
మైవలరం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేగా వసంత కృష్ణ ప్రసాద్ గెలుపొందారు. అయితే ఎన్నికల సమయం వసంత కృష్ణ ప్రసాద్ ఆఖరి నిమిషంలో నియోజకవర్గంకు వచ్చారు. అప్పటి వరకు నియోజకవర్గ బాద్యతలను చూసిన జోగి రమేష్‌ను వైసీపీ నాయకత్వం పెడనకు పంపింది. జోగి రమేష్ స్థానంలో వసంత కృష్ణ ప్రసాద్‌కు జగన్ సీటు ఇవ్వటంతో వైసీపీ గాలిలో విజయం వరించింది. అయితే అప్పటి వరకు నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్న జోగి రమేష్ కూడా పెడనకు వలస వెళ్లి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఇద్దరు నేతలు విజయం సాధించినప్పటికి మైలవరంపైనే ఎక్కువ ఆసక్తి ఉన్నా జోగి రమేష్‌కు వసంత కృష్ణ ప్రసాద్ రాక ఇష్టం లేదనే ప్రచారం ఉంది. 

అయితే క్యాడర్ అంతా జోగి రమేష్‌కు అందుబాటులో ఉండటంతో ఆయన చెప్పినట్లుగానే నియోజకవర్గంలో జరగాలని జోగి ప్రయత్నించేవారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల మంత్రి అయిన తరువాత కూడా జోగి రమేష్ మైలవరం పైనే ఎక్కువ ఆసక్తి చూపించటం, నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలు,పార్టీ వ్యవహరాలు, క్యాడర్ అంశాల్లో వేలు పెట్టటంతో ఇరువర్గాలకు మధ్య విభేదాలు వచ్చాయని అంటున్నారు. దీంతో జోగి రమేష్ వ్యవహరం నచ్చక, వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ అగ్రనేతల వద్ద పంచాయితీ పెట్టటం, ఈ వ్యవహరం మరింత ముదిరిందనే ప్రచారం ఉంది. 

నియోజకవర్గం నదీ తీరంలో ఉండటంతో ఇసుక పంచాయితీలో కూడా జోగి రమేష్ ఎంట్రీ ఇవ్వటంతో, వసంత కృష్ణ ప్రసాద్ వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. దీంతో నియోజకవర్గంలో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోవటానికి కారణం అయ్యిందని చెబుతున్నారు. ఎవరి నియోజకవర్గంలో వారు పనులు చేసుకుంటే ఇబ్బందులు ఉండవని, ఇలాంటి చిన్న చిన్న గొడవలతో ఇబ్బందిగా ఉందని పార్టీ అగ్రనేతలకు వసంత పలు మార్లు చెప్పినప్పటికి ప్రయోజనం లేదని అంటున్నారు.

మైలవరంలో దేవినేని ఉమానే టార్గెట్...

మైలవరం నియోజకవర్గంలో టీడీపీ ఇంచార్జ్ గా ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమాను టార్గెట్ గా చేసుకొని వైసీపీ రాజకీయం నడుపుతుంది. ఇందులో భాగంగానే గత ఎన్నికల్లో అప్పటి వరకు నియోజకవర్గ బాధ్యుడిగా ఉన్న జోగి రమేష్‌ను సామాజిక వర్గాల సమీకరణాల్లో పెడనకు పంపి, మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్‌ను తెరమీదకు తెచ్చి సీటు ఇచ్చారు. అనుకున్నట్లే వైసీపీ టార్గెట్ చేసిన దేవినేని ఉమాను ఓడించారు. అయితే తానే స్వయంగా దేవినేని ఉమాపై పోటీ చేసి ఓడించే అవకాశం పోయిందని, జోగి రమేష్ అసహనంతో ఉన్నారని కూడా ఇప్పటికి ప్రచారం జరుగుతుంది. అదే ధ్యాసతో ఇప్పటికి మైలవరంపైనే జోగి రమేష్ ఎక్కువ శ్రద్ద చూపించటంతో, మైలవరం నుంచి గెలుపొందిన వసంత కృష్ణ ప్రసాద్‌కు ఇబ్బందిగా మారింది. ఇక ఫిర్యాదు చేసినా, అదిష్టానం పట్టించుకోకపోవటం, ఆపైన జోగికి మంత్రి పదవి కూడా రావటంతో తప్పని పరిస్థితుల్లో వసంత కృష్ణ ప్రసాద్ మౌనంగానే భరిస్తున్నారని అంటున్నారు..

టాప్ హెడ్ లైన్స్

AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Kesineni Chinni daughter Issue: ఏపీ రాజకీయాల్లో కేశినేని చిన్నీ కుమార్తె సోషల్ మీడియా పోస్టు కలకలం! సాయంత్రానికి స్నిగ్ధ వివరణ!
ఏపీ రాజకీయాల్లో కేశినేని చిన్నీ కుమార్తె సోషల్ మీడియా పోస్టు కలకలం! సాయంత్రానికి స్నిగ్ధ వివరణ!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Birbhum Police Raid: బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Ram Charan : ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
Maruti Suzuki Victoris EMI calculator: హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Korean Horror Thriller OTT : దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
Embed widget