అన్వేషించండి

AP News: కరెంటు బిల్లు ఎక్కువని కాళ్లు విరిగినా పింఛన్ ఇవ్వట్లేదు - ఇదీ ఏపీ సర్కారు తీరు!

AP News: రోడ్డు ప్రమాదాంలో రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు. చికిత్స కోసం ఆస్తులన్నీ అమ్మేశారు. పింఛన్ కోసం ఏడాదిగా తిరుగుతున్నా ఏవేవో కారణాలు చెబుతూ అతనికి సాయం చేయట్లేరు.

AP News: విధి ఎప్పుడు ఎవరిని వెక్కిరిస్తుందో తెలియదు. అప్పటివరకూ అంతా బాగానే ఉందనుకున్న చాలా కుటుంబాల్లో అనేక సమస్యలు వచ్చి పడుతుంటాయి. ఓ కుటుంబానికి ఇలాంటి సమస్యే వచ్చి పడింది. వెల్డింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగించే అతడి జీవితంలో రోడ్డు ప్రమాదం తీరని శోకాన్ని నింపింది. ఇంటి పెద్దకు కాళ్లు, చేతులు విరగడంతో చికిత్స కోసం ఉన్న ఆస్తులన్నీ అమ్మేశారు. బతుకే భారంగా మారిపోయింది. పూట గడవడమే కష్టంగా తోస్తోంది. కనీసం ప్రభుత్వం ఇచ్చే పింఛన్ వచ్చినా పిల్లల కడుపు నింపచ్చని భావించిన ఆ వ్యక్తి... పింఛన్ కోసం ఏడాది కాలంగా తిరుగుతూనే ఉన్నాడు. సదరమ్ సర్టిఫికేట్ లో 77 శాతం వికలాంగుడు అని వైద్యులు ధ్రువీకరణ చేసినప్పటికీ.. విద్యుత్ బిల్లు ఎక్కువని, ఇతర కారణాలు చెబుతూ పింఛన్ ఇవ్వట్లేదు. దీంతో ఏం చేయాలో పాలుపోని అతడు కన్నీరు పెడుతున్నాడు. 

అసలేం జరిగిందంటే..?

ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ గ్రామీణ మండలం పైడూరిపాడుకు చెందిన శ్రీరామకోటేశ్వర రావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వెల్గిండ్ కూలీ పనులు చేసుకుంటూ జీవితాన్ని వెళ్లదీస్తున్నాడు. అయితే రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రెండు కాళ్లు, పక్కటెముకలు విరిగిపోవడంతో పాటు గూని కూడా జారిపోయింది. వైద్య చికిత్సలు నిమిత్తం విజయవాడ, హైదరాబాద్ లోని పలు ఆస్పత్రులకు అతడి కుటుంబ సభ్యులు తీసుకొని వెళ్లారు. నాలుగు సార్లు అతడికి వైద్యులు ఆపరేషన్లు కూడా చేశారు. ఇందుకోసం అతడి కుటుంబ సభ్యులు సుమారు పదిన్నర లక్షల రూపాయల వరకు ఖర్చు చేశారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అలాగే డబ్బులు లేక ఉన్న ఒక్క ఇళ్లును కూడా అమ్మేశారు. ఎన్ని ఆపరేషన్లు చేసినా అతడి కాళ్లు మెరుగు పడలేదు. కనీసం నడవడానికి కూడా లేకుండా పోయింది. మందుల కోసం నెలకు సుమారు 5 వేల ఖర్చు కూడా వస్తోంది. ఇది చాలదన్నట్లు ప్రతి 15 రోజులకు ఒకసారి ఆస్పత్రికి వెళ్లి చూపించుకోవాలి. కుటుంబ పోషణ భారంగా ఉన్న వీళ్లకు ఆస్పత్రి ఖర్చులు మరింత ఎక్కువ అయ్యాయి.

పింఛన్ కోసం దరఖాస్తు చేస్తూనే ఉన్న రామకోటేశ్వర రావు

గతేడాది శిబిరంలో 77 శాతం వికలాంగుడు అని ధ్రువీకరణ చేశారు. అప్పటి నుంచి అతడు వికలాంగుల పింఛన్ కోసం దరఖాస్తు చేస్తూనే ఉన్నాడు. ఏడాది నుంచి పింఛన్ కోసం తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. తొలుత కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని తిరస్కరించారు. ఇప్పుడేమో రకరకాల కారణాలు చూపుతున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే.. కలెక్టరేట్ లోని స్పందనలో ఫిర్యాదు చేయమన్నారని బాధితుడు తెలిపారు. ఇలా తిప్పుతూనే ఉన్నారు తప్పితే పింఛన్ మాత్రం రావడం లేదని వాపోయారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి పింఛన్ మంజూరు చేయాలని రామకోటేశ్వర రావు కోరుతున్నాడు. 

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : మంగళగిరిలోనే ఉన్న మంత్రివర్గ సమావేశానికి హాజరుకాని పవన్ కల్యాణ్‌- కూటమిలో ఏం జరుగుతోంది?
మంగళగిరిలోనే ఉన్న మంత్రివర్గ సమావేశానికి హాజరుకాని పవన్ కల్యాణ్‌- కూటమిలో ఏం జరుగుతోంది?
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
Pithapuram Roads: పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
Bold Series OTT : ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Embed widget