అన్వేషించండి

వైసీపీలో వరుస సస్పెన్షన్ లు - మొన్న రావిపై వేటు, నేడు దాస్ ఔట్ !

మెన్న రావి పై వేటు..నేడు దాస్...వైసీపీలో వరుస సస్పెన్షన్ లు

ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సస్పెష్షన్ ల పర్వం కొనసాగుతోంది. మరో కీలక నేతపై వేటు వేస్తూ వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గానికి చెందిన దోవారి ఏసు దాస్ (డీవై దాస్)ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డీవై దాస్ పై బహిష్కరణ వేటు వేసినట్లు వైసీపీ ప్రకటించింది. పామర్రు నియోజకవర్గం నుంచి 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన దాస్.. ఆ తర్వాత టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల తర్వాత ఆయన టీడీపీని వీడి వైసీపీలోకి వచ్చారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా దాస్ పై వచ్చిన ఆరోపణలతో క్రమశిక్షణ సంఘం తీసుకున్న నిర్ణయం మేరకు చర్యలు చేపట్టినట్లుగా వెల్లడించారు.

వైసీపీ పార్టీ అధికారం తిరిగి దక్కించుకునేందుకు అధినేత, సీఎం జగన్ టార్గెట్ 175 పేరుతో ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలో జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకోవటంతో పాటుగా ఎలాంటి పరిస్దితులను అయినా ఎదుర్కొనే విధంగా కార్యచరణను డిసైడ్ చేసుకుంటున్నారు. ఇందుకు ప్రధానంగా పార్టీ పటిష్టపై అదే స్థాయిలో ఫోకస్ చేస్తున్నారు. దీంతో నియోజకవర్గాల వారీగా పార్టీ నాయకులపై బాధ్యతల బరువును పెంచుతూ ఇంఛార్జ్‌లు గడప గడపకు వెళ్లాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రజల్లో ఉన్న వారికి మాత్రమే పార్టీ పదవులు, బాధ్యతలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఇటీవల తాడేపల్లిలో జరిగిన నియోజకవర్గ స్థాయి నాయకుల సమావేశంలో జగన్ సంకేతాలు ఇచ్చారు. దీంతో ఇప్పుడు పార్టీ నాయకులు అంతా గడప గడపకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేసుకోవటంతో సహా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అవసరం అయిన అన్ని మార్గాలను పార్టీ నేతలు పరిశీలిస్తున్నారని సమాచారం.
ఎవరైనా సరే వేటు తప్పదు..
రాష్ట్ర ప్రభుత్వ పాలన, పార్టీ నిర్వహణను సమాంతరంగా నడిపించేందుకు జగన్ కీలకమయిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా నియోజకవర్గాల వారీగా ఉన్న కొందరు నాయకులు పార్టీ కోసం చేయకుండా, కేవలం విభేదాలకు మాత్రమే అధికంగా ప్రాధాన్యత ఇవ్వటం కూడా సమస్యగా మారింది. ఇలాంటి విషయాలపై జగన్ చాలా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన జోష్ పెరిగిపోవడంతో పార్టీలో మాట వినని నాయకులు, పని చేయని నాయకులు, విభేదాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే కొందరు నాయకులను సాగనంపేందుకు వెనకాడటం లేదు. అలాంటి నాయకులకు పని తీరు మార్చుకోవాలని టైం కూడా ఇవ్వకుండానే నేరుగా సస్పెన్షన్ వేటు వేసేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గానికి చెందిన రావి వెంకట రమణపై జగన్ సస్పెన్షన్ వేటు వేశారు. పార్టీ స్థాపించన నాటి నుంచి నియోజవకర్గంలో రావి పని చేశారు. పార్టీని నమ్ముకొని అనేక సందర్బాల్లో ప్రజా పోరాటాలు కూడ చేశారు. టీడీపీకి కంచుకోటగా ఉన్నపొన్నూరు నియోజకవర్గంలో వైసీపీకి ఊపిరి పోశారు. అయితే ఎన్నికల సమయంలో మాత్రం రావికి టిక్కెట్ దక్కలేదు. దీంతో అప్పటి నుండి రావి పార్టీలోనే ఉంటున్నా, అంతగా క్రియాశీలకంగా వ్యవహరించటం లేదు. 
ఇటీవల ఎమ్మెల్యే కిలారి రోశయ్యతో వచ్చిన విభేదాలు, పార్టీ దృష్టికి రావి వ్యవహరం వెళ్ళింది. దీంతో క్రమశిక్షణ కమిటీ విచారణ జరిపి నివేదికను పార్టీ అధినేత జగన్ ముందు ఉంచారు. దీంతో రావిని సస్పెండ్ చేశారు. 
ఇదే కోవలో ఇప్పుడు కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గానికి చెందిన దాస్ కూడా చేరారు. ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే కైలే అనిల్ తో విభేదాలు రావటంతో దాస్ వేరు కుంపటి పెట్టారు. దీంతో నియోజకవర్గంలో పార్టీ రెండు గ్రూపులుగా తయారయ్యింది. పార్టీకి చెందిన శాసన సభ్యుడు ఉండగా ఆయన్ను కాదని పని చేయటం, సరికాదని కలసి పని చేసుకోవాలని పార్టీ నుండి వచ్చిన సూచనలను దాస్ పట్టించుకోకపోవటంతో సస్పెన్షన్ తప్పలేదని పార్టీ నేతలు చెబుతున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy at WEF:
"మేధస్సే సమస్య మేధస్సే పరిష్కారం" ప్రపంచ ఆర్థిక వేదికపై తెలంగాణ సీఎం కీలక కామెంట్స్
APSRTC Income: ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసికి పండగే పండగ! ఒక్కరోజులో 27.68 కోట్ల ఆదాయం! రికార్డ్ సృష్టించిన APSRTC
ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసికి పండగే పండగ! ఒక్కరోజులో 27.68 కోట్ల ఆదాయం! రికార్డ్ సృష్టించిన APSRTC
Nitin Navin:
"మీరే బాస్, నేను పార్టీ కార్యకర్తను" నితిన్ నవీన్‌తో ప్రధాని మోదీ సంభాషణ వైరల్
Nara Lokesh in Davos: ఏపీలో RMZ లక్ష కోట్ల పెట్టబడి ప్రతిపాదనలు - దావోస్‌లో మంత్రి లోకేష్ సమక్షంలో ప్రకటన
ఏపీలో RMZ లక్ష కోట్ల పెట్టబడి ప్రతిపాదనలు - దావోస్‌లో మంత్రి లోకేష్ సమక్షంలో ప్రకటన

వీడియోలు

Medaram Jatara Houseflies Mystery | మేడారం మహాజాతరలో కనిపించని ఈగలు | ABP Desam
Medaram Jatara Gattamma Thalli History | ఎవరీ గట్టమ్మ తల్లి ? | ABP Desam
WPL 2026 RCB vs GG | ఆర్‌సీబీకు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు
Sunil Gavaskar Comments on Team India | టీమిండియాపై సునీల్ గవాస్కర్ కామెంట్స్
Simon Doule about Rohit Sharma | రోహిత్ పై కివీస్ మాజీ ప్లేయర్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy at WEF:
"మేధస్సే సమస్య మేధస్సే పరిష్కారం" ప్రపంచ ఆర్థిక వేదికపై తెలంగాణ సీఎం కీలక కామెంట్స్
APSRTC Income: ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసికి పండగే పండగ! ఒక్కరోజులో 27.68 కోట్ల ఆదాయం! రికార్డ్ సృష్టించిన APSRTC
ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసికి పండగే పండగ! ఒక్కరోజులో 27.68 కోట్ల ఆదాయం! రికార్డ్ సృష్టించిన APSRTC
Nitin Navin:
"మీరే బాస్, నేను పార్టీ కార్యకర్తను" నితిన్ నవీన్‌తో ప్రధాని మోదీ సంభాషణ వైరల్
Nara Lokesh in Davos: ఏపీలో RMZ లక్ష కోట్ల పెట్టబడి ప్రతిపాదనలు - దావోస్‌లో మంత్రి లోకేష్ సమక్షంలో ప్రకటన
ఏపీలో RMZ లక్ష కోట్ల పెట్టబడి ప్రతిపాదనలు - దావోస్‌లో మంత్రి లోకేష్ సమక్షంలో ప్రకటన
Harish Rao SIT investigation : ఏడున్నర గంటల పాటు హరీష్ రావుపై ప్రశ్నల వర్షం - సిట్ సంచలన విషయాలు రాబట్టిందా?
ఏడున్నర గంటల పాటు హరీష్ రావుపై ప్రశ్నల వర్షం - సిట్ సంచలన విషయాలు రాబట్టిందా?
Durgam Cheruvu ABP Desam Effect: దుర్గం చెరువు దుస్థితిపై ఏబీపీ దేశం కథనాలకు హైడ్రా స్పందన - ఇక బాధ్యత తమదేనని రంగనాథ్ ప్రకటన
దుర్గం చెరువు దుస్థితిపై ఏబీపీ దేశం కథనాలకు హైడ్రా స్పందన - ఇక బాధ్యత తమదేనని రంగనాథ్ ప్రకటన
Donald Trump Greenland: ట్రంప్ గ్రీన్‌ లాండ్ కోసం ఎందుకు పట్టుబుతున్నాడు.. ? మంచుగడ్డ కింద మహా రహస్యం..!
ట్రంప్ గ్రీన్‌ లాండ్ కోసం ఎందుకు పట్టుబుతున్నాడు.. ? మంచుగడ్డ కింద మహా రహస్యం..!
Traffic challan: వాహనదారులకు హైకోర్టు బిగ్ రిలీఫ్ - రోడ్లపై బలవంతపు చలాన్ల వసూళ్లకు చెక్
వాహనదారులకు హైకోర్టు బిగ్ రిలీఫ్ - రోడ్లపై బలవంతపు చలాన్ల వసూళ్లకు చెక్
Embed widget