News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

పల్నాడులో హత్యాచార బాధిత కుటుంబానికి అండగా ప్రభుత్వం- 10 లక్షల సాయం అందజేత

బాధితులకు అండగా ఉండటమే కాకుండా వారికి న్యాయం జరిగేలా నిందితులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అధికారులను జగన్ ఆదేశించారు. సీఎం ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

FOLLOW US: 
Share:

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల మండలంలో దారుణం జరిగింది. అనుపు చెంచు కాలనీ గ్రామానికి చెందిన ఆశావర్కర్‌పై ముగ్గురు వ్యక్తులు హత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై ప్రభుత్వం స్పందించింది. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని స్థానిక నాయకులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. 

బాధితులకు అండగా ఉండటమే కాకుండా వారికి న్యాయం జరిగేలా నిందితులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అధికారులను జగన్ ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి  నిందితుల కోసం గాలిస్తున్నారు.

మరోవైపు బాధితులకు అండగా ఉండాలన్న ఆదేశాలతో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం చేశారు. ప్రభుత్వం పది లక్షల రూపాయల చెక్‌ను బాధితురాలి ఫ్యామిలీకి అందజేశారు. 

శుక్రవారం రాత్రి ముగ్గురు వ్యక్తులు మహిళపై అత్యంత క్రూరంగా అత్యాచారం చేసి హత్య చేశారు. ఇది స్థానికంగా సంచలనంగా మారింది. ఘటన జరిగిన వెంటనే విషయాన్ని ముఖ్యమంత్రికి తెలియజేశారు స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డిని  ఆదేశించారు. 

మృతురాలు ఆశావర్కర్‌గా పని చేస్తుంటే... ఆమె కుమార్తె గ్రామ వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 

Published at : 18 Sep 2022 07:00 PM (IST) Tags: ANDHRA PRADESH CM Jagan Palnadu News Pinnelli Rama Krishan Reddy

ఇవి కూడా చూడండి

Diploma in Pharmacy: ఫార్మసీ డిప్లొమా కోర్సుల ప్రవేశాల షెడ్యూలు విడుదల, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

Diploma in Pharmacy: ఫార్మసీ డిప్లొమా కోర్సుల ప్రవేశాల షెడ్యూలు విడుదల, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

Polytechnic Branches: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 16 బ్రాంచిలకు ఎన్‌బీఏ గుర్తింపు, త్వరలో మరిన్ని కాలేజీలకు అక్రిడియేషన్

Polytechnic Branches: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 16 బ్రాంచిలకు ఎన్‌బీఏ గుర్తింపు, త్వరలో మరిన్ని కాలేజీలకు అక్రిడియేషన్

SI Recruitment: ఎస్ఐ పోస్టుల భర్తీలో కీలక పరిణామం - కోర్టులోనే 'ఎత్తు' కొలవండి, హైకోర్టు ఆదేశం

SI Recruitment: ఎస్ఐ పోస్టుల భర్తీలో కీలక పరిణామం - కోర్టులోనే 'ఎత్తు' కొలవండి, హైకోర్టు ఆదేశం

AP News: దుర్గగుడి ఛైర్మన్ కర్నాటి రాంబాబుపై దాడి - పోలీసుల అదుపులో నిందితుడు

AP News: దుర్గగుడి ఛైర్మన్ కర్నాటి రాంబాబుపై దాడి - పోలీసుల అదుపులో నిందితుడు

AP ICET: ఏపీ ఐసెట్ రెండో విడత సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదల, కళాశాలలవారీగా సీట్ల వివరాలు ఇలా

AP ICET: ఏపీ ఐసెట్ రెండో విడత సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదల, కళాశాలలవారీగా సీట్ల వివరాలు ఇలా

టాప్ స్టోరీస్

Sonia Gandhi: మీకు నిజాయతీ పాలనను అందించడానికి మేం సిద్ధం - సోనియా గాంధీ వీడియో విడుదల

Sonia Gandhi: మీకు నిజాయతీ పాలనను అందించడానికి మేం సిద్ధం - సోనియా గాంధీ వీడియో విడుదల

Uttarakhand Tunnel Rescue: టన్నెల్ రెస్క్యూ పనులు పూర్తి, మరికాసేపట్లో బయటకు రానున్న 41మంది కార్మికులు: సీఎం ధామి

Uttarakhand Tunnel Rescue: టన్నెల్ రెస్క్యూ పనులు పూర్తి, మరికాసేపట్లో బయటకు రానున్న 41మంది కార్మికులు: సీఎం ధామి

Telangana Elections 2023 : కేటీఆర్ ప్రచార వ్యూహాలతో బీఆర్ఎస్ దూకుడు - అంతా తానై నడిపించిన వర్కింగ్ ప్రెసిడెంట్ !

Telangana Elections 2023 :  కేటీఆర్ ప్రచార వ్యూహాలతో బీఆర్ఎస్ దూకుడు - అంతా తానై నడిపించిన వర్కింగ్ ప్రెసిడెంట్ !

Mansoor Ali Khan: పార్టీ పెట్టి కోట్లు సంపాదించారు, పేదల కోసం పైసా ఖర్చు చేయలేదు - చిరంజీవిపై మన్సూర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు

Mansoor Ali Khan: పార్టీ పెట్టి కోట్లు సంపాదించారు, పేదల కోసం పైసా ఖర్చు చేయలేదు - చిరంజీవిపై మన్సూర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు