అన్వేషించండి

మధ్యాహ్నం జనసేన, వైసీపీ బాహాబాహీ- రాత్రికి జగన్ కౌటట్‌కి నిప్పు- కృష్ణాజిల్లాలో దుమారం!

జనసేన నేతలపై మంత్రి జోగి రమేష్ అనుచరులు పోలీస్టేషన్‌లోకి వెళ్లి దాడికి పాల్పడటం కలకలం రేపింది.

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కటౌట్‌కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. కటౌట్ సగానికిపైగా కాలిపోయింది. అర్థరాత్రి సమయంలో ఈ ఘటన వెలుగు చూసింది. వెంటనే స్పందించిన స్థానికులు మంటలను ఆర్పి వేశారు. ఈ ఘటనకు కారకులు ఎవరు అనేదానిపై పోలీసులు విచారణ చేపట్టారు.

అర్దరాత్రి కలకలం....
కృష్ణాజిల్లా మచిలీపట్నం, విజయవాడ జాతీయ రహదారి పక్కన గూడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదురుగా 
ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కటౌట్ ను స్దానిక వైసీపీ నేతలు ఏర్పాటు చేశారు. ఆ కటౌట్‌ను శుక్రవారం అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించి పారిపోయారు. సమాచారం అందుకున్న  పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. బందరు డీఎస్పీ భాష, పెడన రూరల్ సీ.ఐ. ప్రసన్న గౌడ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. 

జగన్ కటౌట్‌కు అర్ధరాత్రి నిప్పు పెట్టడంతో మంటు ఎగసిపడ్డాయి. వెంటనే స్థానికులు మంటలు పెద్దవి కాకుండా నిలువరించారు. ఎవరు ఘటనకు పాల్పడ్డారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

రంగంలోకి వైసీపీ....

సీఎం జగన్ కటౌట్‌కు నిప్పు పెట్టటంపై స్దానిక వైసీపీ నేతలు మండిపడుతున్నారు. విషయం తెలుసుకున్న గూడూరు ఎం.పీ.పీ 
 మధుసూదన్ రావు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కామేశ్వరరావు, గూడూరు ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ డైరెక్టర్ ఎన్.ఏ.సలీం, దళిత నాయకులు సంఘటనా స్థలం వద్ద కొద్ది సేపు ఆందోళన నిర్వహించారు. నెల రోజులు క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెడనలో పర్యటించారు. చేయూత పథకం కింద లబ్ధిదారులకు ఆర్థిక సహయాన్ని అందించారు. అప్పుడు స్థానిక వైసీపీ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కటౌట్ ఏర్పాటు చేశారు. 

ఇలాంటి చర్యలను ఖండిస్తున్నట్లు వైసీపీ నాయకులు వెల్లడించారు. రాజకీయాల్లో అనేక గొడవలు ఉంటాయి కానీ ఫ్లెక్సీలపై కటౌట్‌లకు నిప్పు పెట్టటం పిరికిపందల చర్యగా అభివర్ణించారు. దమ్ముంటే కటౌట్‌ను తగలపెట్టిన వారు బహిరంగ చర్చకు రావాలని గూడూరు ఎంపీపీ సంఘం నేతలు మధుసూదన్ రావు, కారుమంచి కామేశ్వరావు సవాల్ విసిరారు.

నిన్న వైసీపీ,జనసేన బాహాబాహీ...

మంత్రి జోగి రమేష్‌కు వ్యతిరేకంగా స్థానికంగా జనసేన నాయకులు పోస్టర్లతో ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి జోగి రమేష్ అనుచరుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు ముందే జనసేన కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడి చేశారని ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. వైసీపీ నేతలు దాడులు చేస్తున్నా పోలీసు సిబ్బంది ప్రేక్షక పాత్రపోషించారని జనసేన ఆరోపిస్తోంది. జిల్లా ఎస్పీ స్పందించి‌ చర్యలు తీసుకోవాలని జనసేన నేత‌ యడ్లపల్లి రామ్ సుధీర్ కోరారు. తమ వారిని ఎందుకు అరెస్టు చేశారని అడిగినందుకు రామ్‌సుధీర్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్ కు తరలించారు. దీంతో జనసేన, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి అమలు చేయలేదని, పెడన నియోజకవర్గంలో జోగి రమేష్ అబద్దాలతో ప్రజలను మోసం చేస్తున్నారని జనసేన ఆరోపించింది. ఇచ్చిన హామీలు అమలు‌ చేయాలని పోస్టర్లు అంటించామని జనసేన నేతలు వెల్లడించారు. దీంతో జనసేన నేతలరు పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే జనసేన నేతలపై మంత్రి జోగి రమేష్ అనుచరులు పోలీస్టేషన్‌లోకి వెళ్లి దాడికి పాల్పడటం కలకలం రేపింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nellore Mayor Resignation: నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామా.. వాట్సాప్‌లో కలెక్టర్‌కు లేఖ
నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామా.. వాట్సాప్‌లో కలెక్టర్‌కు లేఖ
IND vs SA 3rd T20: ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
CM Revanth Reddy: తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
Itlu Arjuna Teaser : ప్రొడ్యూసర్‌గా మారిన డైరెక్టర్ - కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్... ఇంట్రెస్టింగ్‌గా 'ఇట్లు అర్జున' టీజర్
ప్రొడ్యూసర్‌గా మారిన డైరెక్టర్ - కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్... ఇంట్రెస్టింగ్‌గా 'ఇట్లు అర్జున' టీజర్

వీడియోలు

Abhishek Sharma to Break Virat Record | కోహ్లీ అరుదైన రికార్డుపై కన్నేసిన అభిషేక్
India vs South Africa 3rd T20 | భారత్ x సౌతాఫ్రికా మూడో టీ20
Robin Uthappa on Gambhir Ind vs SA | గంభీర్ పై ఉత్తప్ప కామెంట్స్
Suryakumar Yadav Form in SA T20 Series | సూర్య కుమార్ యాదవ్ పై ట్రోల్స్
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nellore Mayor Resignation: నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామా.. వాట్సాప్‌లో కలెక్టర్‌కు లేఖ
నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామా.. వాట్సాప్‌లో కలెక్టర్‌కు లేఖ
IND vs SA 3rd T20: ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
CM Revanth Reddy: తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
Itlu Arjuna Teaser : ప్రొడ్యూసర్‌గా మారిన డైరెక్టర్ - కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్... ఇంట్రెస్టింగ్‌గా 'ఇట్లు అర్జున' టీజర్
ప్రొడ్యూసర్‌గా మారిన డైరెక్టర్ - కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్... ఇంట్రెస్టింగ్‌గా 'ఇట్లు అర్జున' టీజర్
The Paradise : నేచరల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' మేకింగ్ వీడియో - రక్తం పడిన తర్వాతే హిస్టరీ ఓపెన్
నేచరల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' మేకింగ్ వీడియో - రక్తం పడిన తర్వాతే హిస్టరీ ఓపెన్
Mowgli First Day Collection : రోషన్ కనకాల 'మోగ్లీ' - సుమ కొడుకు మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
రోషన్ కనకాల 'మోగ్లీ' - సుమ కొడుకు మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
Top Mileage Cars in India: వ్యాగన్ ఆర్ నుంచి టాటా పంచ్ వరకు.. రూ.10 లక్షలలోపు అధిక మైలేజ్ ఇచ్చే కార్లు
వ్యాగన్ ఆర్ నుంచి టాటా పంచ్ వరకు.. రూ.10 లక్షలలోపు అధిక మైలేజ్ ఇచ్చే కార్లు
Pawan Kalyan Helps Cricketers: అంధ క్రికెటర్లు దీపిక, ప్లేయర్ కరుణ కుమారి కుటుంబాలకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్
అంధ క్రికెటర్ల కుటుంబాలకు అండగా నిలిచిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Embed widget