అన్వేషించండి

KVP On CM Jagan : బీజేపీకి దగ్గరైన జగన్ ఏపీ అభివృద్ధిని దెబ్బతీస్తున్నారు, కేవీపీ సంచలన వ్యాఖ్యలు

KVP On CM Jagan : బీజేపీకి దగ్గరైన సీఎం జగన్ రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ విమర్శలు చేస్తున్నారు.

KVP On CM Jagan : ఏపీలో వైఎస్ఆర్సీపీ పాలన చూస్తుంటే ఆవేదన కలుగుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు అన్నారు. ఆదివారం విజయవాడలో కాంగ్రెస్‌ సమన్వయ, రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కేవీపీ సీఎం జగన్ పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం, విభజన హామీలు, ప్రత్యేక హోదా అంశాల్లో  సీఎం జగన్‌ కేంద్రాన్ని ఒక్క మాట కూడా అనడంలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో పాటు తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయాన్ని ధిక్కరించకూడదని, విమర్శించకూడదని 1996లో వైఎస్, తాను నిర్ణయించుకున్నామని కేవీపీ తెలిపారు.  

బీజేపీకి దగ్గరవుతున్న జగన్  

విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు కేంద్రం సిద్ధపడుతున్న సమయంలో దానిని ఆపేందుకు సీఎం జగన్ ఒక్క ప్రయత్నం కూడా చేయడం లేదని కేవీపీ అన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రమే నిర్మిస్తుందని చట్టంలో ఉందని, కానీ టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ కోసం నిర్మాణ బాధ్యతలు తీసుకోవడాన్ని కేవీపీ తప్పుబట్టారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడం, రాహుల్ గాంధీని ప్రధాని చేయడం వైఎస్ రాజశేఖర్ రెడ్డి లక్ష్యంగా ఉండేదన్నారు. ఏపీ విభజన అంశాలను నెరవేర్చడానికి జగన్ ప్రయత్నించలేదని ఆరోపించారు. బీజేపీకి దగ్గరైన జగన్ ఏపీ అభివృద్ధిని దెబ్బతీస్తున్నారని కేవీపీ ఆవేదన చెందారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు భవిష్యత్ ఉందన్నారు.  ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేస్తే 2024లో కాకపోయినా 2029 నాటికైనా కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సాధిస్తుందన్నారు.  

చివరి వరకూ కాంగ్రెస్ తోనే 

వైఎస్ఆర్, తనకు కాంగ్రెస్ రాజకీయ భవిష్యత్ ఇచ్చిందని కేవీపీ రామంచంద్రరావు గుర్తుచేశారు. 1978 నుంచి వైఎస్ఆర్ కు కాంగ్రెస్ అనేక పదవులు కట్టబెట్టిందన్నారు. అలాంటి పార్టీని ఎప్పటికీ వీడకూడదని అధిష్ఠానం నిర్ణయాన్ని ధిక్కరించకూడదని 1996లోనే  తామిద్దరం ఒట్టేసుకున్నామన్నారు. తాను చివరిదాకా కాంగ్రెస్ తోనే ఉంటానని కేవీపీ స్పష్టం చేశారు. దివంగత నేత వైఎస్ఆర్ కు కేపీపీ అత్యంత ఆప్తులు. వైఎస్ఆర్ హయాంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తొలిసారి ఎంపీగా కేవీపీ ఎన్నికయ్యారు. ఆ తర్వాత మరోసారి ఆయన రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. వైఎస్ కుటుంబానికి ఎంతో సన్నిహితుడైన కేసీపీ... జగన్ కాంగ్రెస్ నుంచి విడిపడి కొత్త పార్టీని పెట్టుకున్నా ఆయన మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ సీఎం జగన్ కు సాయం చేస్తున్నారని కేవీపీ విమర్శలు లేకపోలేదు. అయితే తాజాగా కేవీపీ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ కు సన్నిహితుడైన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా సీఎం జగన్ పై విమర్శలు చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి హాజరైన కేవీపీ ఆ తర్వాత సీఎంను కలవలేదు. కానీ హైదరాబాద్ కేంద్రంగా వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా విజయమ్మ నిర్వహించిన సదస్సులో  కేవీుపీ పాల్గొన్నారు. ఏపీకి పీసీసీ చీఫ్, కొత్త కమిటీలను ఏర్పాటు చేసిన ఏఐసీసీ కేవీపీ రామచంద్రరావు కీలక బాధ్యతలు అప్పగించింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mamata Banerjee: ప్రశాంత్ కిషోర్ లేని ఐ ప్యాక్ పైనే మమతా బెనర్జీ ఆశలు - మరోసారి గెలిపిస్తారని నమ్మకంతోనే ఈడీని ఢీకొట్టారా?
ప్రశాంత్ కిషోర్ లేని ఐ ప్యాక్ పైనే మమతా బెనర్జీ ఆశలు - మరోసారి గెలిపిస్తారని నమ్మకంతోనే ఈడీని ఢీకొట్టారా?
Telangana Latest News: తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
Andhra Pradesh Weather Update: సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
KCR : మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం

వీడియోలు

Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam
WPL 2026 Mumbai Indians | ముంబై ఇండియన్స్ లో కీలక మార్పులు | ABP Desam
India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee: ప్రశాంత్ కిషోర్ లేని ఐ ప్యాక్ పైనే మమతా బెనర్జీ ఆశలు - మరోసారి గెలిపిస్తారని నమ్మకంతోనే ఈడీని ఢీకొట్టారా?
ప్రశాంత్ కిషోర్ లేని ఐ ప్యాక్ పైనే మమతా బెనర్జీ ఆశలు - మరోసారి గెలిపిస్తారని నమ్మకంతోనే ఈడీని ఢీకొట్టారా?
Telangana Latest News: తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
Andhra Pradesh Weather Update: సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
KCR : మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
The Raja Saab OTT : 'ది రాజా సాబ్' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్! - ఆ ఛానల్‌లో చూడొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
'ది రాజా సాబ్' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్! - ఆ ఛానల్‌లో చూడొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
Mobile Recharge Price : మొబైల్ వినియోగదారులకు బిగ్ షాక్! రీఛార్జ్ ప్లాన్‌ల ధరల్లో భారీ మార్పులు!, ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయంటే?
మొబైల్ వినియోగదారులకు బిగ్ షాక్! రీఛార్జ్ ప్లాన్‌ల ధరల్లో భారీ మార్పులు!, ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయంటే?
Ayyappa Deeksha Rules: అయ్యప్పమాల  ఎక్కడ  వేయించుకున్నారో అక్కడే తీయాలా? శబరిమలలో దీక్షా విరమణ చేయకూడదా?
అయ్యప్పమాల  ఎక్కడ  వేయించుకున్నారో అక్కడే తీయాలా? శబరిమలలో దీక్షా విరమణ చేయకూడదా?
Embed widget