అన్వేషించండి

Tirumala Vaikunta Ekadashi: 'వైకుంఠ'వాసుని నిలయంలో వైకుంఠ ఏకాదశి శోభ - గోవిందనామ స్మరణతో మార్మోగిన తిరుమల గిరులు

Tirumala News: తిరుమల గిరులు వైకుంఠ ఏకాదశి శోభను సంతరించుకున్నాయి. ఉదయం నుంచే ప్రముఖులు సహా సామాన్య భక్తులు శ్రీవారిని వైకుంఠ ద్వారం నుంచి దర్శించుకుంటున్నారు.

Vaikunta Ekadashi Celebrations In Tirumala Temple: వైకుంఠ ఏకాదశి (Vaikunta Ekadashi) సందర్భంగా తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వివిధ కైంకర్యాలు, అభిషేకాలు, సేవల అనంతరం ఉదయం 3.45 గంటల నుంచే అధికారులు స్వామి దర్శనానికి అనుమతించారు. ప్రోటోకాల్ ప్రముఖులకు అనుకున్న సమయానికి ముందే దర్శనం కల్పించారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచే పలువురు రాజకీయ, క్రీడా ప్రముఖులు సహా సామాన్య భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు. అటు, వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల ఆలయాన్ని విద్యుత్ దీపాలు, వివిధ రకాల పుష్పాలు, ఫలాలతో సుందరంగా అలంకరించారు. 

విద్యుత్ దీపాలంకరణలతో పాటు బెంగళూరు నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు ఆలయం, వైకుంఠ ద్వారం సహా అంతరాలయం, ఆలయం వెలుపల ప్రత్యేక పుష్పాలతో చేసిన అలంకరణలు ఇల వైకుంఠాన్ని తలపిస్తోంది. ఆలయం వెలుపల వివిధ రకాల పుష్పాలు, పండ్లతో ఏర్పాటు చేసిన వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ అలంకరణ భక్తులను ఆద్యంతం ఆకట్టుకుంటోంది. అటు, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి సందడి కనిపించింది. భక్తులు ఉదయం నుంచే వెంకటేశుని దర్శనానికి బారులు తీరారు.

స్వామిని దర్శించుకున్న ప్రముఖులు

 

కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కుటుంబంతో సహా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు వంగలపూడి అనిత, పార్థసారథి, సవిత, నిమ్మల రామానాయుడు, ఆధ్యాత్మిక గురువు రాందేవ్ బాబు, హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ ఆయన సతీమణి వసుంధర, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ తిరుమల శ్రీవారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు.

వారికి ప్రత్యేక దర్శనం

అటు, వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా తొక్కిసలాటలో గాయపడ్డ భక్తులకు సీఎం చంద్రబాబు, టీటీడీ ఛైర్మన్ ఆదేశాలతో అధికారులు శుక్రవారం ప్రత్యేక దర్శనం కల్పించారు. మొత్తం 52 మందికి ఉత్తర ద్వారం గుండా దర్శనం చేయించారు. కాగా, బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో భక్తులు గాయాలపాలయ్యారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు పరామర్శించారు. తీవ్రంగా గాయపడ్డ వారికి, స్వల్ప గాయాలైన వారికి పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు వీరికి భరోసా కల్పించారు. అధైర్య పడొద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రత్యేక దర్శనం చేయిస్తామని ప్రకటించి ఆ మేరకు అధికారులకు ఆదేశాలిచ్చారు.

Also Read:

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan meets Chandrababu : గ్రామ వికాసమే లక్ష్యం - చంద్రబాబు-పవన్ భేటీలో కీలక నిర్ణయాలు
గ్రామ వికాసమే లక్ష్యం - చంద్రబాబు-పవన్ భేటీలో కీలక నిర్ణయాలు
Pawan Kalyan Meets CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
Karumuri Nageswara Rao: కారుమూరి నాగేశ్వరరావుపై మరో కేసు నమోదు, సిట్ అధికారికే లంచం ఇచ్చే ప్రయత్నం!
కారుమూరి నాగేశ్వరరావుపై మరో కేసు నమోదు, సిట్ అధికారికే లంచం ఇచ్చే ప్రయత్నం!
Kesineni Chinni vs MLA Kolikapudi: కళ్యాణోత్సవంలో టీడీపీ ఎంపీకి షాక్.. ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు అనుచిత ప్ర‌వ‌ర్త‌న
కళ్యాణోత్సవంలో టీడీపీ ఎంపీకి షాక్.. ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు అనుచిత ప్ర‌వ‌ర్త‌న

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy : 99 రోజుల పాటు అలుపెరుగని పరుగే - కలెక్టర్లకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
99 రోజుల పాటు అలుపెరుగని పరుగే - కలెక్టర్లకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
Iran Israel War 2026:వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
CPM leader impeached: జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
Manchu Manoj Wedding Anniversary: మౌనికతో మనోజ్ వివాహ బంధానికి మూడేళ్లు... ఒక్కటిగా ముందడుగు, వరుస విజయాలు
మౌనికతో మనోజ్ వివాహ బంధానికి మూడేళ్లు... ఒక్కటిగా ముందడుగు, వరుస విజయాలు
Pawan Kalyan Meets CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
Renu Desai: సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
Tatkal Booking New Rules: రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
Jubilee Hills traffic: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభం - ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఇవిగో ప్రత్యామ్నాయ రూట్స్
కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభం - ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఇవిగో ప్రత్యామ్నాయ రూట్స్
Embed widget