By: ABP Desam | Updated at : 26 Nov 2021 04:12 PM (IST)
అమరావతి రైతులకు అపూర్వ స్వాగతం
ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలంటూ రైతులు చేస్తున్న పాదయాత్ర నెల్లూరు జిల్లాలో సాగుతోంది. అక్కడి ప్రజలు రైతులకు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. కోవూరుకు పాదయాత్ర చేరుకున్న సమయంలో అక్కడి ప్రజలు మహిళా రైతులకు చీర, సారె పెట్టి ఆత్మీయత చూపారు. కోవూరులోని మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహిళా రైతులకు స్థానికులు చీర, పసుపు, కుంకుమలు అందించారు. ఆలయంలో కోటి దీపోత్సవం సందర్భంగా మహిళా రైతులంతా దీపారాధనలు వెలిగించారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని అక్కడ మొక్కుకున్నారు.
Also Read : మూడు రాజధానుల చట్టాల్ని ఉపసంహరించుకున్నాం... హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్
న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర వానలకు వెరవక ముందుకు సాగుోతంది. నెల్లూరు జిల్లాలో అడుగడుగునా అమరావతి రైతులకు ఘన స్వాగతం పలుకుతున్నారు స్థానికులు. ఈ యాత్రలో మొదటినుంచీ టీడీపీ నేతలు పాల్గొని మద్దతు తెలుపుతున్నారు. అయితే యాత్రకు ప్రజాస్పందన ఎక్కువగా వస్తూండటంతో ఇతర పార్టీల నేతలు కూడా వచ్చి సంఘిభావం తెలియచేస్తున్నారు. దాదాపుగా అన్ని పార్టీల నేతలు వచ్చి సంఘిభావం తెలిపారు.
Also Read : జగన్పై పొగడ్తల విషయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరూ తగ్గలే ! మంత్రి పదవుల కోసమేనా ?
అమరావతి రైతుల పాదయాత్ర నెల్లూరు జిల్లాలో ప్రవేశించిన తర్వాత బీజేపీ, జనసేన నేతలు కూడా మద్దతుగా తరలి వచ్చారు. దీంతో రైతుల పాదయాత్ర సందడిగా సాగుతోంది. మల్లికార్జున స్వామి ఆలయంలో పూజల అనంతరం మహిళా రైతులు సారె తీసుకుని యాత్రలో పాల్గొన్నారు. రైతుల పాదయాత్ర నెల్లూరులో ప్రవేశించిన తర్వాతే ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించింది. అయితే రైతులు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని నమ్మలేదు. తమ పోరాటాన్ని సాగిస్తామని స్పష్టం చేశారు.
Also Read : సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందనే వెళ్లలేదు.. అందరికీ సాయం చేశాం.. అసెంబ్లీలో సీఎం జగన్ !
తిరుపతి వరకూ పాదయాత్ర చేసి శ్రీవారిని దర్శించుకున్న తర్వాతే తిరుగుపయనమవుతామని రైతులు చెబుతున్నారు. పాదయాత్రను..అమరావతి ఉద్యమాన్ని మహిళలే ముందుండి నడపుతున్నారు. పెద్ద వయసు రైతులు కూడా పాదయాత్రలో పాల్గొంటున్నారు. అమరావతి రైతులపై వైఎస్ఆర్సీపీ నేతలు ఎన్ని విమర్శలు చేసినా వారు ాత్రం తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు.
Also Read: రూ. వెయ్యి కోట్ల తక్షణ సాయం చేయండి.. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు సీఎం జగన్ లేఖ !
Who is BRSLP Leader : ప్రతిపక్ష నేతగా కేటీఆర్కే చాన్స్ - కేసీఆర్ అసలు అసెంబ్లీకి రావడం డౌటేనా !?
Petrol-Diesel Price 03 December 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Top Headlines Today: నేడు తెలంగాణ సీఎం పేరు ఖరారు; జంపింక్కు రెడీ అవుతున్న ఎమ్మెల్యేలు - నేటి టాప్ న్యూస్
Weather Latest Update: రేపు తీవ్ర తుపాను తీరం దాటే అవకాశం - ఏపీలో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు: ఐఎండీ వార్నింగ్
Cyclone Effect in Nellore: నెల్లూరులో భారీ వర్షాలు, చెరువులను తలపిస్తున్న రహదారులు
Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!
Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్కు పూనకాలే
/body>