అన్వేషించండి

Vande Bharat Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సికింద్రాబాద్ నుంచి విశాఖకు 2 వందే భారత్ రైళ్లు, పూర్తి వివరాలివే

Telangana News: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ నుంచి విశాఖకు మరో వందేభారత్ రైలు అందుబాటులోకి రానుంది. ఈ నెల 12న ప్రధాని మోదీ కొత్తగా 10 వందేభారత్ రైళ్లను వర్చువల్ గా ప్రారంభించనున్నారు.

Vande Bharat Trains From Secunderabad To Visakha: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ (Secunderabad) నుంచి విశాఖకు (Visakha) మరో వందే భారత్ రైలు నడపనుంది. అలాగే, భువనేశ్వర్ - విశాఖ - భువనేశ్వర్ కు సైతం ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నెల 12న ప్రధాని మోదీ ఈ రైళ్లను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్య నగరాలైన సికింద్రాబాద్, విశాఖకు ఇప్పటికే ఓ వందే భారత్ రైలు నడుస్తోంది. విశాఖ - సికింద్రాబాద్ - విశాఖ తొలి వందే భారత్ 2023, జనవరి 15న ప్రారంభమైంది. ఈ రైలు ఉదయం 5:45 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2:15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుని తిరిగి 3 గంటలకు బయలుదేరి రాత్రి 11:30 గంటలకు విశాఖ చేరుతుంది. ఈ ట్రైన్ కు ప్రయాణికుల నుంచి ఊహించని స్పందన వస్తోంది. వంద శాతం ఆక్యుపెన్సీతో రిజర్వేషన్ కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ రూట్ లో మరో రైలును నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం విశాఖ - సికింద్రాబాద్ - విశాఖ వందేభారత్ 16 బోగీలతో నడుస్తుండగా.. కొత్త రైలును 8 బోగీలతో మాత్రమే నడపనున్నారు. 

కొత్త వందే భారత్ టైమింగ్స్ 

ప్రయాణికుల రద్దీ, ఆక్యుపెన్సీ దృష్ట్యా సికింద్రాబాద్ నుంచి విశాఖకు మరో వందేభారత్ రైలుకు రైల్వే శాఖ ఆమోదం తెలపగా.. త్వరలోనే  ఈ రైలు పట్టాలెక్కనుంది. ట్రైన్ నెంబర్ 20707/20708 సికింద్రాబాద్ - విశాఖ - సికింద్రాబాద్ రైలు గురువారం తప్ప మిగతా అన్ని రోజులూ ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. ప్రతీ రోజూ ఉదయం 5:05 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1:50 గంటలకు విశాఖ చేరుకుంటుంది. తిరిగి విశాఖ నుంచి మధ్యాహ్నం 2:35 గంటలకు బయల్దేరి రాత్రి 11:20కి సికింద్రాబాద్ స్టేషన్ చేరుకుంటుంది. తెలంగాణలోని వరంగల్, ఖమ్మం.. ఏపీలోని విజయవాడ, రాజమహేంద్రవరం, సామర్లకోట స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.

పూరీ - విశాఖ - పూరీకి వందేభారత్

విశాఖ నుంచి పూరీకి వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. ఈ రైలు (20841/20842) సోమవారం మినహా మిగిలిన రోజులు నడవనుంది. ప్రతి రోజూ ఉదయం 5:15 గంటలకు పూరీలో బయలుదేరి ఉదయం 11:30 గంటలకు విశాఖ వస్తుంది. తిరిగి విశాఖ నుంచి మధ్యాహ్నం 3:40 గంటలకు బయలుదేరి రాత్రి 9:55 గంటలకు పూరీ చేరుకుంటుంది. ఈ రైలుకు 8 బోగీలు ఉంటాయి. 443 కిలో మీటర్ల దూరాన్ని సుమారు 5 గంటల్లోనే చేరుకుంటుంది. విశాఖ నుంచి సికింద్రాబాద్ మధ్య నడుస్తోన్న వందేభారత్ రైలులో ఉండే ఛార్జీలే దీనికి వర్తింపచేస్తారని వాల్తేరు రైల్వే అధికారులు తెలిపారు.

పూరీ నుంచి విశాఖకు వచ్చే వందేభారత్ రైలు ఖుర్దారోడ్ (ఉదయం 5:33 గంటలకు), బరంపూర్ (ఉదయం 7:05 గంటలకు), ఇచ్ఛాపురం (ఉదయం 7:18 గంటలకు), పలాస (ఉదయం 8:18 గంటలకు), శ్రీకాకుళం రోడ్ (ఉదయం 9:03 గంటలకు), విజయనగరం  (ఉదయం 09:48 గంటలకు)స్టేషన్లలో ఆగుతుంది. అలాగే, విశాఖ నుంచి పూరీ వెళ్లే వందేభారత్ రైలు విశాఖలో మధ్యాహ్నం 03:45 గంటలకు బయలుదేరి 4:30 గంటలకు విజయనగరం చేరుతుంది. సాయంత్రం 5:28 గంటలకు శ్రీకాకుళం రోడ్, 6:30 గంటలకు పలాస, రాత్రి 7 గంటలకు ఇచ్ఛాపురం, 7:20 గంటలకు బరంపూర్, రాత్రి 8:57 గంటలకు ఖుర్దారోడ్, రాత్రి 9:30 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుందని.. ప్రతీ స్టేషన్ లోనూ ఈ రైలు 2 నిమిషాలు ఆగుతుందని అధికారులు తెలిపారు.

Also Read: Daggubati Purandeswari: 'దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసమే పొత్తులు' - ఒకట్రెండు రోజుల్లో సీట్లపై స్పష్టత వస్తుందన్న పురంధేశ్వరి

టాప్ హెడ్ లైన్స్

Breaking News:ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ భేటీ- హాజరుకాని ఐదుగురు మంత్రులు
ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ భేటీ- హాజరుకాని ఐదుగురు మంత్రులు
Youtuber Ravan Case: రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!
రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!
Prashna Ravan: రావణ్‌తో సంబంధం లేదంటున్న వైసీపీ - ఇప్పటి వరకూ చేసిన సపోర్టు తూచ్ - ఎందుకు ఈ యూటర్న్?
రావణ్‌తో సంబంధం లేదంటున్న వైసీపీ - ఇప్పటి వరకూ చేసిన సపోర్టు తూచ్ - ఎందుకు ఈ యూటర్న్?
RS 20000 Subsidy For BCs: బీసీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..సోలార్ ప్యానల్ ఏర్పాటుపై 20వేల రాయితీ!
బీసీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..సోలార్ ప్యానల్ ఏర్పాటుపై 20వేల రాయితీ!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court On Fatima Owaisi College: ఫాతిమా ఒవైసీ కాలేజీ సల్కం చెరువు FTL పరిధిలో లేదన్న ప్రభుత్వం! హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
ఫాతిమా ఒవైసీ కాలేజీ సల్కం చెరువు FTL పరిధిలో లేదన్న ప్రభుత్వం! హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
Youtuber Ravan Case: రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!
రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!
Karur Stampede Case Update: కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
Akhil Akkineni : అప్పుడు అఖిల్... ఇప్పుడు సమంత - లెనిన్ బ్లాక్ బస్టర్ కావాలంటూ...
అప్పుడు అఖిల్... ఇప్పుడు సమంత - లెనిన్ బ్లాక్ బస్టర్ కావాలంటూ...
BCCI Series Defeat Review: ఇంగ్లాండ్ చేతిలో  టీ20 సిరీస్ ఘోర పరాజయంతో గంభీర్ కోచ్ పదవిపై బీసీసీఐ బిగ్ యాక్షన్ ప్లాన్, శ్రేయస్ కెప్టెన్సీ మార్పు వల్లే కొంపమునిగిందా!
ఇంగ్లాండ్ చేతిలో  టీ20 సిరీస్ ఘోర పరాజయంతో గంభీర్ కోచ్ పదవిపై బీసీసీఐ బిగ్ యాక్షన్ ప్లాన్, శ్రేయస్ కెప్టెన్సీ మార్పు వల్లే కొంపమునిగిందా!
ఇప్పటివరకు భారత్ NCAP క్రాష్ టెస్ట్‌కు వెళ్లిన 31 కార్లు - ఏవి 5 స్టార్, ఏవి 4 స్టార్ సాధించాయి?
భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఏయే కార్లకు 5 స్టార్ రేటింగ్? పూర్తి జాబితా ఇదే
Gen Z vs Millennials: మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 
మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 
TVK Govt Asks State Election Commissioner to Step Down: తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
Embed widget