అన్వేషించండి

Daggubati Purandeswari: 'దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసమే పొత్తులు' - ఒకట్రెండు రోజుల్లో సీట్లపై స్పష్టత వస్తుందన్న పురంధేశ్వరి

Andhra Politics: రాష్ట్రంలో టీడీపీ - జనసేనతో పొత్తు ఏర్పడడం సంతోషకరమని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఒకట్రెండు రోజుల్లో సీట్ల విషయంపై స్పష్టత వస్తుందని వెల్లడించారు.

AP Bjp Chief Purandeswari Response on Alliance: రాష్ట్రంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసమే పొత్తులని బీజేపీ (Bjp) రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి (Daggubati Purandeswari) అన్నారు. టీడీపీ - జనసేనతో పొత్తులపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. విజయవాడలో బీజేపీ ప్రచార రథాలను  ప్రారంభించిన సందర్భంగా ఆదివారం ఆమె పొత్తులపై స్పందించారు. టీడీపీ - జనసేన పార్టీలతో పొత్తు ఏర్పడడం సంతోషకరమని.. రాష్ట్రంలో అరాచక అంతానికి అందరూ కలవాలని ఆమె పిలుపునిచ్చారు. సీట్ల విషయంలో ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తలు పరిస్థితిని అర్థం చేసుకుంటారని ఆమె అభిప్రాయపడ్డారు.

ప్రచారానికి సిద్ధం

అటు, ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రచారంపై ఫోకస్ పెట్టాయి. టీడీపీ - జనసేన సంయుక్తంగా ఇటీవల సభ ఏర్పాటు చేయగా భారీ స్పందన వచ్చింది. అటు, అధికార వైసీపీ సైతం 'సిద్ధం' పేరుతో సభలు నిర్వహిస్తూ ప్రచారంలో దూసుకెళ్తోంది. మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సైతం ప్రచారం ముమ్మరం చేశారు. నిన్నటి వరకూ 'రా.. కదలిరా' పేరుతో చంద్రబాబు సభలు నిర్వహించగా.. శంఖారావం పేరిట నారా లోకేశ్ ప్రజలతో మమేకమయ్యారు. కొద్ది రోజుల్లో 'ప్రజాగళం' పేరుతో చంద్రబాబు మలివిడత ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ సైతం ప్రచారంలో దూసుకెళ్లేందుకు ప్రణాళిక రచించింది. ఇందుకోసం బీజేపీ ప్రచార రథాలను పురంధేశ్వరి ఆదివారం ప్రారంభించారు. మరోవైపు, మేనిఫెస్టో రూపకల్పన కోసం అభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రజలు ఏం ఆశిస్తున్నారనే అంశంపై ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం 9 జిల్లాలకు మేనిఫెస్టో రథాలను పంపనుంది. 

సుదీర్ఘ చర్చలు.. పొత్తుపై క్లారిటీ 

ఢిల్లీలో రెండు విడతలుగా చంద్రబాబు, పవన్ బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారు. పొత్తుల అంశంపై శనివారం స్పష్టత వచ్చింది. టీడీపీ 17 పార్లమెంట్ స్థానాల్లో, బీజేపీ 6 స్థానాల్లో, జనసేన 2 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనున్నాయి. జనసేనకు కాకినాడ, మచిలీపట్నం లోక్‌సభ స్థానాలు ఫిక్స్ చేశారు. రాజంపేట, ఏలూరు, అనకాపల్లి, రాజమండ్రి, అరకు, హిందూపురం నియోజకవర్గాలను బీజేపీకి కేటాయించారు. మిగిలిన నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు బరిలో నిలవనున్నారు. ఏపీ అసెంబ్లీ స్థానాల్లోనూ లెక్క కుదిరింది. టీడీపీ 145 స్థానాల్లో పోటీ చేయనుండగా.. బీజేపీ, జనసేనకు కలిసి 30 నియోజకవర్గాలు కేటాయించారు. ఇందులో ఇరవై నాలుగు స్థానాల్లో  జనసేన, 6 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది. అయితే త్వరలోనే అభ్యర్థుల రెండో జాబితాపై భేటీ కానున్నారు.

జగన్ రాష్ట్రాన్ని దివాళా తీయించారని, ఆర్థిక లోటును భర్తీ చేసుకోవడానికి కేంద్రం సహకారం అవసరమని నేతలకు చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. పొత్తులో భాగంగా కొందరికి సీట్లు రాకపోతే నిరుత్సాహపడొద్దని, పొత్తు అవసరాన్ని నేతలకు వివరించాలని పార్టీ ముఖ్య నేతలకు దిశా నిర్దేశం చేశారు. సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చిందని... త్వరలోనే మరోసారి భేటీ అయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. 

ఉమ్మడి బహిరంగ సభకు ప్రధాని మోదీ?

టీడీపీ, జనసేన ఈనెల 17న చిలకలూరిపేటలో ఉమ్మడి బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. టీడీపీ - జనసేన - బీజేపీతో పొత్తు కుదరడంతో మూడు పార్టీలు కలిసి ఈ సభను నిర్వహించనున్నాయి. ఈ సభకు ప్రధాని మోదీ హాజరు కానున్నారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ 17న ప్రధాని మోదీ బిజీ షెడ్యూల్ ఉంటే, 18కి బహిరంగ సభ వాయిదా వేస్తారని వినిపిస్తోంది. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, మరోసారి ఎన్డీఏలోకి టీడీపీ చేరిన తరువాత నిర్వహిస్తున్న సభ కావడంతో భారీగా ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు. 

Also Read: AP Politics: బీజేపీతో ఎందుకు విడిపోయారు? ఎందుకు కలిశారు? కూటమి నేతలు ప్రజల్ని ఎలా ఒప్పిస్తారు?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

DK Shivakumar Swearing In Ceremony:యంగ్ టీంతో సిద్ధమవుతున్న కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్! జట్టులో నలుగురు డిప్యూటీ సీఎంలు!
యంగ్ టీంతో సిద్ధమవుతున్న కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్! జట్టులో నలుగురు డిప్యూటీ సీఎంలు!
DK Shivakumar Karnataka CM Challenges:కర్ణాటక సీఎంగా ప్రమాణం చేయనున్న డీకే శివకుమార్‌కు సవాళ్ల స్వాగతం! ట్రబుల్ షూటర్ వాటిని ఎలా పరిష్కరిస్తారు?
కర్ణాటక సీఎంగా ప్రమాణం చేయనున్న డీకే శివకుమార్‌కు సవాళ్ల స్వాగతం! ట్రబుల్ షూటర్ వాటిని ఎలా పరిష్కరిస్తారు?
Regional Sentiment politics: తెలంగాణలో మళ్లీ ప్రాంతీయ మంట - పవన్, చంద్రబాబులే టార్గెట్.. వ్యూహం ఎవరిది? ప్రజా స్పందన ఎలా ఉంది?
తెలంగాణలో మళ్లీ ప్రాంతీయ మంట - పవన్, చంద్రబాబులే టార్గెట్.. వ్యూహం ఎవరిది? ప్రజా స్పందన ఎలా ఉంది?
YS Jagan PA KNR raids news 2026: లిక్కర్ స్కాం ఉచ్చులో జగన్ పీఏ కేఎన్ఆర్ - వందల కోట్ల ఆస్తులని ప్రచారం - అసలు టార్గెట్ మాజీ సీఎం ?
లిక్కర్ స్కాం ఉచ్చులో జగన్ పీఏ కేఎన్ఆర్ - వందల కోట్ల ఆస్తులని ప్రచారం - అసలు టార్గెట్ మాజీ సీఎం ?

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Abhishek Banerjee Attack: బెంగాల్‌లో ట్రీట్మెంట్ అందడం లేదు.. అవసరమైతే అభిషేక్ బెనర్జీని హైదరాబాద్‌కు తరలిస్తాం: మమతా బెనర్జీ
బెంగాల్‌లో ట్రీట్మెంట్ అందడం లేదు.. అవసరమైతే అభిషేక్ బెనర్జీని హైదరాబాద్‌కు తరలింపు: మమతా బెనర్జీ
Karnataka New CM DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
e- Shram Card 2026: అసంఘటిత రంగాల్లోని కార్మికులకు రూ.2 లక్షల బీమా.. ఇ-శ్రమ్ కార్డు ప్రయోజనాలు, దరఖాస్తు విధానం
అసంఘటిత రంగాల్లోని కార్మికులకు రూ.2 లక్షల బీమా.. ఇ-శ్రమ్ కార్డు ప్రయోజనాలు, దరఖాస్తు విధానం
Drinker Sai OTT: ట్రెండింగ్‌లో 'డ్రింకర్ సాయి'... ఓటీటీలో ధర్మ మహేష్ సినిమా ఫ్రీ ఫ్రీ ఫ్రీ... రెస్పాన్స్ సూపర్
ట్రెండింగ్‌లో 'డ్రింకర్ సాయి'... ఓటీటీలో ధర్మ మహేష్ సినిమా ఫ్రీ ఫ్రీ ఫ్రీ... రెస్పాన్స్ సూపర్
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
CM Vijay Condoles Ajith: అజిత్ ఇంటికి సీఎం విజయ్... వెంట త్రిష కూడా... ఆప్త మిత్రుడికి పరామర్శ
అజిత్ ఇంటికి సీఎం విజయ్... వెంట త్రిష కూడా... ఆప్త మిత్రుడికి పరామర్శ
IPL Best Ever Opening Pair: టోర్నీ హిస్టరీలోనే గిల్, సాయి సుదర్శన్ బెస్ట్ ఓపెనింగ్ జోడీ..  ఫైనల్స్ లో వాళ్ల‌కే ఛాన్స్ ఎక్కువ.. మాజీ క్రికెట‌ర్ అనాల‌సిస్
టోర్నీ హిస్టరీలోనే గిల్, సాయి సుదర్శన్ బెస్ట్ ఓపెనింగ్ జోడీ..  ఫైనల్స్ లో వాళ్ల‌కే ఛాన్స్ ఎక్కువ..
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Embed widget