అన్వేషించండి

Tirumala Temple: తిరుమలలో నేటి నుంచి సర్వదర్శనం టికెట్లు.. భారీగా పోటెత్తిన భక్తులు..

తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రారంభమైంది. సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు తరలివచ్చారు. టోకెన్లు జారీ చేసే శ్రీనివాసం వద్ద ఫుట్‌పాత్‌పై శ్రీవారి భక్తులు బారులుతీరారు.

తిరుమలలో భక్తులు పోటెత్తారు. సర్వదర్శనం టోకెన్ల సంఖ్య పెంచుతూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వేలాది మంది శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. సర్వదర్శనం టోకెన్లు జారీ చేసే శ్రీనివాసం వద్ద ఫుట్‌పాత్‌పై భక్తులు బారులుతీరారు. తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రారంభమైంది. ఆధార్ కార్డు ఆధారంగా అన్ని ప్రాంతాల వారికి టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. సర్వదర్శనం టికెట్ల ఆన్‌‌లైన్‌ ద్వారా విడుదల చేసేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లను చేసింది. టికెట్ల జారీ కోసం తితిదే వెబ్‌సైట్‌లో ప్రత్యేక పోర్టల్‌ను తీసుకొచ్చింది. కరెంట్‌ బుకింగ్‌ ద్వారానే ఇప్పటివరకు ఉచిత టోకెన్లను విడుదల చేసింది. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో భక్తులు గుమికూడే పరిస్థితి రానివ్వకుండా ఉండేందుకు ఆన్​‌లైన్‌ విధానాన్ని తీసుకువస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. త్వరలో ఆన్‌లైన్‌ ద్వారా టికెట్ల జారీ ప్రక్రియ మొదలు పెడతామని, దీనికి సంబంధించి సాంకేతికంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

రోజుకు 8 వేల టోకెన్ల జారీ 
కోవిడ్ తీవ్రత కారణంగా ఏడాదిన్నర కాలంగా శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రక్రియను టీటీడీ నిలిపివేసింది. కోవిడ్ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టడంతో సెప్టెంబరు 8 నుంచి టోకెన్ల జారీ ప్రక్రియను ప్రారంభించింది. అయితే ఇది కేవలం చిత్తూరు జిల్లాకు చెందిన ప్రజలకు మాత్రమే ప్రయోగాత్మకంగా నిర్వహించింది. తిరుపతిలోని శ్రీనివాసం వసతి సముదాయం వద్ద టోకెన్లు జారీచేస్తున్నట్లు వెల్లడించింది. ఇక ఇటీవల సర్వదర్శనం టోకెట్లను ఇతర ప్రాంతాల వారికి సైతం జారీ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను పెంచుతూ ఇటీవల కీలక ప్రకటన విడుదల చేసింది. రోజుకు 8 వేల టోకెన్లను జారీ చేయనున్నట్లు ప్రకటనలో తెలిపింది. సర్వదర్శనం టోకెన్ల సంఖ్య పెంపుతో పాటుగా దర్శన సమయాన్ని కూడా పెంచినట్లు పేర్కొంది. 

కోవిడ్ నిబంధనలు తప్పనిసరి.. 
కోవిడ్ అనంతరం తిరుమలలో పరిస్థితులు మారాయి. ప్రతి భక్తుడు కోవిడ్ నిబంధనలను పాటించాల్సిందేనని టీటీడీ స్పష్టం చేసింది. భక్తులు భౌతిక దూరం పాటించడంతో, మాస్కులు ధరించాలని తెలిపింది. శ్రీవారి దర్శనానికి పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తోంది. కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో టీటీడీ పరిమిత సంఖ్యలో భక్తులను కొండపైకి అనుమతించింది. ఇక సెకండ్ వేవ్ తీవ్రమవుతోన్న నేపథ్యంలో సర్వదర్శనాల్ని పూర్తిగా నిలిపివేసినట్లు ప్రకటించింది. ప్రత్యేక దర్శనం ద్వారా (రూ.300 టికెట్‌) పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తోంది. ప్రస్తుతం కోవిడ్ తీవ్రత తగ్గడం.. సాధారణ పరిస్థితులు నెలకొనడంతో సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తోంది. 

శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు.. 
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ‌ విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉమాదేవి.. అపోలో పౌండేషన్, అపోలో లైఫ్ వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కొణిదెలలు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP DSC Notification 2025: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
Narne Hydra: జూ.ఎన్టీఆర్ మామకు షాక్ -నార్నె భూముల  స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్
జూ.ఎన్టీఆర్ మామకు షాక్ -నార్నె భూముల స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్
SC Sub-Classification: ఎస్సీ వర్గీకరణ అమలుకు సవరణ నోటిఫికేషన్‌ జారీ, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు
ఎస్సీ వర్గీకరణ అమలుకు సవరణ నోటిఫికేషన్‌ జారీ, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు
Indraganti Mohan Krishna: నాలుగైదు రోజులు 'సారంగపాణి' గురించి మాట్లాడుకుంటారు - ప్రతీ రోల్ కొత్తగానే ఉంటుందన్న దర్శకుడు ఇంద్రగంటి
నాలుగైదు రోజులు 'సారంగపాణి' గురించి మాట్లాడుకుంటారు - ప్రతీ రోల్ కొత్తగానే ఉంటుందన్న దర్శకుడు ఇంద్రగంటి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Avesh Khan Game Changer vs RR | IPL 2025 లో లక్నోకు గేమ్ ఛేంజర్ గా మారిన ఆవేశ్ ఖాన్ | ABP DesamYashasvi Jaiswal Vaibhav Suryavanshi | భలే క్యూట్ గా ఆడిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు | ABP DesmRR vs LSG Match Highlights IPL 2025 | రాజస్థాన్ రాయల్స్ పై 2పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ విజయం | ABP DesamVaibhav Suryavanshi Batting vs LSG | IPL 2025 తో అరంగేట్రం చేసిన 14ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్య వంశీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2025: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
Narne Hydra: జూ.ఎన్టీఆర్ మామకు షాక్ -నార్నె భూముల  స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్
జూ.ఎన్టీఆర్ మామకు షాక్ -నార్నె భూముల స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్
SC Sub-Classification: ఎస్సీ వర్గీకరణ అమలుకు సవరణ నోటిఫికేషన్‌ జారీ, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు
ఎస్సీ వర్గీకరణ అమలుకు సవరణ నోటిఫికేషన్‌ జారీ, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు
Indraganti Mohan Krishna: నాలుగైదు రోజులు 'సారంగపాణి' గురించి మాట్లాడుకుంటారు - ప్రతీ రోల్ కొత్తగానే ఉంటుందన్న దర్శకుడు ఇంద్రగంటి
నాలుగైదు రోజులు 'సారంగపాణి' గురించి మాట్లాడుకుంటారు - ప్రతీ రోల్ కొత్తగానే ఉంటుందన్న దర్శకుడు ఇంద్రగంటి
Chandra Babu Naidu Birth Day: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆస్తులు ఎన్ని? రిచెస్ట్‌ సీఎం ఎలా అయ్యారు?
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆస్తులు ఎన్ని? రిచెస్ట్‌ సీఎం ఎలా అయ్యారు?
యేసు క్రీస్తుపై చేసిన నేరారోపణలు ఏంటో తెలుసా!
యేసు క్రీస్తుపై చేసిన నేరారోపణలు ఏంటో తెలుసా!
Easter 2025 : ఈస్టర్ గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలివే, ఈస్టర్ ఎగ్ స్పెషల్ ఇదే.. ఏ దేశాల్లో ఎలా జరుపుకుంటారంటే
ఈస్టర్ గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలివే, ఈస్టర్ ఎగ్ స్పెషల్ ఇదే.. ఏ దేశాల్లో ఎలా జరుపుకుంటారంటే
IPL 2025 LSG VS RR Result Updates: లక్నో థ్రిల్లింగ్ విక్టరీ.. టోర్నీలో ఐదో విజయం.. అవేశ్ సూపర్ బౌలింగ్..  జైస్వాల్ స్టన్నింగ్ ఫిఫ్టీ వృథా
లక్నో థ్రిల్లింగ్ విక్టరీ.. టోర్నీలో ఐదో విజయం.. అవేశ్ సూపర్ బౌలింగ్.. జైస్వాల్ స్టన్నింగ్ ఫిఫ్టీ వృథా
Embed widget