అన్వేషించండి

Tirupati Laddu Row: తిరుమలకు వచ్చిన నెయ్యిలో ఏం పరీక్షిస్తారు? ఇప్పుడు కొత్తగా టీటీడీ తీసుకున్న కీలక నిర్ణయం ఏంటీ?

TTD News: లడ్డూలో కల్తీ నెయ్యిని వాడారన్న ఆరోపణలు రావడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో వినియోగించే అన్ని సరకులను క్షణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత ఉపయోగించాలని నిర్ణయించింది.

Tirumala news: కలియుగ ప్రత్యక్ష దైవంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కొలుస్తారు భక్తులు. ఇలాంటి తిరుమల శ్రీవారి ఆలయంలో తయారు చేసే లడ్డూ ప్రసాదం పై అనేక ఆరోపణలు, చర్చలు నడిచాయి. దీని కారణంగా శ్రీవారి ఆలయంలో శాంతి హోమం నిర్వహించారు. మిగిలిన టీటీడీ ఆలయాల పరిస్థితి ఏమిటి అనేది ప్రశ్న. తిరుమల శ్రీవారి ఆలయంలో తయారు చేసే లడ్డూతో పాటు వివిధ ప్రసాదాలకు ఆ నెయ్యిని వినియోగించరని అన్నారు. మరీ పవిత్రోత్సవాల కారణంగా అది శుద్ది అయ్యింది. ఇతర ఆలయాల్లో వినియోగించిన వాటికి టీటీడీ ఏమి చేయనుంది. ఈ వివాదం తర్వాత టీటీడీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. 

తిరుమలకు వచ్చిన నెయ్యిలో ఏం పరీక్షలు చేస్తారు?
కాంట్రాక్టర్లు ద్వారా తిరుమలకు వచ్చే నెయ్యి తొలుత తిరుపతిలోని మార్కెటింగ్ గొడౌన్‌కు వస్తుంది. ఇక్కడ మూడు శాంపిల్స్ తీస్తారు. పలు రకాల పరీక్షలు అంటే నెయ్యిలో తేమ ఎంత ఉంది, మీటర్ రీడింగ్, ఆర్ ఎం విలువ, మినరల్స్, అదనపు రంగు, మిల్క్ ఫ్యాట్ తదితర ప్రాథమిక అంశాలను పరిశీలించి టీటీడీ నిబంధనల మేరకు అన్ని ఉన్నాయా లేదా పరిశీలించి ఆ తర్వాత తిరుమలకు పంపుతారు. తిరుమలలో కూడా వీటిని పరీక్షలు చేసిన తర్వాత నెయ్యిని వినియోగిస్తారు. 

కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ
తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే అన్ని అన్నప్రసాదాలలో వినియోగించే సరకులను పరీక్షలు చేయడానికి టీటీడీ చర్యలు తీసుకుంది. ఇప్పుడు జరిగిన తప్పిదాలు తిరిగి పునరావృతం కాకుండా ఉండాలని ల్యాబ్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. 

తిరుమలలో NDDB CALF ల్యాబ్
ప్రస్తుతం అమలు చేస్తున్న NDDB CALF ల్యాబ్‌కు ప్రతి నెయ్యి ట్యాంక్‌లోని నమూనాలను పంపి పరీక్షలు వివరాలు వచ్చిన తరువాత వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారు. వారే తిరుమలలో ల్యాబ్ ఏర్పాటుకు ముందుకు రావడంతో రూ.75 లక్షలతో అడల్ట్రేషన్ ల్యాబ్ డిసెంబర్ లేదా జనవరిలోపు పూర్తి చేయనున్నారు. 

తిరుమలలో సెంట్రల్ FSSI ల్యాబ్
18 మందితో కూడిన సెన్సరీ ల్యాబ్ ఏర్పాటు చేసి CFTRI మైసూరు వారి నుంచి శిక్షణ పొందుతున్నారు. వీరు నెయ్యిలో రంగు, రుచి, వాసన, స్వచ్చత రేటింగ్ ఇస్తారు. 0 నుంచి 9.5 వరకు రేటింగ్ ఉండగా కనీసం 7 ఉంటేనే దానిని వినియోగిస్తారు. సెంట్రల్ FSSI వాళ్లు సైతం త్వరలో ల్యాబ్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు. ఇప్పటికే ప్లేస్‌ను చూశారు. త్వరలో అది కూడా అందుబాటులోకి రానుంది.

పరీక్షలు నిరంతరం జరిగే కార్యక్రమం.. అయితే ఈ ల్యాబ్‌లలో పని చేయడానికి పరికరాలు కాని.. సిబ్బంది కాని పూర్తి స్థాయిలో లేకపోవడంతో భక్తులకు.. గోవిందుడికి ఈ పరీక్ష వచ్చింది. అందుకే ఆ సమస్య లేకుండా చర్యలకు ఉపక్రమించింది టీటీడీ. అయితే తిరుమలకు వచ్చే నెయ్యి వేసి తిరుమలలోపాటు తిరుచానూరుకు సైతం అదే నెయ్యిని వినియోగిస్తారు.

తిరుమలలో జులై నెలలో జరిగిన అపచారాన్ని ఆగస్టు నెలలో జరిగిన పవిత్రోత్సవాలతో దోషం తొలగిందని టీటీడీ అధికారులు.. అర్చకులు తెలియజేశారు. అదే నెయ్యిని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కూడా వినియోగించారు. అక్కడ కూడా ఈనెల 16 నుంచి మూడు రోజుల పాటు 18 వ తేదీ వరకు పవిత్రోత్సవాలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. 

శ్రవణ దోషంగా చెప్పే లడ్డూ ప్రసాదం వివాదంలో తిరుమలలో నిర్వహిస్తున్న రీతిన తిరుచానూరులో కూడా శాంతి హోమం నిర్వహిస్తారా లేదా అనేది టీటీడీ అధికారులు స్పష్టం చేయలేదు. భక్తులు అయితే తిరుమల తరహా తిరుచానూరులో కూడా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా శాంతి హోమం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget