అన్వేషించండి

TTD News: తిరుమలలో భక్తుల రద్దీని అంచనా వేశాం, అన్ని చర్యలూ తీసుకున్నాం: ఈవో

భక్తులకు అల్పాహారం, భోజనం..చిన్నారులకు పాలు అందిస్తున్నామన్నారు. సామాన్యులకు శ్రీవారి దర్శనాన్ని దూరం కానివ్వబోమని ధర్మారెడ్డి చెప్పారు. బుధవారం ధర్మారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.

Tirumala Tirupati Devastanam: తిరుమల తిరుపతి దేవస్థానంలో (టీటీడీ) భక్తుల రద్దీ, తోపులాటపై ఈవో ధర్మారెడ్డి స్పందించారు. భక్తుల కోసం తాము అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. ఏర్పాట్లు చేయలేదనే వాదన నిజం కాదని కొట్టిపారేశారు. భక్తులు భారీగా వస్తారని ముందుగానే ఊహించామని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నామని అన్నారు. భక్తుల తాకిడి పెరగడంతో టోకెన్‌ లేకుండా అనుమతించామని అన్నారు. భక్తులకు అల్పాహారం, భోజనం..చిన్నారులకు పాలు అందిస్తున్నామన్నారు. సామాన్యులకు శ్రీవారి దర్శనాన్ని దూరం కానివ్వబోమని ధర్మారెడ్డి చెప్పారు. బుధవారం ధర్మారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవమని అన్నారు. మేం ముందస్తు ప్లానింగ్‌తో లేకపోతే భక్తులను సరిగ్గా ఎలా మేనేజ్ చేయగలిగామని చెప్పారు. తిరుమలలో గత వారాంతంలో మూడు రోజులకు గానూ ముందే టికెట్లను 9వ తేదీన ఇచ్చేశామని చెప్పారు. తర్వాత సర్వదర్శన టోకెన్లు తీసుకున్న వాళ్లు, తీసుకొనే వాళ్ల వల్ల రద్దీ బాగా పెరిగిందని ధర్మారెడ్డి అన్నారు. 9, 10, 11 తేదీల్లో రద్దీ తీవ్రం అయిపోయిందని చెప్పారు. దాంతో 12న టోకెన్ల జారీ కౌంటర్లను మూసేశామని అన్నారు. టోకెన్లు లేకపోయినా భక్తులు పోటెత్తారని అన్నారు. నిన్న మళ్లీ టోకెన్లు జారీ చేసే సమయంలో 20 వేల మంది మాత్రమే ఉన్నారని, భక్తుల ఆత్రుత కారణంగా క్యూ లైన్లలో ఇబ్బందులు తలెత్తాయని పేర్కొన్నారు.

వెంటనే సర్వదర్శనం టోకెన్లను రద్దు చేసి, భక్తులను అనుమతించామని అన్నారు. ముందస్తు ప్రణాళికతో ఉన్నందువల్లే ఇబ్బంది తలెత్తినప్పుడు అరగంటలోనే భక్తులును కంపార్టుమెంట్లలోకి అనుమతించామని వెల్లడించారు. ఇప్పటి పరిస్థితుల్లో భక్తులు కంపార్ట్ మెంట్లలోనే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. 

శ్రీవారిని లక్ష మంది దర్శనం చేసుకొనే వెసులుబాటు ఉన్నప్పటికీ కరోనా కారణంగా తొలుత 3 వేల మందికే దర్శన అవకాశం కల్పించినట్లుగా ఈవో చెప్పారు. క్రమంగా ఆ సంఖ్యను 6 వేలు, 10 వేలు, 15 వేల నుంచి 45 వేల వరకూ భక్తులను అనుమతించినట్లుగా వెల్లడించారు. గతంలో సర్వదర్శన టోకెన్లు ఇచ్చిన ప్రతిసారి ఈ సమస్యలు వస్తూనే ఉన్నాయని గుర్తు చేశారు. నిన్న (ఏప్రిల్ 12) జరిగిన ఘటనల్లాంటివి గతంలో జరిగినట్లు చెప్పారు. తాము ఏ చర్యలు చేపట్టినా, ధర్నాలు చేపట్టడం పరిపాటి అయిపోయిందని, ప్రతి నిర్ణయానికి ఏదో ఒక సమస్య వస్తోందని ఈవో చెప్పారు. కరోనా సమయంలో సర్వ దర్శన టోకెన్లు భౌతికంగా ఇస్తే సమస్యలు ఉన్నాయని ఆన్ లైన్ చేశామని అన్నారు. ఆన్ లైన్ చేస్తే గ్రామీణ ప్రాంతాల భక్తులు, కంప్యూటర్ తెలీని వారికి అందుబాటులోకి రావడం లేదని విమర్శలు వచ్చాయని గుర్తు చేశారు.

టాప్ హెడ్ లైన్స్

తిరుమల యాత్రలో వారాహి అమ్మవారి దర్శనం: కోరికలు తీర్చే శ్రీశక్తిపీఠం రహస్యం!
తిరుమల యాత్రలో వారాహి అమ్మవారి దర్శనం: కోరికలు తీర్చే శ్రీశక్తిపీఠం రహస్యం!
Tirumala Sarva Darshan Re Entry Facility: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
Breaking News: ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: మంత్రి మాట నమ్మి రైతులు మోసపోయారు, మీకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు: హరీష్ రావు
మంత్రి మాట నమ్మి రైతులు మోసపోయారు, మీకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు: హరీష్ రావు
Indians Died In Russia Attack: ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
Kohli Magic Advice: సింధు గ్రాండ్ కంబ్యాక్ వెనుక కోహ్లీ మైండ్ బ్లాకింగ్ అడ్వైస్.. జపాన్ ఓపెన్ గోల్డ్ విక్టరీ సీక్రెట్ బయటపెట్టిన తెలుగు స్టార్!
సింధు గ్రాండ్ కంబ్యాక్ వెనుక కోహ్లీ మైండ్ బ్లాకింగ్ అడ్వైస్.. జపాన్ ఓపెన్ గోల్డ్ విక్టరీ సీక్రెట్ బయటపెట్టిన తెలుగు స్టార్!
Messi Retirement Speculation: మెస్సి రిటైర్మెంట్ పై కోచ్ స్కలోని అనౌన్స్ మెంట్.. అప్ప‌టివ‌ర‌కు ఆడ‌తాడ‌ని జోస్యం 
మెస్సి రిటైర్మెంట్ పై కోచ్ స్కలోని అనౌన్స్ మెంట్.. అప్ప‌టివ‌ర‌కు ఆడ‌తాడ‌ని జోస్యం 
భారత్‌లో అమ్మకానికి వచ్చిన ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ బైక్‌లు ఇవిగో - ఎథనాల్ మిశ్రమంపై ఇక ఆందోళన అక్కర్లేదు!
ఎథనాల్ టెన్షన్‌ను తగ్గించే E85 బైక్‌లు - E20 నుంచి E85 వరకు ఏ పెట్రోల్‌ అయినా వీటిలో వాడొచ్చు!
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
Pradeep Machiraju ETV Show: మళ్ళీ ఈటీవీకి మాచిరాజు... రష్మీని రీప్లేస్ చేసిన ప్రదీప్ - మరి సుధీర్ సంగతేంటి?
మళ్ళీ ఈటీవీకి మాచిరాజు... రష్మీని రీప్లేస్ చేసిన ప్రదీప్ - మరి సుధీర్ సంగతేంటి?
Embed widget