అన్వేషించండి

TTD News: శ్రీవాణి ట్రస్టుపై దుష్ప్రచారం తగదు, అన్ని టోకెన్లు పారదర్శకంగానే - టీటీడీ ఈవో వెల్లడి

శ్రీవాణి ట్రస్ట్ ద్వారా విరాళాలు అందించిన భక్తులు ఇప్పటి వరకు ఒక ఫిర్యాదు కూడా చేయలేదని ఈవో వివరించారు.

శ్రీవాణి ట్రస్టుపై వస్తున్న దుష్ప్రచారాన్ని భక్తులు నమ్మొద్దని టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి కోరారు. ఆదివారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో 23 మంది భక్తుల సలహాలు, సూచనలకు, ప్రశ్నలకు టీటీడీ ఈవో సమాధానం చెప్పారు. అనంతరం టీటీడీ ఈఓ ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ. ఇప్పటి వరకు శ్రీవాణి ట్రస్ట్ కు 880 కోట్లు విరాళాలు అందాయని, 9 లక్షల మంది భక్తులు శ్రీవాణి ట్రస్ట్ కి విరాళాల ఇచ్చి శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకున్నట్లు టీటీడీ ఈవో వెల్లడించారు. ఇప్పటి వరకు 2500 ఆలయాలను నిర్మాణం చేపట్టినట్టు చెప్పారు.

శ్రీవాణి ట్రస్ట్ ద్వారా విరాళాలు అందించిన భక్తులు ఇప్పటి వరకు ఒక ఫిర్యాదు కూడా చేయలేదని ఆయన వివరించారు. అయితే శ్రీవాణి ట్రస్ట్ ఆలయ నిర్మాణాలు కొంతమంది కాంట్రాక్టర్లకు మాత్రమే ఇస్తున్నామని అసంబద్ధమైన ఆరోపణలు చేయడం సరైన విధానం కాదని టీటీడీ ఈవో అన్నారు. ఆలయ నిర్మాణాలు నాలుగు విధానాల్లో నిర్వహిస్తున్నామని, అందులో మొదటిది దేవదాయ శాఖ, రెండవది టీటీడీ, మూడవది ఆలయ కమిటీలు, నాలుగవది స్థానిక స్వచ్ఛంద సంస్థల ద్వారా మాత్రమే ఆలయ నిర్మాణాలను చేస్తున్నామన్నారు. ఇక పార్వేటి మండలం శిథిలావస్థకు చేరుకోవడంతోనే జీర్ణోద్ధరణ పనులు చేస్తున్నామని ఆయన చెప్పారు.  

డయల్ యువర్ కార్యక్రమంలో శ్రీవారి ఆలయంలో భక్తుల తోపులాట జరుగుతోందని తెలిపారని, అయితే శ్రీవారి ఆలయంలో భక్తుల మధ్య తోపులాట లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. మహా ద్వారం నుండి బంగారు వాకిలి వరకు సింగల్ లైన్ లో భక్తులను అనుమతిస్తున్నామన్నారు. ఇక వికలాంగులను, సీనియర్ సిటిజెన్స్ లను కలిపి కాకుండా సపరేట్ గా పంపుతామన్నారు. లగేజ్ కలెక్షన్స్, డెలివరీ సిస్టంలో నూతన విధానాన్ని ప్రవేశపెడతామని ఆయన చెప్పారు.  

శ్రీవాణి ట్రస్ట్ దర్శనాల విషయంలో పారదర్శకంగానే టోకెన్ల కేటాయింపు చేస్తున్నామని, 9 లక్షల మంది శ్రీవాణి ట్రస్టు ద్వారా భక్తులు దర్శనం చేసుకున్నారని, పార్వేటి మండపం జీర్నోద్దారణపై వివాదం సరైనది కాదని అన్నారు. కుంగిపోయే పరిస్థితిలో ఉంటే పునరుద్ధరణ పనులు చేపట్టామని, సమ్మర్ తో సంబంధం లేకుండా తిరుమలకు భక్తులు వస్తున్నారని, అన్నారు. వేసవి నేపథ్యంలో గతంలో ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటా తగ్గించామని, ఇక ఆగస్టు, సెప్టెంబర్ నెలలో తిరిగి 15 వేల ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లను ఆన్లైన్లో విడుదల చేస్తామని అన్నారు. శ్రీవారి ఆలయంలో పంచ బేరాలను పరిరక్షించడమే మొదటి ప్రాధాన్యం అని ఆగమ పండితులు సలహాలు ఇచ్చారని, పంచ బేరాల్లో ఏదైనా విగ్రహాలు భిన్నమైతే తిరిగి వాటిని కరిగించి విగ్రహాలుగా మల్చాలని సూచించారని చెప్పారు.  

అందులో భాగంగానే ఉత్సవ విగ్రహాలను పరిరక్షించాలని అర్చకులు, జీయ్యంగార్లు, ఆగమ పండితులు సూచించడంతో నిత్యం నిర్వహించే అభిషేక సేవను రద్దు చేశామన్నారు. ఇక జూన్ మాసంలో 23 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని, హుండీ ద్వారా 116.14 కోట్ల ఆదాయం లభించిందని అన్నారు. ఇక జూన్ మాసానికి సంబంధించి కోటి ఆరు లక్షల లడ్డూలను భక్తులకు విక్రయించడం జరిగిందని, 10.80 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, 24.38 లక్షల మంది భక్తులు తిరుమలలో అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Hyderabad Crime News మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
First GBS Death in AP: ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
WPL Result Update: గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.