By: ABP Desam | Updated at : 02 May 2022 11:27 AM (IST)
బాలుడ్ని కిడ్నాప్ చేస్తున్న మహిళ
Five Years Old Boy Kidnaps In Tirumala: ఏడు కొండలపై మరోమారు ఐదేళ్ళ బాలుడు కిడ్నాప్ కావడం కలకలం రేపుతోంది. తిరుపతి ధామినేడుకు కొత్త ఇండ్లు చెందిన వెంకటరమణ, స్వాతి దంపతుల ఐదేళ్ళ కుమారుడు గోవర్థన్ అలియస్ చింటూ నిన్న (ఆదివారం) సాయంత్రం శ్రీవారి ఆలయం ముందు కిడ్నాప్ కు గురి అయ్యాడు.. కిడ్నాప్ కు గురైన బాలుడు తండ్రి వెంకటరమణ తిరుమలలోని ఓ హోటల్ పని చేస్తుండగా, బాలుడు తల్లి స్వాతి భక్తులకు నామాలు పెట్టుకుని వచ్చిన డబ్బులతో జీవనం సాగించేవారు.
ఈ క్రమంలో నిన్న సాయంత్రం 5:45 సమయంలో బాలుడు తల్లి ఆలయం ముందు భక్తులకు నామాలు పెడుతూ ఉండగా, బాలుడు ఆలయం ముందు కూర్చుకుని ఉండగా గుర్తు తెలియని మహిళ బాలుడుని కిడ్నాప్ చేసింది.. బాలుడు కనిపించక పోయే సరికి స్వాతి విషయంను భర్తకు తెలియజేసి తిరుమలలో గాలించారు.. కానీ, బాలుడు కనిపించక పోయే సరికి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీటీవీ కెమెరాల ఆధారంగా బాలుడిని మహిళ కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.. అయితే, బాలుడిని అపహరించిన మహిళ నిన్న సాయంత్రం 6:15 సమయంలో తిరుమలలోని రాంభగీచ బస్టాండ్ లో తిరుమల నుండి తిరుపతికి వెళ్ళేందుకు ఏపీ 03 జడ్ 0300 నెంబరు గల ఆర్టీసీ బస్సు ఎక్కి రాత్రి 7:16 నిమిషాలకు తిరుపతికి చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ కెమెరా దృశ్యాల ఆధారంగా మహిళను గుర్తించేందుకు పోలీసుల బృందాలు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
#TirumalaBoyKidnap తిరుమలలో ఐదేళ్ల బాలుడు కిడ్నాప్ కలకలం, ఎత్తుకుపోయిన మహిళ - కెమెరాల్లో రికార్డు#Tirumala #TTD #Kidnaphttps://t.co/LqO88nAm3x
— ABP Desam (@ABPDesam) May 2, 2022
శ్రీవారి సేవలో శ్రీలంక ఉత్తర ప్రావిన్స్ గవర్నర్
తిరుమల శ్రీవారిని శ్రీలంక ఉత్తర ప్రావిన్స్ గవర్నర్ జీవన్ త్యాగరాజా దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని ఆశీస్సులు పొందారు.. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. అనంతరం గవర్నర్ జీవన్ త్యాగరాజ మాట్లాడుతూ.. స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.. ప్రస్తుతం శ్రీలంకలో నెలకొన్న పరిస్థితులు చక్కదిద్దుకోవాలని దేశ ప్రజలకు శాంతిని ప్రసాదించాలని స్వామి వారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు.
TTD Special Darshanam Tickets: వయోవృద్ధులు, దివ్యాంగులకు టీటీడీ గుడ్న్యూస్ - ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల
TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త, ఆగస్టు దర్శన టికెట్లు విడుదల - మధ్యాహ్నం మరిన్ని సేవల కోటా టికెట్లు ఆన్లైన్లో
Tirupati: పీకలదాకా తాగి పోలీసులు వీరంగం, భయపడి 100కి కాల్ చేసిన స్థానికుడు - తరువాత ఏం జరిగిందంటే !
AP Govt Employees: రేపు ప్రభుత్వ ఉద్యోగులతో కీలక భేటీ - సీపీఎస్ వివాదం ఇకనైనా తేల్చుతారా, కాలయాపన చేస్తారా !
Bus Accident: బెంగళూరు-హైదరాబాద్ హైవేపై ప్రమాదం, ప్రైవేటు బస్సు - లారీ ఢీ
PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే
World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?
Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి
Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు