![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Heavy Rush at Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - నిన్న ఒక్కరోజులో హుండీ కలెక్షన్ ఎంతంటే !
Tirumala News Today: వీకెండ్ కావడంతో ఏడుకొండలకు భక్తులు పోటెత్తారు. తిరుమలలో నిన్న ఒక్కరోజు 72,196 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. హుండీకి భారీగా కానుకలు వచ్చాయి.
![Heavy Rush at Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - నిన్న ఒక్కరోజులో హుండీ కలెక్షన్ ఎంతంటే ! Tirumala: Heavy Rush at Tirumala Tirupati Devasthanam on 16 July 2022 DNN Heavy Rush at Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - నిన్న ఒక్కరోజులో హుండీ కలెక్షన్ ఎంతంటే !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/16/12c410e1ed32cc91a17899ab84a609311657938940_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Tirumala Tirupati Devasthanam: తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వారాంతాలు కావడంతో ఏడుకొండలకు భక్తులు పోటెత్తారు. సప్తగిరీసుడు, శేషాద్రి నిలయుడైన శ్రీనివాసుడి దివ్యధామంలో తిరుమల పుణ్యక్షేత్రం గోవింద నామ స్మరణలతో మారుమోగుతుంది. నిన్న 15-07-2022 రోజున 72,196 మంది స్వామి వారి దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 35,967 మంది తలనీలాలు సమర్పించగా, 4.24 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. అయితే సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండడంతో బయట క్యూలైన్స్ లో భక్తులు వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు దాదాపు మూడు గంటల సమయం పడుతుంది.
ఎన్నో మార్గాలలో తిరుమలకు భక్తులు..
శ్రీనివాసుడి దర్శనం కోసం తిరుమల యాత్రకు విచ్చేసే భక్తులు అలిపిరి నడక మార్గం, శ్రీవారి నడక మార్గం, తిరుమల ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసి తిరుమల పుణ్యక్షేత్రంకు చేరుకోవచ్చు.. ఇలా తిరుమలకు వచ్చిన భక్తులు ముందుగా సిఆర్వో కార్యాలయం వద్ద వసతి గదులు పొంది, స్వామి వారికి తలనీలాలు సమర్పించి స్వామి వారి దర్శన భాగ్యం పొందే అవకాశం కల్పిస్తోంది టిటిడి.. ఇక యాత్రికుల సౌఖర్యార్ధం తిరుమలలో ప్రధాన ప్రాంతాల్లో పుడ్ కౌంటర్లతో పాటుగా ,మాతృశ్రీ వెంగమాంబ అన్నదాన సత్రంలో ఉదయం ఏడు గంటల నుండి రాత్రి 11 గంటల వరకూ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తోంది టిటిడి.. అదే విధంగా భక్తులకు కోరినన్ని లడ్డూలను భక్తులకు టిటిడి అందిస్తోంది.. ఇక తిరుమల యాత్రతో పాటుగా వివిధ యాత్ర ప్రదేశాలు భక్తులు సందర్శించేందుకు బస్సు సౌఖర్యం కల్పించింది టిటిడి.. తిరుమలలో అధిక రద్దీ కారణంగా భక్తులు ఒపికగా స్వామి వారి దర్శనం చేసుకోవాలని టిటిడి విజ్ఞప్తి చేస్తుంది..
శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు.. శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన రోజుగా పిలువబడుతుంది.. ఈ క్రమంలో ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు.. వైఖానస అర్చకులు, సన్నిధి గొల్లలు, జియ్యంగార్లు స్వామి వారి సన్నిధిలోకి ప్రవేశించి స్వామి వారి తొలి దర్శనం చేసుకుంటారు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు.. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వరుని సుప్రభాతం స్తోత్రం, ప్రవర్తి, మంగళ శాసనం వంటివి పటిస్తూ ఉండగా సన్నిధిలో వైఖానస అర్చకుల ప్రత్యూష కాలరాతనలో భాగంగా శ్రీవారికి మొదటి నివేదనగా పచ్చి పాలను నివేదిస్తారు అర్చకులు.. ముందు రోజు రాత్రి పావళింపు సేవలో బంగారు నవారు మంచంపై సేవించి ఉన్న శ్రీవారి కౌతుక బేరం శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారికి వారిని మూలవిరాట్ పాదాల వద్ద ఉంచి సింహాసనంపై జీవ స్థానంలో వేయించేపు చేస్తారు.. అనంతరం ఏకాంతంగా శ్రీవారికి కర్పూర నిరాజనం సమర్పణ జరుపుతారు అర్చకులు.. దీనినే కైకర్యపరుల హారతిని కూడా పిలుస్తారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)