అన్వేషించండి

Tirupati: మాపై ఏ విచారణ అయినా చేసుకోండి, సీఐడీకి భువనేశ్వరి సవాల్

నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా తిరుపతిలో నిర్వహించిన మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొన్నారు. 

ఆంధ్రా సీఐడీ బెదిరింపులకు భయపడేది లేదని.. వారికి సవాల్ విసురుతున్నానని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తేల్చి చెప్పారు. తమపై ఎలాంటి విచారణ అయినా చేసుకోవాలని సీఐడీకి సవాలు విసిరారు. తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబును 48 రోజులుగా జైల్లో ఉంచుతున్నారని ఆవేదన చెందారు. అయినా చంద్రబాబు చాలా ధైర్యంగా ఉన్నారని, ములాఖత్‌కు వెళ్లినప్పుడు కూడా ఆయన ధైర్యం కోల్పోలేదని అన్నారు. ప్రజల నుంచి చంద్రబాబును ఎవరూ దూరం చేయలేరని అన్నారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా తిరుపతిలో నిర్వహించిన మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొన్నారు. 

చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో ప్రజలంతా రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ఎప్పుడూ కుటుంబ సమేతంగా తిరుమల వెళ్లే వాళ్లం. నిన్న మాత్రం ఒంటరిగా తిరుమలకు వెళ్లాల్సి వచ్చింది. చంద్రబాబు అరెస్టుతో మా కుటుంబసభ్యులం మొత్తం నాలుగు దిక్కులుగా విడిపోయాం’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు టీడీపీ కార్యకర్తల డబ్బులతో బతకాల్సిన అవసరం లేదని అన్నారు. క్రమశిక్షణగా ఉండడం.. క్రమశిక్షణ నేర్పించడం చంద్రబాబుకు తెలుసని అన్నారు.

‘‘రాజమండ్రి జైలుకు ములాఖత్ వెళ్ళినప్పుడు చంద్రబాబు ధైర్యంతో ఉన్నారు. ఎప్పుడు ములాఖత్ కు వెళ్లినా టీడీపీ కార్యకర్తలు ఎలా ఉన్నారని అడుగుతున్నారు. త్వరలోనే నారా లోకేష్ పాదయాత్ర తిరిగి ప్రారంభం అవుతుంది. ఎన్నికలు దగ్గర పడుతుండడంతోనే చంద్రబాబును అక్రమ అరెస్ట్ చేయించారు. ఎన్నికలు సమీపిస్తున్నాయి.. మీ ఓటును ఆలోచించి వేయండి. నాకు ఇంకా పౌరుషం ఉంది.. వైసీపీని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. చంద్రబాబు నాయుడు చేసి‌న సాయాన్ని మహిళలు మరిచి‌పోలేదు. అందుకే చంద్రబాబు కోసం‌ మహిళలు రోడ్డుపైకి‌వచ్చారు.

పనికిరాని వాటిపై ఎంక్వైరీ ఏంటి? - భువనేశ్వరి
దసరా పండుగ సందర్భంగా చంద్రబాబు లేఖ రాస్తే దానిపై ఎంక్వైరీ చేస్తారా? అభివృద్ధి చేయాలనే అలోచన ప్రభుత్వానికి ఉండాలే‌ గానీ పనికి రాని వాటిపై ఎంక్వైరీ ఏంటీ? రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన వైసీపీకి లేదు. జీవితంలో‌ ఇలాంటి‌ అడ్డంకులు వస్తాయని ఏనాడు అనుకోలేదు. న్యాయం‌ జరుగుతుందనే కుటుంబం అంతా కలిసి‌ కట్టుగా ఉన్నాం. జైలులో ఉన్న చంద్రబాబుకు కనీస సౌకర్యాలు కల్పించలేని స్థితిలో‌ వైసీపీ ఉంది. భోజనం‌ కూడా‌ సరైనది పెట్టకుండా వైసీపీ ప్రభుత్వం చేస్తుంది. నాకు ఎంత‌ బాధ ఉన్నా, ధైర్యంగా సమస్యను ఎదుర్కొంటాను. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. చంద్రబాబును ఎవరూ ముట్టుకోలేరు’’ అని నారా భువనేశ్వరి మాట్లాడారు.

చంద్రబాబు రాజకీయ జీవితం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ నుంచే ప్రారంభమైంది. ఆయన సూచనలతోనే చనిపోయిన వారి బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్నాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ గొప్పతనం ఏంటంటే.. అరెస్టులు, కేసులతో వేధించడం మాత్రమే. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఒకటో స్థానంలో ఉంది. దేశానికి స్వాతంత్ర్యం కోసం ఆనాడు మహాత్మా గాంధీ పోరాటం చేస్తే మనమిప్పుడు వైఎస్ఆర్ సీపీ నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాటం చేయాల్సి వస్తుంది. మనం చేసే పోరాటం భవిష్యత్తు కోసమే. టీడీపీ కార్యకర్తల్ని భయపెట్టడానికి అక్రమ కేసులు పెడుతున్నారు. ఎవరూ భయపడకండి.. అందరం కలిసికట్టుగా పోరాడదాం’’ అని నారా భువనేశ్వరి మాట్లాడారు.

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
YSRCP Assembly March: అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget