అన్వేషించండి

జగన్‌ను మార్వెల్ క్యారెక్టర్‌తో పోల్చిన పవన్ - దేశం, రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం కావాలన్న జనసేనాని

పీఆర్పీ విలీనం సమయంలో తనకు ఎన్నో బెదిరింపులు వచ్చాయి పార్టీలో చేరమని కూడా ఒత్తిడి తీసుకొచ్చారన్నారు. తాను రాజకీయాల్లోకి కొత్త కావచ్చు కానీ... మనుషుల మనస్తత్వాలకు కొత్తకానన్నారు పవన్.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు జనసేనాని పవన్ కల్యాణ్. తనను దత్తపుత్రుడు అని సంబోధిస్తున్న జగన్ మోహన్‌ను ఇవాల్టి నుంచి తాను ఆంధ్రప్రదేశ్‌ థానోస్‌ అంటూ నామకరణం చేశారు. మార్వెల్‌లోని క్యారెక్టర్‌తో పోల్చారు పవన్. వైసీపీ థానోస్‌ నవరత్నాలు అంటూ అందర్నీ చంపేస్తున్నారని ఆరోపించారు. 

తిరుపతి జనవాణిలో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌... జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాయలసీమ చదువుల సీమని కానీ దీన్ని  ఫ్యాక్షన్ సీమగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నో గ్రంథాలయాలకు నెలవు రాయలసీమని తెలియజేశారు. అలాంటి గడ్డపై మాట్లాడటం చాలా ఆనందంగా ఉందన్నారు పవన్ కల్యాణ్.

వైసీపీ నేతలు డబ్బు ఉందని అహంకారంతో విర్రవీగితే మడిచి ఎక్కడైనా పెట్టుకోండని ఘాటుగా కామెంట్‌ చేశారు. ఓ సామజిక వర్గాన్ని  గంపగుత్తగా అమ్మేస్తున్నామని విమర్శిస్తున్నారని... తాను ఎవరికీ కొమ్ముకాయడం లేదన్నారు పవన్. రాష్ట్రం, దేశంలో మూడో ప్రత్యామ్నాయం చాలా అవసరం ఉందన్నారు. వైసీపీ కోవర్ట్‌ల వల్లే అప్పట్లో పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేయాల్సి వచ్చిందన్నారు పవన్ కల్యాణ్. ఆనాడు చిరంజీవిపై ఒత్తిడి తీసుకొచ్చి పార్టీ విలీనం చేయించారని ఆరోపించారు.  

తాను మాత్రం ప్రజల తరఫున గట్టిగా నిలబడేందుకే వచ్చానన్నారు పవన్. రాజకీయంలో మార్పు వచ్చే వరకూ ఉంటానన్నారు. రాజకీయంలో మార్పు వస్తే పోతానన్నారు. పీఆర్పీ విలీనం సమయంలో తనకు ఎన్నో బెదిరింపులు వచ్చాయి పార్టీలో చేరమని కూడా ఒత్తిడి తీసుకొచ్చారన్నారు. తాను రాజకీయాల్లోకి కొత్త కావచ్చు కానీ... మనుషుల మనస్తత్వాలకు కొత్తకానన్నారు పవన్. 

బిజెపితో పొత్తు వల్లే 2014 ఎన్నికల్లో టీడీపీకి సపోర్ట్ చేశామని తెలియజేశారు పవన్ కల్యాణ్. పిలువు ఇవ్వడం కాదు, తమ ఆతిథ్యం తీసుకోమని చంద్రబాబుతో చెప్పానని వివరించారు. కంస్ట్రక్టివ్ పాలిటిక్స్ అంటే తనకు ఇష్టమని.. డిస్ట్రక్టివ్‌ పాలిటిక్స్ చేయబోనన్నారు పవన్. కుప్పంలో జనసేనను ఇబ్బంది పెడుతుంటే అక్కడ ప్రతిపక్షాలను కలుపుకొని వెళ్ళామని గుర్తు చేశారు. 

ఎంత పెద్ద స్టేటస్ వ్యక్తి అయినా ఇంటి ముందు నడుచుకుంటూ వచ్చే సంప్రదాయం వైసీపీ తీసుకొచ్చిందని ఎద్దేవా చేశారు. ఇంకోసారి వైసీపీ అధికారంలోకి వస్తే జపాన్‌లో మద్యం పోటీలు పెట్టినట్లు పెడుతారన్నారు. వైసీపీని ఓడించడమే తమ ప్రథమ అజెండా అని గుర్తు చేశారు పవన్ కల్యాణ్. పార్టీలోకి రావాలంటే ముందుగా జనసేన కార్యకర్తలను గౌరవించాలని నేతలకు సూచించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kendriya Vidyalayas to Andhra Pradesh : శ్రీకాకుళం, చిత్తూరు ప్రజలకు గుడ్ న్యూస్ -ఏపీకి నాలుగు కేంద్రీయ విద్యాలయాలు కేటాయించిన కేంద్రం - కృతజ్ఞత చెప్పిన లోకేష్
శ్రీకాకుళం, చిత్తూరు ప్రజలకు గుడ్ న్యూస్ -ఏపీకి నాలుగు కేంద్రీయ విద్యాలయాలు కేటాయించిన కేంద్రం - కృతజ్ఞత చెప్పిన లోకేష్
Medigadda Barrage Restoration:కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక నిర్ణయం- మేడిగడ్డ పునరుద్ధరణపై సర్కార్ ఫోకస్! టెండర్లు వేయడానికి 15 వరకు గడువు
కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక నిర్ణయం- మేడిగడ్డ పునరుద్ధరణపై సర్కార్ ఫోకస్! టెండర్లు వేయడానికి 15 వరకు గడువు
Andhra Pradesh Accident: పల్నాడులో దారుణ ఘటన: స్కూటర్‌ను ఢీకొట్టి  3 కి.మీ. లాక్కెళ్లిన బోలెరో - వైరల్ వీడియో
పల్నాడులో దారుణ ఘటన: స్కూటర్‌ను ఢీకొట్టి 3 కి.మీ. లాక్కెళ్లిన బోలెరో - వైరల్ వీడియో
Cough syrup death case: అలర్ట్ -ఈ దగ్గుమందు పొరపాటున కూడా మీ పిల్లలకు ఇవ్వొద్దు - బ్యాన్ చేశారు!
అలర్ట్ -ఈ దగ్గుమందు పొరపాటున కూడా మీ పిల్లలకు ఇవ్వొద్దు - బ్యాన్ చేశారు!
Advertisement

వీడియోలు

Dhanush Idly Kottu Movie Review In Telugu | ధనుష్, నిత్య మీనన్ ఇడ్లీ కొట్టు ఎలా ఉందంటే.? | ABP Desam
BCCI vs PCB | Asia Cup 2025 | ఆసియా కప్ ట్రోఫీపై ముదురుతున్న వివాదం
India vs Sri Lanka Women World Cup | శ్రీలంకపై భారత్ విజయం
Asia Cup 2025 Ind vs Pak Controversy | ఆసియాక‌ప్ కాంట్రవర్సీపై మాజీ క్రికెట‌ర్ ఆవేద‌న‌
Women World Cup 2025 | Smriti Mandhana | ట్రోల్స్ ఎదుర్కొంటున్న స్మృతి మంధాన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kendriya Vidyalayas to Andhra Pradesh : శ్రీకాకుళం, చిత్తూరు ప్రజలకు గుడ్ న్యూస్ -ఏపీకి నాలుగు కేంద్రీయ విద్యాలయాలు కేటాయించిన కేంద్రం - కృతజ్ఞత చెప్పిన లోకేష్
శ్రీకాకుళం, చిత్తూరు ప్రజలకు గుడ్ న్యూస్ -ఏపీకి నాలుగు కేంద్రీయ విద్యాలయాలు కేటాయించిన కేంద్రం - కృతజ్ఞత చెప్పిన లోకేష్
Medigadda Barrage Restoration:కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక నిర్ణయం- మేడిగడ్డ పునరుద్ధరణపై సర్కార్ ఫోకస్! టెండర్లు వేయడానికి 15 వరకు గడువు
కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక నిర్ణయం- మేడిగడ్డ పునరుద్ధరణపై సర్కార్ ఫోకస్! టెండర్లు వేయడానికి 15 వరకు గడువు
Andhra Pradesh Accident: పల్నాడులో దారుణ ఘటన: స్కూటర్‌ను ఢీకొట్టి  3 కి.మీ. లాక్కెళ్లిన బోలెరో - వైరల్ వీడియో
పల్నాడులో దారుణ ఘటన: స్కూటర్‌ను ఢీకొట్టి 3 కి.మీ. లాక్కెళ్లిన బోలెరో - వైరల్ వీడియో
Cough syrup death case: అలర్ట్ -ఈ దగ్గుమందు పొరపాటున కూడా మీ పిల్లలకు ఇవ్వొద్దు - బ్యాన్ చేశారు!
అలర్ట్ -ఈ దగ్గుమందు పొరపాటున కూడా మీ పిల్లలకు ఇవ్వొద్దు - బ్యాన్ చేశారు!
Hurun Rich List 2025: ఇండియన్ కుబేరా ఎవరు? అంబానీనా లేదా అదానీనా? హురున్ ధనవంతుల జాబితా 2025 ఏం చెప్పింది?
ఇండియన్ కుబేరా ఎవరు? అంబానీనా లేదా అదానీనా? హురున్ ధనవంతుల జాబితా 2025 ఏం చెప్పింది?
Dhanush Idly Kottu Movie Review In Telugu | ధనుష్, నిత్య మీనన్ ఇడ్లీ కొట్టు ఎలా ఉందంటే.? | ABP Desam
Dhanush Idly Kottu Movie Review In Telugu | ధనుష్, నిత్య మీనన్ ఇడ్లీ కొట్టు ఎలా ఉందంటే.? | ABP Desam
YS Jagan: చంద్రబాబూ చరిత్ర హీనుడిగా మిలిగిపోతావు - వైఎస్ జగన్ సంచలన ట్వీట్
చంద్రబాబూ చరిత్ర హీనుడిగా మిలిగిపోతావు - వైఎస్ జగన్ సంచలన ట్వీట్
Chandrababu in Datti: సంక్షేమంలో ఏపీ నెంబర్ వన్  - 63 లక్షల మందికి పెన్షన్లు - విజయనగరం జిల్లా పేదల సేవలో చంద్రబాబు
సంక్షేమంలో ఏపీ నెంబర్ వన్ - 63 లక్షల మందికి పెన్షన్లు - విజయనగరం జిల్లా పేదల సేవలో చంద్రబాబు
Embed widget