By: ABP Desam | Updated at : 29 Nov 2021 10:00 AM (IST)
డాలర్ శేషాద్రి మరణంపై వైవీ సుబ్బారెడ్డి సంతాపం
శ్రీపాల శేషాద్రి (డాలర్ శేషాద్రి) స్వామి మరణం టీటీడీకి తీరని లోటు అని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. నేటి ఉదయం గుండెపోటు రావడంతో డాలర్ శేషాద్రి కన్నుమూశారు. ఆయన హఠాన్మరణంపై టీటీడీ చైర్మన్ స్పందించారు. ‘తిరుమల శ్రీవారి సేవలో 1978 నుంచి తరిస్తున్న వ్యక్తి డాలర్ శేషాద్రి. వైజాగ్లో ఈ రోజు టీటీడీ నిర్వహించనున్న కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి శేషాద్రి స్వామి వెళ్లారు. శ్రీవారి సేవే ఊపిరిగా జీవితంలో చివరి క్షణం వరకు ఆయన సేవలు అందించారు.
డాలర్ శేషాద్రి జీవితమంతా స్వామివారి సేవలో తరించి ధన్య జీవి అయ్యారు. అందరితో ప్రేమగా, ఆలయ కార్యక్రమాల్లో అధికారులు, అర్చకులకు పెద్ద దిక్కుగా పని చేశారు. ఆయన మరణ వార్త తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని శ్రీవారిని ప్రార్థిస్తున్నానంటూ వైవీ సుబ్బారెడ్డి సంతాపం తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి మరణంపై ప్రముఖులు స్పందిస్తున్నారు. డాలర్ శేషాద్రి సతీమణి చంద్రను తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పరామర్శించారు. శేషాద్రి స్వామి మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.
Also Read: తిరుమల శ్రీవారి ఆలయం ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూత
తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి గారి మరణం టీటీడీ కి తీరని లోటు, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ శ్రీనివాసుడు శేషాద్రి గారి కుటుంబానికి ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని కోరుకుంటున్నా.#dollarseshadri #ttd #Tirumala pic.twitter.com/vEPJUjYxzD
— Vamsi Krishna Yadav (@Vamsi_YSR) November 29, 2021
కార్తీక దిపోత్సవంలో పాల్గొనేందుకు ఆయన విశాఖపట్నం వెళ్లారు. అక్కడ ఒక్కసారిగా ఛాతీలో నొప్పి రావడంతో డాలర్ శేషాద్రిని విశాఖలోని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా మార్గంమధ్యలోనే తుదిశ్వాస విడిచారని అధికారులు తెలిపారు. డాలర్ శేషాద్రి 1978లో తిరుమల శ్రీవారికి సేవలు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో 2006లో ఆయన రిటైర్ అయ్యారు. ఆయన సేవలు తప్పనిసరి అని ఓఎస్టీగా టీటీడీ ఆయనకు బాధ్యతలు అప్పగించింది. చివరి క్షణం వరకు శ్రీవారిలో సేవలో ఉంటూ తరించారని టీటీడీ పేర్కొంది.
Andhra Pradesh CM YS Jagan Mohan Reddy expresses grief over the passing away of Tirumala Tirupathi Devasthaaam's OSD P Seshadri, popularly known as #DollarSeshadri. CM conveys his condolences to the bereaved family members of Seshadri.
— All India Radio News (@airnewsalerts) November 29, 2021
Also Read: AP Governor: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ కు మరోసారి అస్వస్థత... హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తరలింపు
Nara Lokesh Padayatra: నారా లోకేష్ యువగళం 5వ రోజు పాదయాత్ర షెడ్యూల్
Amar Raja Fire Accident: చిత్తూరులోని అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు
Breaking News Live Telugu Updates: అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
MLA Kethireddy: ఆధిపత్యం కోసం జేసీ బ్రదర్స్ హత్యలు చేయించారు: ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలనం
JC Prabhakar Reddy : రేయ్ పోలీస్ మీపై నమ్మకం పోయింది, జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Minister KTR Tour : రేపు కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ టూర్, ప్రతిపక్ష పార్టీల నేతల అరెస్టులు!
Vizag Steel Plant: ఆ ప్రధానుల మెడలు వంచి విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం: మంత్రి అమర్నాథ్
Dasara: ఒక ఆర్ఆర్ఆర్, ఒక కేజీయఫ్, ఒక దసరా - టీజర్ లాంచ్లో నాని ఏమన్నాడంటే?
TSPSC Group4 Application: 'గ్రూప్-4' ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?