By: ABP Desam | Updated at : 29 Nov 2021 10:01 AM (IST)
డాలర్ శేషాద్రి కన్నుమూత (Photo Credit: Twitter)
తిరుమల శ్రీవారి ఆలయం ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూశారు. గుండెపోటు రావడంతో సోమవారం ఉదయం డాలర్ శేషాద్రి కన్నుమూశారని సమాచారం. కార్తీక దిపోత్సవంలో పాల్గొనేందుకు ఆయన విశాఖపట్నం వెళ్లారు. అక్కడ ఒక్కసారిగా ఛాతీలో నొప్పి రావడంతో ఆయన విశాఖలోని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా మార్గంమధ్యలోనే డాలర్ శేషాద్రి తుదిశ్వాస విడిచారని అధికారులు తెలిపారు. శేషాద్రికి భార్య చంద్ర, ఇద్దరు అన్నలు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు.
డాలర్ శేషాద్రి 1978 నుంచి శ్రీవారికి సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో 2007లో ఆయన రిటైర్ అయ్యారు. కానీ, ఆయన సేవలు తప్పనిసరి కావడంతో ఓఎస్టీగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆయనకు బాధ్యతలు అప్పగించింది. డాలర్ శేషాద్రి ఆకస్మిక మరణం పట్ల టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం టీటీడీకి తీరని లోటు అని పేర్కొన్నారు. జీవితంలో చివరి క్షణం వరకు శ్రీవారి సేవలోనే ఉన్నారు డాల్లర్ శేషాద్రి.
Also Read: AP Governor: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ కు మరోసారి అస్వస్థత... హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తరలింపు
శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం.. విశాఖలో సోమవారం వేకువజామున గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపే మృతి.. కార్తీక దీపోత్సవంలో పాల్గొనేందుకు విశాఖ వెళ్లిన డాలర్ శేషాద్రి#dollarseshadri #Vizag #tirumala
— # Suryam....🙏🙏🙏 (@singavarapu1971) November 29, 2021
మూడేళ్ల కిందట తీవ్ర అస్వస్థత.. గతంలో గుండెపోటు!
తిరుమల ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి మూడేళ్ల కిందట తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహన సేవ నిర్వహించిన ఆయనకు క్రతువులో అధిక సమయం గడపడంతో అస్వస్థతకు గురయ్యారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ఆయన కొన్ని రోజులకు ఆరోగ్యంగా డిశ్ఛార్జ్ అయ్యారు. గతంలోనూ డాలర్ శేషాద్రికి గుండెపోటు వచ్చింది. దాదాపు నెల రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన తరువాత కోలుకున్నారు. తాజాగా మరోసారి గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయిన ఆయన తుదిశ్వాస విడిచారు.
Dollar Seshadri has left to heavenly abode..May Srivaru take care of his soul.🙏🙏🙏🙏🙏 pic.twitter.com/WyvQjys2zb
— SHIVA REDDY ADVOCATE (@shivare46619067) November 29, 2021
Also Read: Tirumala: శ్రీవారి సర్వ దర్శనం టిక్కెట్లు విడుదల.. రోజుకు పది వేల చొప్పున కేటాయించిన టీటీడీ
AP Capital issue : ఏపీ రాజధాని అంశాన్ని సీఎం జగన్ మళ్లీ ఎందుకు కదిలించారు ? కోర్టులో ఉన్న అంశంపై రిస్క్ తీసుకున్నారా ?
Kotamreddy vs Balineni: నా ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు చూపిస్తా, కాచుకో బాలినేనీ!: ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలనం
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని
Payyavula On CM jagan : రాజధానిపై ప్రకటన కోర్టు ధిక్కారమే - సీఎం జగన్పై టీడీపీ నేత పయ్యావుల ఫైర్ !
Breaking News Live Telugu Updates: తెలంగాణలో జూన్ 5 నుంచి గ్రూప్ 1 మెయిన్స్
Dhanbad Fire Accident: జార్ఖండ్లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం
Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీ, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్గా భారతి హోళికేరి
Nizamabad: నందిపేట్ సర్పంచ్ ఆత్మహత్యాయత్నంతో రచ్చ కెక్కుతున్న నిధుల పంచాయితీ !