![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
CPI Narayana: జగన్ను తక్షణమే అరెస్టు చేయాలి - సీపీఐ నారాయణ డిమాండ్
AP News: ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే జగన్ అవినీతిపై మాట్లాడారని.. జగన్ అవినీతి, అక్రమాలపై మాట్లాడిన మోదీ వెంటనే జగన్ ను అరెస్టు చేయించాలని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు.
![CPI Narayana: జగన్ను తక్షణమే అరెస్టు చేయాలి - సీపీఐ నారాయణ డిమాండ్ CPI Narayana demands CM Jagan arrest after PM Modi corruption comments CPI Narayana: జగన్ను తక్షణమే అరెస్టు చేయాలి - సీపీఐ నారాయణ డిమాండ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/16/453287387f8b7cc1367a08be8b51ce051715877597360234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Narayana Comments on CM Jagan: సీఎం జగన్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ల్యాండ్, వైన్, శ్యాండ్ ఇలా ఎన్నో అక్రమాలకు పాల్పడిన జగన్ ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే జగన్ అవినీతిపై మాట్లాడారని.. జగన్ అవినీతి, అక్రమాలపై మాట్లాడిన మోదీ వెంటనే జగన్ ను అరెస్టు చేయించాలని డిమాండ్ చేశారు. బటన్ నొక్కి నొక్కి చివరకు జగన్ అధికారం కోల్పోతున్నాడని ఎద్దేవా చేశారు.
‘‘ఎన్నికల తరువాత వ్యక్తిగత ద్వేషాలు అవసరం లేదు. రాష్ట్రంలో వైసీపీ నేతలు విధ్యంసాలకు తెరలేపుతున్నారు. రాజకీయ విధానాలనే జనం నమ్ముతారు.. నిత్యం సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన వ్యక్తి జగన్. పోలింగ్ కాక ముందు జగన్ ఇంటర్వ్యూ చూశా.. ఓటమి భయం స్పష్టంగా కనిపించింది. పోలింగ్ తరువాత సజ్జల రామక్రిష్ణారెడ్డి ప్రెస్ మీట్ లో కూడా అధికారం కోల్పోతున్నామన్న ఆవేదన కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో ఎపిలో వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. జర్నలిస్టులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను.
నరేంద్ర మోదీ చేతిలో కేంద్రం ఎన్నికల సంఘం కీలు బొమ్మగా మారింది. చివరి దశలో వారణాసి లాంటి ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. నార్త్ లో బిజెపికి సీట్లు రావు. గుజరాత్ లో బీజేపీకి సీట్లు తగ్గుతాయి. యూపీలో అస్సలు రాదు. సౌత్ మీద బీజేపీ దృష్టి పెట్టింది. అందుకే మైండ్ గేమ్ ఆడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. ఓటర్లలో చైతన్యం వచ్చింది.. బీజేపీని ఓడించిడానికే. మోదీ విధానాలపై విసుగెత్తి జనం ఓట్లు వేశారు.. ఓటింగ్ శాతం అందుకే పెరిగింది. మోదీ పాలనలో నల్లధనం పెరిగింది. దేశ ఆస్తులను అదానీకి మోదీ అప్పచెబుతున్నాడు.
మోదీ హయాంలో 16 లక్షల కోట్లు ఎగ్గొట్టి 29 మంది విదేశాలకు పారిపోయారు. డ్రగ్స్ సరఫరా మొత్తం అదానీ పోర్ట్ నుంచే అక్రమంగా సాగుతోంది. మోదీ కనుసన్నల్లోనే దేశంలో విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా జరుగుతోంది. తమిళనాడులో బీజేపీకి సీట్లు రావు.. ఏపీలో ఒకటి, తెలంగాణలో ఒక ఎంపీ సీటు మాత్రమే బీజేపీకి వస్తుంది. తమిళనాడు సీఎం స్టాలిన్ తరహాలో కాంగ్రెస్ నేతలు కూడా కలిసికట్టుగా పనిచేసి ఉంటే బాగుండేది. మోదీపై ఉన్న కోపంతో దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లేశారు’’ అని సీపీఐ నారాయణ మాట్లాడారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)