News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Cocktail Injection: అప్పుడు రెమిడిసివిర్, ఇప్పుడు కాక్‌టైల్.. కరోనా సోకితే ఇది తప్పకుండా వాడాలా? క్లారిటీ ఇచ్చిన డాక్టర్

కరోనా థర్డ్ వేవ్ వేళ మెడికల్ మాఫియా మళ్లీ విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ టైంలో రెమిడిసివిర్ తరహాలో ఇప్పుడు కాక్ టైల్ అనే మందు తప్పనిసరిగా వాడాలనే నమ్మకాన్ని జనాల్లో కలిగిస్తోంది.

FOLLOW US: 
Share:

చిత్తూరు జిల్లాలో రోజురోజుకి పెరుగుతున్న కోవిడ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకవైపు కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంటే మరోవైపు కోవిడ్ లక్షణాలతో ఉన్న రోగులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. వాతావరణంలో మార్పులు కారణంగా విజృంభిస్తున్న జ్వరాలు ఒకవైపు, థర్డ్ వేవ్ లో కరోనా మరోవైపు పంజా విసురుతుంది. మొదటి, రెండో దశలో కోవిడ్ కారణంగా అనేక‌ మంది ప్రాణాలను బలి తీసుకోవడమే కాకుండా, ఎన్నో కుటుంబాలను కరోనా వీధుల పాలు చేసింది. ఆసుపత్రుల్లో‌ బెడ్ లు ఖాళీ లేక, ఆక్సిజన్ అందుబాటులో లేక కోవిడ్ రోజులు అతలాకుతలం అయ్యారు. ఇటువంటి‌ సమయంలో అత్యంత విషమ పరిస్థితిలో ఉన్న వారికి రెమిడిసివిర్ ఇంజెక్షన్ తో‌ ప్రాణాలను కాపాడారు వైద్యులు. అయితే దీనినే ఆయుధంగా చేసుకున్న కొందరు మెడికల్‌ మాఫియా రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ ను డిమాండ్ క్రియేట్ చేసి వాటిని అధిక‌ ధరలకు విక్రయించే వారు.

మెడికల్ మాఫియా కొన్ని‌ ప్రైవేటు ఆసుపత్రులతో చేతులు కలిపి కోవిడ్ రోగులకు రెమిడిసివిర్ ఇంజక్షన్ అవసరం లేక పోయినా వాటిని రోగుల వద్ద కొనిపించి‌ డబ్బు దండుకునే వారు. ఈ‌క్ర మంలో మెడికల్‌ మాఫియాకు కళ్ళెం వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేటు ఆసుపత్రులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి‌ అవసరం అయితే గానీ రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ ఉపయోగించరాదని ప్రైవేటు ఆసుపత్రులకు నిబంధనలు పెట్టి ఇంజెక్షన్స్ పై ఖచ్చితమైన ధరను ప్రకటించింది. దీంతో కొంత‌మేరకు మెడికల్‌ మాఫీయా ఆగడాలకు అడ్డుకట్ట వేసినట్లు అయింది. అయితే థర్డ్ వేవ్ వ్యాప్తి నేపధ్యంలో మెడికల్ మాఫియా కాక్ టైల్ ఇంజెక్షన్ తెరపైకి తీసుకొచ్చింది. దీంతో కోవిడ్ సోకిన రోగులు కాక్ టైల్ ఇంజెక్షన్ కొనేందుకు ఉత్సహం చూపుతున్నారు. వ్యాధి సోకిన ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి కాక్ టైల్ ఇంజెక్షన్ ను వైద్యులు రెఫర్ చేస్తున్నారు. వేలకు వేలు అప్పు చేసి మరీ రోగులు కాక్ టైల్‌ ఇంజెక్షన్ ను కొంటున్నారు. కోవిడ్ సోకిందన్న భయంలో ప్రజలు కొందరు ప్రైవేటు వైద్యులు చెప్పిందల్లా చేస్తూ లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 

Also Read: ఉక్కు నగరాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. విశాఖ జిల్లాలో అత్యధిక కేసులు నమోదు

కాక్ టైల్ ఇంజెక్షన్ పై వైద్యులు ఏం అంటున్నారంటే..?
కరోనా వ్యాధి సోకిన‌ వ్యక్తికి అత్యవసర సమయాల్లో‌ మాత్రమే రెమిడిసివిర్ ‌ఇంజెక్షన్‌ వాడుతామని, అంతే‌కానీ సాధారణ‌ వ్యక్తులకు రెమిడిసివిర్, ‌కాక్‌టైల్‌ ఇంజెక్షన్ ‌వాడబోమని ప్రముఖ వైద్య నిపుణులు కిషోర్ కుమార్ అంటున్నారు. ప్రధానంగా వ్యాధి‌ సోకిన వారిలో‌ గర్బణీ స్త్రీలు గానీ, షుగర్, బీపీ, గుండెజబ్బులు వంటి వ్యాధులు ఉన్న వారికి రెమిడిసివిర్ ఇంజెక్షన్ గానీ, కాక్‌టైల్ ఇంజెక్షన్ గానీ రోగులకు ఉపయోగిస్తామని అంటున్నారు. అయితే థర్డ్ వేవ్ ఉధృతంగా వ్యాప్తి చేందుతున్న క్రమంలో‌ కొందరు మెడికల్ మాఫియా ప్రైవేట్ ఆసుపత్రులతో చేతులు కలిపి కాక్‌టైల్ ఇంజెక్షన్ ను రోగుల వద్ద బలవంతంగా కొనేలా చేస్తున్నారని, యాంటీబాడీగా పనిచేసే కాక్ టైల్ ఇంజక్షన్ ఒక డోసు 60 వేల రూపాయలకు మార్కెట్లో లభిస్తోందని, రెండు డోసులు లక్షా ఇరవై వేల వరకు ధర ఉండడంతో కొందరు మెడికల్ మాఫీయా కావాలనే పుకార్లు పుట్టిస్తున్నారని అన్నారు. 

దీన్ని ఎవరూ నమ్మవద్దని ప్రజలంతా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన కోరారు. కోవిడ్ వ్యాప్తి చెందుతున్న కారణంగా ప్రతి‌ ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ, తప్పనిసరిగా మాస్కులు ధరిస్తూ, శానిటైజర్ ఉపయోగించడం ద్వారా కరోనా వ్యాప్తిని కొంత వరకూ అడ్డుకట్ట వేసేందుకు వీలు అవుతుందన్నారు. ఎవరైనా కాక్ టైల్ ఇంజెక్షన్ తీసుకు‌రావాలని రోగులకు ఇబ్బందులకు గురి చేస్తే వారు‌ ప్రభుత్వ అధికారులకు గానీ, పోలీసులకు గానీ ఫిర్యాదు చేయవచ్చని ఆయన అన్నారు.

Also Read: Konchada Srinivas: ఆరోగ్య సమస్యలతో నటుడు కొంచాడ శ్రీనివాస్ మృతి

Also Read: Hyderabad: మొదటి భార్యతో కలిసి మాజీ భార్య వీడియో తీయించిన భర్త.. విడాకులైనా మోజు తగ్గక..!

Also Read: ఇద్దరు, ముగ్గురు సినిమా హీరోలపై కక్షతో పరిశ్రమను దెబ్బతిస్తారా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 20 Jan 2022 09:33 AM (IST) Tags: Chittoor covid cases cocktail injection covid positive cases remdesivir cocktail medicine cost Tirupati corona cases

ఇవి కూడా చూడండి

Tirupati Rains: తుపాన్ ప్రభావంతో తిరుపతిలో భారీ వర్షాలు, పలు విమానాలు దారి మళ్లింపు!

Tirupati Rains: తుపాన్ ప్రభావంతో తిరుపతిలో భారీ వర్షాలు, పలు విమానాలు దారి మళ్లింపు!

Trains Cancelled: విజయవాడ డివిజన్‌లో పలు రైళ్లు రద్దు- ప్రత్యేక ట్రైన్స్‌ గడువు పొడిగింపు

Trains Cancelled: విజయవాడ డివిజన్‌లో పలు రైళ్లు రద్దు- ప్రత్యేక ట్రైన్స్‌ గడువు పొడిగింపు

Weather Update: ఏపీలో తుపాను అలర్ట్, ఈ ప్రాంతంలోనే తీరందాటే అవకాశం - ఈ కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు

Weather Update: ఏపీలో తుపాను అలర్ట్, ఈ ప్రాంతంలోనే తీరందాటే అవకాశం - ఈ కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు

Tirumala News: తిరుమలలో వైకుంఠద్వార దర్శన తేదీలు ఇవే, అన్ని ఏర్పాట్లు - ఈవో

Tirumala News: తిరుమలలో వైకుంఠద్వార దర్శన తేదీలు ఇవే, అన్ని ఏర్పాట్లు - ఈవో

Chandra Babu Visits Tirumala: ఏడు కొండల వేంకంటేశ్వరుడిని దర్శించుకున్న చంద్రబాబు, భువనేశ్వరి

Chandra Babu Visits Tirumala: ఏడు కొండల వేంకంటేశ్వరుడిని దర్శించుకున్న చంద్రబాబు, భువనేశ్వరి

టాప్ స్టోరీస్

Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!

Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!

Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు

Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే

Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే
×