అన్వేషించండి

తిరుపతిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్రిక్తత- టీడీపీ లీడర్ల అరెస్టు

తిరుపతిలోని వివిధ పోలింగ్ కేంద్రాల్లో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నాయకులు దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ టిడిపి నాయకులు ఆరోపించడం, పోలీసులు టీడీపీ లీడర్లను అరెస్టు చేయడంతో టెన్షన్ వాతావరణం కనిపించింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాలకు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు తిరుపతిలో ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. ఎన్నికల సంఘం, పోలీసులు ఎంత పటిష్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ దొంగ ఓట్లు, ప్రలోభాలు ఆపలేకపోయారు. దీనిపై ప్రతిపక్షం ఆందోళనకు దిగడం, నిలదీయడంతో వారిని పోలీసులు అరెస్టు  చేస్తున్నారు. 

తిరుపతి ఎస్జిఎస్ హైస్కూల్ పోలింగ్ బుత్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపి నాయకులు దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ పొలింగ్ వద్దకు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టిడిపి నాయకులు రావడం కాసేపు టెన్షన్ వాతావరణం కనిపించింది. వారిని వైసీపీ లీడర్లు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నడిచింది. పోలీసులు రంగంలోకి దిగడంతో గొడవ సద్దుమణిగింది. 

వైసీపీ లీడర్ల అభ్యంతరంతో టిడిపి నాయకులను పోలింగ్ బూత్ నుంచి పోలీసులు బయటకు పంపించేశారు. దీనిపై మండిపడ్డా టీడీపీ నాయకులు పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దొంగ ఓట్లను కట్టడి చేయాలంటూ పోలీసులను మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నిలదీశారు. అక్రమాలు చేసి గెలవాలని ప్రభుత్వం భావిస్తోందని... అందుకు పోలీసుల సాయం తీసుకుంటుందని మండిపడ్డారు. 
తిరుపతి లోని 223వ పోలింగ్ బూత్‌లో టీడీపీ ఏజెంట్‌గా ఉన్న టీడీపీ నేత పులిగోరు మురళిని పోలీసులు అరెస్టు చేశారు. ఓటు వేసేందుకు వచ్చిన వారిని మురళి ప్రశ్నించడంతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్టు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దొంగ ఓట్లు వేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని అందుకే వారిని నిలదీశారు చెబుతున్నారు. మురళిని అరెస్ట్ చేసి పోలీసులు రేణిగుంట స్టేషన్ కి తరలించారు. 

సత్యనారాయణ పురం పోలింగ్ బూత్ వద్ద టిడిపి నాయకుడు కండ్ర లక్ష్మీపతిని పోలీసులు అరెస్టు చేశారు. దొంగ ఓట్లు వేస్తున్నారని వారిని ప్రశ్నించినందుకే లక్ష్మీపతిని అరెస్టు చేశారని మండిపడుతున్నారు టీడీపీ లీడర్లు. అదుపులోకీ తీసుకొని పోలీస్ స్టేషన్‌కీ తరలించారు. వైసీపీ నాయకులు పోలింగ్ కేంద్రం వద్దే ఉన్నా పోలీసులు పట్టించుకోవడం లేదని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సంజయ్ గాంధీ కాలనీ వద్ద దొంగ ఓట్లు వేసేందుకు మహిళలు వచ్చారు. ఏం చదువుకున్నారు... విద్యార్హతలు ఏంటని ప్రశ్నించడంతో 6,9 వ తరగతి చదువుకున్నామని మీడియాకు చెప్పారు. దొంగ ఓట్లు వేస్తే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ చెప్పిన విషయాన్ని మీడియా ప్రతినిధులు గుర్తు చేయడంతో అక్కడి నుంచి వాళ్లు జారుకున్నారు. ఓటు వేయకుండానే మహిళలంతా వెళ్లిపోయారు. 

సంజయ్‍గాంధీ కాలనీ 228 పోలింగ్ బూత్‍ వద్ద కొంతమంది అనర్హులతో ఓట్లు వేయించేందుకు వైసీపీ ప్రయత్నించదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వారిని అడ్డుకోవడంతో కాసేపు గందరగోళం నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకొని టీడీపీ లీడర్లను అక్కడి నుంచి తీసుకెళ్లడంతో అంతా సర్దుకుంది. 

అన్నమయ్య జిల్లాలో పట్టభద్రుల కోసం 51 పోలింగ్‌ కేంద్రాలు, ఉపాధ్యాయుల కోసం 30 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3890 మంది ఓటర్లు హక్కును వినియోగించుకోనున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 44432 మంది ఓటర్లు ఓటు వేస్తారు. జిల్లాలో 51 గ్రాడ్యుయేట్‌, 30 టీచర్స్‌ ఎమ్మెల్సీ పోలింగ్‌ కేంద్రాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. 

టాప్ హెడ్ లైన్స్

Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget