అన్వేషించండి

AP Hikes Power Tariff: ఏపీలో విద్యుత్ ఛార్జీల మోత - కొత్త ఛార్జీలు ఇవే ! సామాన్యులకు ఇక చుక్కలే !

AP Power Charges Hike: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ ఛార్జీల పెంచారు. తప్పనిసరి పరిస్థితుల్లో పెంపు తప్పడం లేదన్నారు ఏపీ ఈఆర్సీ ఛైర్మన్ నాగార్జున రెడ్డి.

AP Hikes Power Tariff: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ ఛార్జీల మోత ప్రారంభమైంది. తప్పనిసరి పరిస్థితుల్లో పెంపు తప్పడం లేదన్నారు ఏపీ ఈఆర్సీ ఛైర్మన్ నాగార్జున రెడ్డి. పెంచిన విద్యుత్ ఛార్జీల టారిఫ్‌ను తిరుపతిలో ఆయన విడుదల చేశారు. కరోనాతో అతులాకుతలం అయిన పేదల నడ్డి విరిచేందుకు ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల రూపంలో రంగం సిద్ధం చేసిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేదలకు ఆదాయం పెరుగకపోగా అదనపు భారం పెంపుపై పేద, మధ్యతరగతి వర్గాలు మండిపడుతున్నాయి. తాజాగా పెంచిన ఛార్జీల వివరాలు ఇలా ఉన్నాయి..

యూనిట్లపై విద్యుత్ ఛార్జీలు ఎంత పెంచారంటే..
30 యూనిట్ల వరకు యూనిట్‌పై 45 పైసలు పెంపు
31 యూనిట్ల నుంచి 75 యూనిట్ల వరకు 91 పైసలు
75 యూనిట్ల నుంచి 125 యూనిట్ల వరకు 1.40 రూపాయలు
126యూనిట్ల నుంచి 225 యూనిట్ల వరకు  1.57 రూపాయలు
226యూనిట్ల నుంచి 400 యూనిట్ల వరకు 1.16 రూపాయలు
400యూనిట్లకుపై బడిన వాళ్లకు 55పైసలు చొప్పున పెంపు ఉంటుంది.

ఏపీ ప్రజలపై కరెంట్ ఛార్జీల బాదుడు.. (Andhra Pradesh New Power Tariff Details)
ప్రస్తుతం 30 యూనిట్ల వరకు రూపాయి 45పైసలు చెల్లించేవాళ్లు ఇకపై రూపాయి 90పైసలు చెల్లించాల్సి ఉంటుంది. 31 యూనిట్ల నుంచి 75 యూనిట్ల వరకు వినియోగించేవాళ్లు ప్రస్తుతం 2 రూపాయల 9పైసలు చెల్లిస్తూ వస్తున్నారు. పెరిగే ఛార్చీలను బట్టి అది 3 రూపాయలకు పెరగనుంది. 76 యూనిట్ల నుంచి 125 యూనిట్లు వాడుకునే వినియోగదారులు ఇప్పటి వరకు 3రూపాయల 10 పైసలు చెల్లిస్తూ వస్తున్నారు. ఇకపై వాళ్లంతా 4రూపాయల50 పైసలు చెల్లించాలి. అంటే తేడా 1.40 ఉంటుంది. 126 యూనిట్ల నుంచి 225 యూనిట్లకు విద్యుత్‌ ఛార్జీలు చెల్లించే వాళ్లు ఇప్పటి వరకు 4 రూపాయల 43పైసలు చెల్లించేవాళ్లు ఇకపై వాళ్లు 6 రూపాయలు చెల్లించాలి.

వినియోగదారులు 226 యూనిట్ల నుంచి 400 యూనిట్లు మధ్య వినియోగించే వినియోగదారులు ఇప్పటి వరకు 7 రూపాయల 59 పైసలు చెల్లించేవాళ్లు ఇకపై వాళ్లు 8 రూపాయల 75పైసలు చెల్లించాలి. 400 యూనిట్లపైగా వినియోగించే వాళ్లు 9 రూపాయల 20పైసలు చెల్లించేవాళ్లు. ఇకనుంచి 9రూపాయల 75పైసలు చెల్లించాల్సి ఉంటుందని తాజా టారిఫ్‌లో ఏపీ ఈఆర్సీ ఛైర్మన్ నాగార్జున రెడ్డి వెల్లడించారు.

శ్లాబ్ (యూనిట్లు) ప్రస్తుత ధర (యూనిట్‌కు రూ.)  కొత్త ధర (యూనిట్‌కు రూ.) వ్యత్యాసం (యూనిట్‌కు రూ.)
0 - 30 1.45 1.90 0.45
31 - 75 2.09 3.00 0.91
76 - 125 3.10 4.50  1.40
126 - 225 4.43  6.00 1.57
226 - 400 7.59 8.75 1.16
400 పైగా  9.20 9.75 0.55

Also Read: Guntur: 3 నెలల చిన్నారిని 6 సార్లు అమ్మేశారు! అసలు సంగతి తెలిసి అవాక్కైన పోలీసులు

Also Read: Petrol-Diesel Price, 30 March: రోజురోజుకీ ఎగబాకిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు - నేడు మరీ దారుణం

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పర్మిషన్ లేకుండా ర్యాలీలు.. పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు
పర్మిషన్ లేకుండా ర్యాలీలు.. పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు
Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: పర్మిషన్ లేకుండా ర్యాలీలు.. పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు
పర్మిషన్ లేకుండా ర్యాలీలు.. పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Embed widget