అన్వేషించండి

AP Chittoor Chit fund fraud: అందరం ఒకటే అన్నాడు... చే బదులు కోసం చిట్టీలు వేయించాడు... కట్ చేస్తే సీన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లింది...

కూలీ నాలీ చేసుకుని పొట్ట నింపుకునే జీవితాలు వాళ్లవి..ఒక్క పూట తిని మరోక పూట పస్తులుండి దాచుకున్న డబ్బులు, కష్టకాలంలో తమను ఆదుకుంటాయని చిట్టీలు కట్టారు. కానీ నమ్మిన చిట్టీల వ్యాపారి నట్టేట ముంచాడు.

చిట్టీల వ్యాపారం పేరుతో చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలను నమ్మించి, ఐపీ పెట్టిన వ్యవహరం చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గంలో వెలుగు చూసింది. ఏకాంబరకుప్పం గ్రామానికి చెందిన అరుణ్ కుమార్ అనే వ్యక్తి చిట్టీల వ్యాపారం చేస్తూ స్థానికులను నమ్మించాడు. ఏళ్ల తరబడి గ్రామంలో నివాసం ఉండడంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు లక్ష రూపాయల నుంచి పది లక్షల వరకూ చిట్టీలు కట్టారు. ముఖ్యంగా స్ధానికంగా ఉన్న మధ్యతరగతి చేనేత కార్మికులను నమ్మించి, చిన్న స్థాయి నుంచి పెద్ద స్ధాయి వరకూ అందరితో చిట్టీలు కట్టించాడు. తక్కువ మొత్తంలో చిట్టీలు వేసిన వారికి డబ్బులు తిరిగి ఇవ్వడంతో అరుణ్ కుమార్ పై స్ధానికులకు మరింత నమ్మకం కుదిరింది. దీంతో అతని వద్ద పెద్ద మొత్తంలో చిట్టీలు వేసేందుకు స్థానికులు ముందుకు వచ్చారు. అరుణ్ కుమార్ వారి నుంచి నెల నెల డబ్బులు కట్టించుకునేవాడు. చిట్టీల గడువు పూర్తై డబ్బులు తిరిగి చెల్లించమని భాస్కర్ ను స్థానికులు కోరారు. ప్రస్తుతం తన దగ్గర నగదు లేదని కొంత కాలం గడువు కావాలని అరుణ్ కుమార్ కోరాడు. కానీ వారికి సొమ్ము తిరిగి చెల్లించలేదు.

సుమారు 400 మంది నుంచి చిట్టీలు కట్టించున్న అరుణ్... డబ్బు తిరిగి చెల్లించకుండా వాయిదాలు వేస్తూ వచ్చాడు. ఇలా కొన్నాళ్ళు పొడిగించిన ఆయన...కొవిడ్ కారణంగా చెప్తూ వాయిదాలు వేస్తూ వచ్చాడు. చివరికి ఖాతాదారుల ఒత్తిడి ఎక్కువ అవడంతో వారికి ఈ నెల 26వ తేదీ వరకూ గడువు కావాలని కోరి.. ఖాతాదారుల సొమ్ము మొత్తం చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. ఇచ్చిన గడువు ముగియడంతో ఖాతాదారులు ఏకాంబరకుప్పంలోని కామరాజు వీధులో నివాసం ఉన్న అరుణ్ కుమార్ వద్దకు బాధితులంతా కలిసి వెళ్లగా..అతని ఇంటికి తాళ్ళం వేసి ఉంది. అతనిని ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించగా...ఫోన్ స్విచ్ఛ్ ఆప్ అని రావడంతో చిట్టీలు కట్టిన వారంతా ఆందోళనకు గురయ్యారు. అరుణ్ కుమార్ గురించి విచారించగా గత వారం రోజులుగా అరుణ్ కుమార్, అతని కుటుంబ సభ్యులు ఎవరు కనిపించడంలేదని, ఇళ్లు ఖాళీ చేశారని స్థానికులు తెలిపారు. దీంతో దిక్కు తోచని స్థితిలో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. మొత్తం 80 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత రెండు సంవత్సరాలుగా చిట్టీల రూపంలో అరుణ్ కుమార్ వద్ద తాము దాచుకున్న డబ్బును తిరిగి ఇప్పించాలని బాధితులు పోలీసులను కోరారు. దీనిపై నగరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Also Read: Andhra Pradesh: జాతీయ డిజిటల్ టూరిజం మిషన్ లో ఏపీ సభ్య రాష్ట్రం..పర్యాటక రంగంలో డిజిటలైజేషన్ పై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన కేంద్రం..

టాప్ హెడ్ లైన్స్

RK Roja: మాజీ మంత్రి ఆర్‌కే రోజాకు తిరుపతి ఈస్ట్ పోలీసులు నోటీసులు.. ఈ 30న విచారణ
మాజీ మంత్రి ఆర్‌కే రోజాకు తిరుపతి ఈస్ట్ పోలీసులు నోటీసులు.. ఈ 30న విచారణ
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
Tirumala Laddu Ghee Adulteration Case: తిరుమల లడ్డు నెయ్యి కల్తీ కేసులో కీలక మలుపు! అధికారులపై శాఖాపరమైన విచారణకు ప్రభుత్వం ఆదేశం!
తిరుమల లడ్డు నెయ్యి కల్తీ కేసులో కీలక మలుపు! అధికారులపై శాఖాపరమైన విచారణకు ప్రభుత్వం ఆదేశం!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget