అన్వేషించండి

TTD Board Meeting : టిక్కెట్లు లేకపోయినా సర్వదర్శనం, వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు-టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలివే!

TTD Board Meeting : టీటీడీ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేశారు.

TTD Board Meeting : టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన బోర్డు పాలక మండలి సమావేశం శనివారం నిర్వహించారు. 252 అజెండాలతో పాలక మండలి సమావేశం జరిగింది. బ్రహ్మోత్సవాలు, సర్వదర్శనం క్యూలైన్స్ నిర్మాణంపై తీర్మానం, వకుళమాత ఆలయాన్ని టీటీడీ పరిధిలోనికి తీసుకురావాలన్న నిర్ణయం పాటు పలు కీలక అంశాలపై టీటీడీ బోర్డు చర్చించింది.  టీటీడీకి సంబంధించిన ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేశామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. టీటీడీ 960 ఆస్తులను రూ.85,705 కోట్లుగా నిర్థారించారు.  12 రకాల ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల‌ కొనుగోలుకు సాధికారిక సంస్థతో ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించారు. రైతులకు గిట్టుబాటు ధర ఇస్తూ వారిని చైతన్య పరచడానికి చర్యలు చేపట్టాలని బోర్డు నిర్ణయించింది. తిరుమల గోవర్ధన సత్రం వెనుక పీఏసీ-5 నిర్మాణానికి రూ.95 కోట్లతో టెండర్లు పిలవాలని టీటీడీ బోర్డు సభ్యులు నిర్ణయించారు. 

నిధుల కేటాయింపులు 

నందకం అతిథి గృహం పునరుద్ధరణకు 2.45 కోట్లు కేటాయింపు, సామాన్య భక్తులకు కేటాయించే గదుల అభివృద్ధికి రూ.7.20 కోట్లు, నెల్లూరు శివార్లలో ఉన్న రెండు ఎకరాలలో ఆలయం, కళ్యాణ మండపం నిర్మాణానికి రూ. 9 కోట్లు, తిరుపతి ఆర్ట్స్ కాలేజీ అభివృద్ధికి రూ.6.30 లక్షలు టీటీడీ కేటాయించింది. అర్హులైన టీటీడీ ఉద్యోగుల ఇండ్ల స్థలాల కోసం రూ.60 కోట్లు చెల్లించి 300 ఎకరాలు సేకరించామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.  రూ.25 కోట్లతో ఇంకో 129 ఎకరాల‌ కొనుగోలుపై చర్చించామన్నారు. తిరుపతిలో టైం స్లాట్ టోకెన్లు ఇవ్వడానికి నిర్ణయించామన్నారు.  వీఐపీ బ్రేక్ దర్శనాలు సమయాల్లో మార్పు చేయాలని టీటీడీ నిర్ణయించింది.  

టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు 

"టీటీడీ ఆస్తులు రూ. 85 వేల 705 కోట్లు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన 12 రకాల పంటలను కొనుగోలు చేసేందుకు రైతు సాధికార సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం. తిరుమలలో సామన్య భక్తులకు వసతి సదుపాయం పెంపుపై నిర్ణయం తీసుకున్నాం. గోవర్థన సత్రాల వెనుక భాగంలో 95 కోట్లతో పీఏసీ-5 నిర్మించాలని బోర్డు నిర్ణయించింది. వకూళమాత ఆలయం నుంచి జూపార్క్ వరకు రూ.30 కోట్లతో కనెక్టివిటీ రింగ్ రోడ్డును నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం. తిరుమలలోని గదుల్లో గీజర్ లు ఏర్పాటుకు రూ 7 కోట్ల 20 లక్షల నిధులు మంజూరు చేసేందుకు చర్చించి నిర్ణయం తీసుకున్నాం. ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో క్లాస్ రూమ్స్, హాస్టల్ అభివృద్ధికి రూ.6 కోట్లు 20 లక్షల నిధులు మంజూరు చేస్తాం. టీటీడీ ఉద్యోగుల ఇంటి స్థలాల కోసం 300 ఎకరాలు ప్రభుత్వం నుంచి ఇదివరకే కొనుగోలు చేశాం.  భవిష్యత్తు అవసరాల కోసం రూ.25 కోట్లతో మరో 130 ఎకరాలు కొనుగోలు చేయాలని తాజాగా నిర్ణయించాం.  టైం స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ పునరుద్ధరణ చేసి పెరటాసి మాసం అనంతరం తిరుపతిలో భక్తులకు సర్వదర్శనం టోకన్లు పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నాం." -వైవీ సుబ్బారెడ్డి  

ఉదయం 10 గంటల తర్వాత వీఐపీ బ్రేక్ దర్శనాలు 

"ఎలాంటి టోకెన్లు, టిక్కెట్లు లేక పోయినా భక్తులను సర్వదర్శనం అనుమతించే విధానం యధావిధిగా కొనసాగుతుంది. వీఐపీ బ్రేక్ దర్శనాల సమయంలో మార్పులు చేయాలని బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఉదయం 10 గంటల తరువాత వీఐపీ బ్రేక్  దర్శనాలు ప్రారంభించాలని యోచిస్తున్నాం. పూర్తి స్థాయిలో బ్రేక్ దర్శనాలపై ప్రయోగాత్మకంగా పరిశీలించిన తరువాత అమలు చేస్తాం. వసతి కేటాయింపు ప్రక్రియను పూర్తిగా తిరుపతి నగరానికి మార్పు చేయాలని యోచనలో ఉన్నాం.  బ్రహ్మోత్సవాల అనంతరం ప్రయోగాత్మక పరిశీలన అనంతరం గదులు కరెంట్ బుకింగ్ విధానం తిరుపతికి తరలించాలని నిర్ణయం తీసుకుంటాం. "-టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి 

టాప్ హెడ్ లైన్స్

MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget