అన్వేషించండి

Tirumala : వీడిన సంపూర్ణ చంద్రగ్రహణం, తెరచుకున్న శ్రీవారి ఆలయం

Tirumala : చంద్రగ్రహణం వీడడంతో తిరుమల శ్రీవారి ఆలయం తెరచుకుంది. రాత్రి 8 గంటల నుంచి భక్తులను దర్శనాలకు అనుమతిస్తున్నారు.

Tirumala : సంపూర్ణ చంద్రగ్రహణం వీడడంతో తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు తెరచుకుంది. మంగళవారం ఉదయం సరిగ్గా 8:41 గంటలకు ఆలయ మహాద్వారాలను చంద్రగ్రహణానికి పదకొండు గంటల ముందే మూసివేశారు అర్చకులు. దీంతో స్వామి వారి దర్శనానికి విచ్చేసే భక్తులను తాత్కాలికంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అనుమతి రద్దు చేసింది టీటీడీ.  అంతే‌ కాకుండా తిరుమలలో లడ్డూ వితరణ, అన్నప్రసాదం వితరణను సైతం టీటీడీ నిలిపివేసింది. చంద్ర గ్రహణం వీడిన అనంతరం శాస్త్రబద్దంగా ఆలయ అర్చకులు రాత్రి 7:27 గంటలకు టీటీడీ అధికారుల సమక్షంలో ఆలయ ద్వారాలను తెరిచారు. అనంతరం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేపడుతూ ఒక్కొక్క ద్వారం  తెరిచారు. ఆలయ అర్చకులు పుణ్యవచనం నిర్వహించడంతో గ్రహదోషం తొలగిపోయింది. అనంతరం మూలవిరాట్టు‌పై కప్పిన వస్త్రం తొలగించి స్వామి వారికి రాత్రి కైంకర్యాలైన తోమాల, అర్చన సేవలను అర్చకులు ఏకాంతంగా నిర్వహించారు. తరువాత స్వామి వారికి నైవేద్యం సమర్పించిన తర్వాత  రాత్రి 8:00 గంటల నుంచి సామాన్య భక్తులను శ్రీవారిని దర్శనానికి టీటీడీ అనుమతించింది. 

శ్రీశైలంలో 

నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆళయంలో చంద్ర గ్రహణం కారణంగా ఉదయం 6.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఆలయాన్ని మూసివేశారు.  వేకువ జామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరచి ముందుగా మంగళ వాయిద్యాలు, 3.30గంటలకు నుండి సుప్రభాతసేవ, 4.30గంటలకు శ్రీస్వామి అమ్మవార్ల మహా మంగళ హారతులు నిర్వహించారు. మహా మంగళ హారతి సమయం నుండే భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. తిరిగి సాయంత్రం 6.30 గంటలకు ఆలయ ద్వారాలు తెరచిన తరువాత ఆలయ శుద్ధి, మంగళ వాయిద్యాలు, సంప్రోక్షణ, ప్రదోషకాల పూజలు చేశారు. రాత్రి 8 గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తున్నారు. అయితే భక్తులకు శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు. గ్రహణం కారణంగా అన్ని ఆర్జితసేవలు, శాశ్వతసేవలు, పరోక్షసేవలు నిలిపివేశారు. గ్రహణం కారణంగా ఈ రోజు మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ కూడా నిలుపుదల చేస్తున్నారు. రాత్రి 8 గంటల నుంచి అల్పాహారం అందిస్తున్నారు. .

తెరచుకున్న ఆలయాలు 

దేశవ్యాప్తంగా చంద్ర గ్రహణం వీడింది. ఖగోళ శాస్త్రంలో అద్భుతంగా చెప్పుకునే చంద్ర గ్రహణం పూర్తైంది. పలు రాష్ట్రాల్లో బ్లడ్ మూన్ కనువిందు చేసింది. దేశంలో కొన్ని ప్రాంతాల్లో గంట పాటు గ్రహణం ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో  39 నిమిషాల పాటు గ్రహణం కొనసాగింది. దేశంలో మధ్యాహ్నం 2.19 నిమిషాలకు ప్రారంభమైన చంద్రగ్రహణం సాయంత్రం 6 గంటల 19 నిమిషాల వరకు కనువిందుచేసింది. తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 5.40 గంటల నుంచి చంద్రగ్రహణం కనువిందు చేసింది. గౌహతిలో అత్యధికంగా 1.43 నిమిషాల పాటు చంద్ర గ్రహణం కనిపించింది.  తెలుగు రాష్ట్రాల్లో 39 నిమిషాల పాటు గ్రహణం కనిపించింది.  అయితే దేశంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో చంద్ర గ్రహణం కనిపించింది. 

మళ్లీ మూడేళ్ల తర్వాత 

తెలుగు రాష్ట్రాల్లో చంద్ర గ్రహణంతో పలు ఆలయాలను మూసివేశారు. గ్రహణం వీడటంతో ఆలయాలు తిరిగి తెరుచుకుంటున్నాయి. ఈ ఏడాది ఇదే చిట్టచివరి చంద్రగ్రహణం కావడం విశేషం. సూర్యగ్రహణం ఏర్పడిన 15 రోజుల్లోనే చంద్ర గ్రహణం ఏర్పడడం ఖగోళ వింతల్లో ఒకటి అని శాస్త్రవేత్తలు అంటున్నారు. మళ్లీ చంద్రగ్రణహం కనిపించేది మూడేళ్ల తర్వాతే అని అంటున్నారు.  2025 సెప్టెంబర్ 7న మళ్లీ చంద్ర గ్రహణం ఏర్పడనుంది.  అయితే పాక్షిక చంద్ర గ్రహణం మాత్రం 2023 అక్టోబర్‌ లో కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. 

Also Read : Hindupur News : ప్రభుత్వ ఉపాధ్యాయుడికి వింత కష్టం, గుండు చేయించుకుంటే గుర్తుపట్టడంలేదు!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Samarlakota fire accident: సామర్లకోట అగ్నిప్రమాదంలో 18 మంది దుర్మరణం - సీఎం దిగ్భ్రాంతి - సహాయ చర్యలకు కదిలిన యంత్రాంగం
సామర్లకోట అగ్నిప్రమాదంలో 18 మంది దుర్మరణం - సీఎం దిగ్భ్రాంతి - సహాయ చర్యలకు కదిలిన యంత్రాంగం
Kakinada Fire Cracker Explosion: బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు
బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు
Kakinada Huge explosion : సామర్లకోట బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు - 10 మంది దుర్మరణం
సామర్లకోట బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు - 10 మంది దుర్మరణం
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Kakinada Fire Cracker Explosion: బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు
బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ranji Trophy Winner: తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
Kakinada Huge explosion : సామర్లకోట బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు - 10 మంది దుర్మరణం
సామర్లకోట బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు - 10 మంది దుర్మరణం
HPV Vaccine India: దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
ISRAEL-IRAN WAR: ఖమేనీ కార్యాలయంపై ఇజ్రాయెల్‌-అమెరికా ఉమ్మడి దాడి!మధ్య ప్రాచ్యంలో యుద్ధ మేఘాలు!
ఖమేనీ కార్యాలయంపై ఇజ్రాయెల్‌-అమెరికా ఉమ్మడి దాడి!మధ్య ప్రాచ్యంలో యుద్ధ మేఘాలు!
Guntur Viral News: గుంటూరులో డయల్‌ 100కు వింత ఫిర్యాదు; కజ్జికాయలు పెట్టలేదని మామపై అల్లుడి కంప్లైంట్‌!
గుంటూరులో డయల్‌ 100కు వింత ఫిర్యాదు; కజ్జికాయలు పెట్టలేదని మామపై అల్లుడి కంప్లైంట్‌!
Embed widget