అన్వేషించండి

Tirumala News: తిరుపతి స్థానికులకు శ్రీనివాసుడి దర్శనం - టోకెన్లు ఎక్కడ ఇస్తారంటే?

Andhra News: తిరుమల శ్రీవారి దర్శనాన్ని తిరుపతి స్థానికులకు డిసెంబర్ 3న కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. డిసెంబర్ 1న మహతి ఆడిటోరియం, బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్‌లో టోకెన్లు ఇవ్వనున్నారు.

Tirumala Srivari Darshan To Locals: తిరుపతిలోని (Tirupati) స్థానికులకు శ్రీనివాసుడి దర్శనాన్ని టీటీడీ (TTD) ఇటీవలే పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు డిసెంబర్ 3వ తేదీన (మొదటి మంగళవారం) స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరికి డిసెంబర్ 1న తిరుపతి మహతి ఆడిటోరియంలో, తిరుమలలోని బాలాజీనగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో ఉదయం 5 గంటలకు టోకెన్లు జారీ చేయనున్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి ఈ నెల 18న జరిగిన తొలి సమావేశంలో ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని తీసుకున్న నిర్ణయం మేరకు చర్యలు చేపట్టింది. తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలతో పాటు తిరుమలకు చెందిన స్థానికులు తమ ఆధార్ ఒరిజినల్ కార్డు చూపించి టోకెన్లు పొందొచ్చని అధికారులు తెలిపారు.

అటు, సర్వ దర్శనానికి వచ్చే భక్తులకు 2, 3 గంటల్లోగా శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తామని టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయించగా.. దీని కోసం ఓ నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామని, నివేదిక ఆధారంగా భక్తులకు వెంటనే స్వామి దర్శనం చేసేలా చర్యలు చేపడతామని టీటీడీ తెలిపింది. అలాగే, టీటీడీలో పని చేస్తోన్న అన్యమత ఉద్యోగులను బయటకు పంపేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ప్రభుత్వానికి నివేదించి ప్రభుత్వ శాఖలకు బదిలీ చేసేలా నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.

తిరుపతిలో భారీ వర్షం

మరోవైపు, పెంగల్ తుపాను ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. తిరుమలలో శుక్రవారం రాత్రి నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఓ వైపు దట్టంగా కురుస్తోన్న మంచు, మరోవైపు వర్షం, పెరిగిన చలితో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. భక్తులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని తితిదే సూచించింది. పాపవినాశనం, శ్రీవారి పాదాల మార్గాలు తాత్కాలికంగా మూసేశారు. వృక్షాలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

రాజకీయ ప్రసంగాలపై నిషేధం

అటు, శ్రీవారి ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు తిరుమలలో రాజకీయ, ధ్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ నిర్ణయించింది. గత కొంతకాలంగా కొందరు రాజకీయ నేతలు దర్శనానంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ ప్రసంగాలు, విమర్శలు చేయడం విమర్శలకు తావిస్తోంది. దీంతో పవిత్ర పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకం కలుగుతోంది. ఈ క్రమంలో రాజకీయ ప్రసంగాలు నిషేధించాలని ఇటీవల జరిగిన తితిదే బోర్డు సమావేశంలో నిర్ణయించగా.. శనివారం నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అలాగే, ఇటీవల శ్రీవారి ఆలయం ముందు ఫోటో షూట్స్ కూడా వివాదంగా మారాయి. ఈ అంశాన్ని కూడా టీటీడీ సీరియస్‌గా తీసుకుంది. ఆలయం ముందు అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది.

Also Read: SCR: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telugu Woman Murder: అమెరికాతో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాతో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Nimmala Rama Naidu: కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
Jana Nayagan OTT : 'జన నాయగన్' రిలీజ్‌కు ముందే ట్విస్ట్? - ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా!
'జన నాయగన్' రిలీజ్‌కు ముందే ట్విస్ట్? - ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా!
Ravindra Jadeja: రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా! వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్
రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా! వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telugu Woman Murder: అమెరికాతో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాతో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Nimmala Rama Naidu: కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
Jana Nayagan OTT : 'జన నాయగన్' రిలీజ్‌కు ముందే ట్విస్ట్? - ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా!
'జన నాయగన్' రిలీజ్‌కు ముందే ట్విస్ట్? - ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా!
Ravindra Jadeja: రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా! వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్
రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా! వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Jana Nayakudu : విజయ్ 'జన నాయకుడు' ఎఫెక్ట్ - రెండేళ్ల తర్వాత టాప్ ట్రెండింగ్‌లో బాలయ్య మూవీ
విజయ్ 'జన నాయకుడు' ఎఫెక్ట్ - రెండేళ్ల తర్వాత టాప్ ట్రెండింగ్‌లో బాలయ్య మూవీ
Hero Splendor లేదా TVS Star City Plus ఏ బైక్ కొనడం బెస్ట్ ? ధర, మైలేజీ తెలుసుకోండి
Hero Splendor లేదా TVS Star City Plus ఏ బైక్ కొనడం బెస్ట్ ? ధర, మైలేజీ తెలుసుకోండి
Beyond Fixed Deposits : ఈ 5 పథకాల్లో పెట్టుబడి పెడితే ఎప్పటికీ డబ్బుల కొరత ఉండదు.. FDల కంటే బెస్ట్
ఈ 5 పథకాల్లో పెట్టుబడి పెడితే డబ్బుల వర్షం కురుస్తుంది ఎప్పటికీ డబ్బుల కొరత ఉండదు
Embed widget