అన్వేషించండి

Tirumala News: తిరుపతి స్థానికులకు శ్రీనివాసుడి దర్శనం - టోకెన్లు ఎక్కడ ఇస్తారంటే?

Andhra News: తిరుమల శ్రీవారి దర్శనాన్ని తిరుపతి స్థానికులకు డిసెంబర్ 3న కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. డిసెంబర్ 1న మహతి ఆడిటోరియం, బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్‌లో టోకెన్లు ఇవ్వనున్నారు.

Tirumala Srivari Darshan To Locals: తిరుపతిలోని (Tirupati) స్థానికులకు శ్రీనివాసుడి దర్శనాన్ని టీటీడీ (TTD) ఇటీవలే పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు డిసెంబర్ 3వ తేదీన (మొదటి మంగళవారం) స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరికి డిసెంబర్ 1న తిరుపతి మహతి ఆడిటోరియంలో, తిరుమలలోని బాలాజీనగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో ఉదయం 5 గంటలకు టోకెన్లు జారీ చేయనున్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి ఈ నెల 18న జరిగిన తొలి సమావేశంలో ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని తీసుకున్న నిర్ణయం మేరకు చర్యలు చేపట్టింది. తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలతో పాటు తిరుమలకు చెందిన స్థానికులు తమ ఆధార్ ఒరిజినల్ కార్డు చూపించి టోకెన్లు పొందొచ్చని అధికారులు తెలిపారు.

అటు, సర్వ దర్శనానికి వచ్చే భక్తులకు 2, 3 గంటల్లోగా శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తామని టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయించగా.. దీని కోసం ఓ నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామని, నివేదిక ఆధారంగా భక్తులకు వెంటనే స్వామి దర్శనం చేసేలా చర్యలు చేపడతామని టీటీడీ తెలిపింది. అలాగే, టీటీడీలో పని చేస్తోన్న అన్యమత ఉద్యోగులను బయటకు పంపేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ప్రభుత్వానికి నివేదించి ప్రభుత్వ శాఖలకు బదిలీ చేసేలా నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.

తిరుపతిలో భారీ వర్షం

మరోవైపు, పెంగల్ తుపాను ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. తిరుమలలో శుక్రవారం రాత్రి నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఓ వైపు దట్టంగా కురుస్తోన్న మంచు, మరోవైపు వర్షం, పెరిగిన చలితో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. భక్తులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని తితిదే సూచించింది. పాపవినాశనం, శ్రీవారి పాదాల మార్గాలు తాత్కాలికంగా మూసేశారు. వృక్షాలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

రాజకీయ ప్రసంగాలపై నిషేధం

అటు, శ్రీవారి ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు తిరుమలలో రాజకీయ, ధ్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ నిర్ణయించింది. గత కొంతకాలంగా కొందరు రాజకీయ నేతలు దర్శనానంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ ప్రసంగాలు, విమర్శలు చేయడం విమర్శలకు తావిస్తోంది. దీంతో పవిత్ర పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకం కలుగుతోంది. ఈ క్రమంలో రాజకీయ ప్రసంగాలు నిషేధించాలని ఇటీవల జరిగిన తితిదే బోర్డు సమావేశంలో నిర్ణయించగా.. శనివారం నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అలాగే, ఇటీవల శ్రీవారి ఆలయం ముందు ఫోటో షూట్స్ కూడా వివాదంగా మారాయి. ఈ అంశాన్ని కూడా టీటీడీ సీరియస్‌గా తీసుకుంది. ఆలయం ముందు అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది.

Also Read: SCR: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget