అన్వేషించండి

YSRCP : పార్టీని వదిలే ప్రసక్తే లేదు - వైసీపీ హైకమాండ్‌కు చల్లని కబురు చెప్పిన ముగ్గురు రాజ్యసభ ఎంపీలు

Andhra Pradesh : వైసీపీకి రాజీనామా చేయడం లేదని ముగ్గురు ఎంపీలు క్లారిటీ ఇచ్చారు. రాజీనామాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరగడంతో ఈ ప్రకటనలు చేశారు.

Three MPs have clarified that they are not resigning from YCP :  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితి నడుస్తోంది. ఇద్దరు రాజ్యసభ ఎంపీలు పార్టీతో పాటు రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. దీంతో వారి బలం 9కి పడిపోయిదంది.  ఈ తొమ్మిది మందిలోనూ ఆరేడుగురు పార్టీ మారిపోతారని విస్తృత ప్రచారం జుగుతోంది. ఈ ప్రచారాన్ని ఖండిస్తూ ముగ్గురు ఎంపీలు ప్రకటనలు విడుదల చేశారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారబోమని ప్రకటించారు. వారు ముగ్గురు ఎవరంటే విజయసాయిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్ . కృష్ణయ్య. 

వైసీపీని వీడేది లేదన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ 

వైసీపీకి రాజీనామా చేయబోయే ఎంపీల్లో పిల్లి సుభాష్ చంద్రబోస్ పేరు కూడా జోరుగా వినిపించింది. ఆయన వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తామెవరం వైసీపీని వీడేది లేదని స్పష్టం చేశారు. తమకు జగన్ ఎలాంటి అన్యాయం చేయలేదన్నారు. తాను రాజీనామా చేసినా సీటు మళ్లీ వైసీపీకి రాదని అలాంటప్పుడు రాజీనామా చేయడం కూడా ద్రోహమేనన్నారు. వైసీపీకి తాము ద్రోహం చేయబోవడం లేదన్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు పిల్లి సుభాష్ తో పాటు మోపిదేవి వెంకటరమమలు వారి వారి నియోజకవర్గాల్లో ఓడిపోయినప్పుడు జగన్ మంత్రి పదవులు ఇచ్చారు. అయితే కొద్ది రోజులకే శాసనమండలిని రద్దు చేస్తున్నామని చెప్పి వారితో రాజీనామాలు చేయించి రాజ్యసభ పదవులు ఇచ్చారు. అటు మండలిని రద్దు చేయలేదు.. వీరు రాజీనామా చేసిన ఎమ్మెల్సీ సీట్లు వేరే వారికి ఇచ్చారు. ఇటీవల రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి తన కుమారుడికి టిక్కెట్ కోసం పిల్లి సుభాష్ పట్టు బట్టి సాధించుకున్నారు. అయితే ఆయన విజయ సాధించలేదు. 

పార్టీ మారే ప్రసక్తే లేదన్న ఆర్. కృష్ణయ్య

తెలంగాణకు చెందిన ఆర్. కృష్ణయ్య కూడా వైసీపీని వీడే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. ఆయనకు కూడా వైసీపీ రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చింది. ఏపీకి ఎన్నికల సమయంలో ఆయన ప్రచారం చేశారు. అయితే వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనరు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పని చేశారన్న ప్రచారం ఉంది. ఆయన కూడా వైసీపీకి గుడ్ బై చెప్పి.. టీడీపీ లేదా బీజేపీలో  చేరుతారన్న ప్రచారం ఊపందుకుంది. గతంలో ఆర్.కృష్ణయ్య టీడీపీలోనే ఉండేవారు. ఎల్బీనగర్ నుంచి ఎమ్మెల్యేగా పని చేశారు. తర్వాత వైసీపీలో చేరారు. అయితే తన గురించి తెలిసిన వారెవరూ పార్ట మారుతారని చెప్పరని ఆయన అంటున్నారు. 

విచారణాధికారి ఎదుట కాదంబరి జత్వానీ హాజరు - తనకు ఎదురైన ఇబ్బందులు వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్న నటి

విజయసాయిరెడ్డి కూడా సేమ్ స్టేట్‌మెంట్

విజయసాయిరెడ్డి కూడా తాను పార్టీ మారడం లేదని సోషల్ మీడియాలో ప్రకటించారు. నిజానికి విజయసాయిరెడ్డి పార్టీ మారుతారన్న ప్రచారం జరగలేదు. కానీ ఆయన వివరణ ఇచ్చారు. 

 
మరో వైపు ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో పాటు మరికొంత మంది  పార్టీ మారుతారన్న  ప్రచారం ఊపందుకుంది. వారితో కూడా వివరణ ప్రకటనలు ఇప్పించాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు. 

న్యాయవ్యవస్థపై అపారమైన నమ్మకం - సుప్రీంకోర్టు ఆగ్రహంతో రేవంత్ రెడ్డి వివరణ

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్, కొత్తగా 7 ఫ్లైఓవర్లు నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్, కొత్తగా 7 ఫ్లైఓవర్లు నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Vallabhaneni Vamsi Remand: వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్.. చేజేతులా A1గా మారిన వైనం
వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్.. చేజేతులా A1గా మారిన వైనం
Laila Twitter Review - 'లైలా' ట్విట్టర్ రివ్యూ: చిరంజీవిని ఫుల్లుగా వాడేసిన విశ్వక్ సేన్... లైలా డిజాస్టర్ టాక్ వెనుక వైసీపీ?
'లైలా' ట్విట్టర్ రివ్యూ: చిరంజీవిని ఫుల్లుగా వాడేసిన విశ్వక్ సేన్... లైలా డిజాస్టర్ టాక్ వెనుక వైసీపీ?
KCR Re Entry: కేసీఆర్ రీ ఎంట్రీకి ఫిబ్రవరి 19న ముహుర్తం - తెలంగాణ భవన్‌లో కీలక సమావేశం - ఇక సమరమే !
కేసీఆర్ రీ ఎంట్రీకి ఫిబ్రవరి 19న ముహుర్తం - తెలంగాణ భవన్‌లో కీలక సమావేశం - ఇక సమరమే !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rajat Patidar RCB New Captain IPL 2025 | కొత్త కెప్టెన్ ను ప్రకటించిన ఆర్సీబీ | ABP DesamBird Flu in East Godavari Poultry | పెరవలి మండలంలో మృత్యువాత పడుతున్న వేలాది కోళ్లు | ABP DesamPawan kalyan in Kumbakonam Swamimalai Visit | తమిళనాడు ఆలయాలను దర్శించుకుంటున్న డిప్యూటీ సీఎం | ABP DesamEluru Collector Vetriselvi on Bird Flu | కోళ్ల నుంచి బర్డ్ ఫ్లూ మనిషికి వచ్చిందా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad News: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్, కొత్తగా 7 ఫ్లైఓవర్లు నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్, కొత్తగా 7 ఫ్లైఓవర్లు నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Vallabhaneni Vamsi Remand: వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్.. చేజేతులా A1గా మారిన వైనం
వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్.. చేజేతులా A1గా మారిన వైనం
Laila Twitter Review - 'లైలా' ట్విట్టర్ రివ్యూ: చిరంజీవిని ఫుల్లుగా వాడేసిన విశ్వక్ సేన్... లైలా డిజాస్టర్ టాక్ వెనుక వైసీపీ?
'లైలా' ట్విట్టర్ రివ్యూ: చిరంజీవిని ఫుల్లుగా వాడేసిన విశ్వక్ సేన్... లైలా డిజాస్టర్ టాక్ వెనుక వైసీపీ?
KCR Re Entry: కేసీఆర్ రీ ఎంట్రీకి ఫిబ్రవరి 19న ముహుర్తం - తెలంగాణ భవన్‌లో కీలక సమావేశం - ఇక సమరమే !
కేసీఆర్ రీ ఎంట్రీకి ఫిబ్రవరి 19న ముహుర్తం - తెలంగాణ భవన్‌లో కీలక సమావేశం - ఇక సమరమే !
Andhra Pradeh BirdFlu: బర్డ్ ఫ్లూ భయం లేదు - ఉడికించిన గుడ్లు, చికెన్ తినొచ్చు - ఏపీ సర్కార్ కీలక ప్రకటన
బర్డ్ ఫ్లూ భయం లేదు - ఉడికించిన గుడ్లు, చికెన్ తినొచ్చు - ఏపీ సర్కార్ కీలక ప్రకటన
Why TDP Cadre Happy: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ తో టీడీపీలో ఎందుకంత ఉత్సాహం?
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ తో టీడీపీలో ఎందుకంత ఉత్సాహం?
Manipur: మణిపూర్ లో రాష్ట్రపతి పాలన - సీఎం రాజీనామాతో కేంద్రం నిర్ణయం
మణిపూర్ లో రాష్ట్రపతి పాలన - సీఎం రాజీనామాతో కేంద్రం నిర్ణయం
Google And Microsoft AI Centers In Hyderabad : తెలంగాణలో ఒకే రోజు రెండు కీలక ఒప్పందాలు- గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ ఏఐ కేంద్రాల ఏర్పాటుకు ఎంవోయు
తెలంగాణలో ఒకే రోజు రెండు కీలక ఒప్పందాలు- గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ ఏఐ కేంద్రాల ఏర్పాటుకు ఎంవోయు
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.