అన్వేషించండి

Ambati On Three Capitals : డౌట్ లేదు 3 రాజధానులే - సీఎం జగన్ , బుగ్గన ప్రకటనలకు భిన్నంగా అంబటి రాంబాబు స్పందన !

మూడు రాజధానులపై వైసీపీలోనే గందరగోళం కనిపిస్తోంది. సీఎం జగన్, బుగ్గన చేసిన ఒకటే రాజధాని విశాఖ ప్రకటనకు భిన్నంగా అంబటి రాంబాబు తాము మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని చెబుతున్నారు.


Ambati On Three Capitals :    మూడు రాజధానులపై  వైఎస్ఆర్‌సీపీ నేతల గందరగోళ ప్రకటనలు కొనసాగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో సీఎం జగన్ విశాఖే్ రాజధాని అని ప్రకటించారు. ఆ తర్వాత బుగ్గన రాజేంద్రనాత్ రెడ్డి మూడు రాజధానులు అనేది కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వచ్చిన ప్రచారం మాత్రమేనని విశాఖ ఒక్కటే రాజధాని అని ప్రకటించారు. అయితే ఇలా బుగ్గన ప్రకటన చేస గంటలు గడవక ముందే ప్రభుత్వంలోని మరో కీలక మంత్రి అంబటి రాంబాబు.. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటనను ఖండించారు. మూడు రాజధానులపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని... వైసీపీ విధానం మూడు రాజధానులేనని ప్రకటించారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా అనే స్ధానిక భావాలున్నాయి.. వాటిని వదులుకోకూడదనే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని కొత్త భాష్యం చెప్పారు. 

బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏం  చెప్పారంటే ?

బెంగళూరులో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సన్నాహాక సమావేశంలో ఇన్వెస్టర్లు పారిశ్రామిక వృద్ధి ప్రాంతాలుగా తిరుపతి, విజయవాడలను ఎందుకు ఎంచుకోలేదన్న- ప్రశ్నకు సమాధానంగా రాజధాని అంశంపై బుగ్గన మాట్లాడారు. రాష్ట్రానికి విశాఖపట్నం ఒకటే రాజధానిగా చేయబోతున్నామని.. మూడు రాజధానులు అనేది మిస్ కమ్యూనికేషన్ అని చెప్పుకొచ్చారు.  కర్ణాటకలోలాగే ఒక సెషన్‌ అసెంబ్లీ సమావేశాలను గుంటూరులో నిర్వహిస్తామని చెప్పారు.   ‘‘రాష్ట్ర పాలన అంతా విశాఖ నుంచే నిర్వహించాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. విభజన తర్వాత పాలనా రాజధానిగా విశాఖను ఎంచుకోడానికి అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలే ప్రధాన కారణం. భవిష్యత్తులో విశాఖ మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అందుకే ఐటీ ఆధారిత పెట్టుబడులను విశాఖకు ఆకర్షించాలని ప్రభుత్వం అనుకుంటోంది. అక్కడ ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం ఉంది. ఐటీ పార్కులు, ఇతర మౌలిక సదుపాయాలు ఇప్పటికే ఉన్నాయి. హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్‌ని కర్నూల్‌లో ఏర్పాటు చేస్తాం. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేం కర్నూలులో హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్‌ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం’’ అని బుగ్గన మాట్లాడారు.


ఢిల్లీలో సీఎం జగన్ ఏం చెప్పారంటే ?  

ఢిల్లీలో దౌత్యవేత్తలతో జరిగిన సమావేశంలో రానున్న రోజుల్లో విశాఖపట్నం ఏపీ రాజధానిగా మారనుందని..తాను కూడా అక్కడి నుంచే పరిపాలన కొనసాగిస్తానని స్పష్టం చేశారు. విశాఖ రాజధానిలో పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నామని చెప్పారు.సీఎం జగన్ వ్యాఖ్యలతో వైఎస్ఆర్‌సీపీ అధికారికంగా ఒక్క రాజధానికే ఫిక్స్ అయిందని తేలింది. బుగ్గన  కూడా అదే్ చెబుతున్నారు. 

రాజకీయంగా మాత్రం మూడు రాజధానుల ప్రకటనలు ! 

అయితే రాజకీయంగా మాత్రం వైఎస్ఆర్‌సీపీ మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని చెప్పడం వివాదానికి కారణం అవుతోంది. ఓ వైపు అధికారిక సమావేశాల్లో ఒక్కటే రాజధాని అని చెబుతున్నారు. మరో వైపు రాజకీయంగా పెట్టే ప్రెస్ మీట్లలో మూడు రాజధానులు అని ప్రకటిస్తున్నారు. 23న రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ లోపు ఏపీ సీఎం, ఆర్థిక మంత్రి, ఇరిగేషన్ మంత్రి పరస్పర విరుద్ద వ్యాఖ్యలతో గందరగోళం నెలకొంది.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Markapuram Road Accident: పడుకున్న చోటే మాంసం ముద్దలుగా మారిన ప్రయాణికులు! మార్కాపురం జిల్లా ప్రమాదంపై విస్తుపోయే వాస్తవాలు!
పడుకున్న చోటే మాంసం ముద్దలుగా మారిన ప్రయాణికులు! మార్కాపురం జిల్లా ప్రమాదంపై విస్తుపోయే వాస్తవాలు!
Markapuram Road Accident: మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం! టిప్పర్‌, ప్రైవేట్ బస్‌ ఢీకొని 13 మంది సజీవదహనం !
మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం! టిప్పర్‌, ప్రైవేట్ బస్‌ ఢీకొని 13 మంది సజీవదహనం !
Women Reservation Effect: రాబోయేది మహిళా నాయకురాళ్ల విప్లవమే - రాజకీయాల దారి మారుతుందా?
రాబోయేది మహిళా నాయకురాళ్ల విప్లవమే - రాజకీయాల దారి మారుతుందా?
Steel Plant Credit Game: మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనన్న జగన్ - పాత వీడియోతో షాకిచ్చిన టీడీపీ
మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనన్న జగన్ - పాత వీడియోతో షాకిచ్చిన టీడీపీ

వీడియోలు

Adilabad Petrol Crisis | ఆదిలాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు | ABP Desam
Ashwin Comments on MI Captain | హార్దిక్ పాండ్యాపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు | ABP Desam
Shreyas Iyer as captain of Team India? | టీమిండియా నెక్స్ట్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్? | ABP Desam
SRH Spends 10 Crores for Uppal Stadium | 10 కోట్లతో ఉప్పల్ స్టేడియం రినోవేషన్ | ABP Desam
RCB Sold to Aditya Birla Group IPL 2026 | భారీ ధరకు అమ్ముడైన RCB | ABP Desam Bangalore

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
LPG Connection: ఎల్పీజీ సిలిండర్ల వాడకందారులకు కేంద్రం డెడ్‌లైన్!మూడు నెలల్లో పీఎన్జీకి మారకుంటే కనెక్షన్ కట్!
ఎల్పీజీ సిలిండర్ల వాడకందారులకు కేంద్రం డెడ్‌లైన్!మూడు నెలల్లో పీఎన్జీకి మారకుంటే కనెక్షన్ కట్!
Hyderabad Chicken Shops Close: హైదరాబాద్‌ నాన్‌వెజ్‌ ప్రియులకు షాకింగ్ న్యూస్! ఏప్రిల్‌ 1 నుంచి చికెన్ షాపులు బంద్!
హైదరాబాద్‌ నాన్‌వెజ్‌ ప్రియులకు షాకింగ్ న్యూస్! ఏప్రిల్‌ 1 నుంచి చికెన్ షాపులు బంద్!
Revanth south Movement: రేవంత్ దక్షిణాది ఉద్యమం - కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి సమస్యలేనా!?
రేవంత్ దక్షిణాది ఉద్యమం - కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి సమస్యలేనా!?
Venkatesh Nandamuri Kalyan Ram : వెంకీ, కల్యాణ్ రామ్‌లతో అనిల్ మల్టీ స్టారర్ - హీరోయిన్స్ ఫిక్స్ అయ్యారా?
వెంకీ, కల్యాణ్ రామ్‌లతో అనిల్ మల్టీ స్టారర్ - హీరోయిన్స్ ఫిక్స్ అయ్యారా?
Horror Movies : ఈ మూవీస్ ఒంటరిగా అస్సలు చూడొద్దు - యూట్యూబ్‌లో టాప్ హారర్ థ్రిల్లర్స్ లిస్ట్
ఈ మూవీస్ ఒంటరిగా అస్సలు చూడొద్దు - యూట్యూబ్‌లో టాప్ హారర్ థ్రిల్లర్స్ లిస్ట్
HMPV Symptoms: ముక్కు దిబ్బడ ,గొంతు నొప్పి ఉందా? సాధారణ జలుబుగా పొరపాటు పడకండి! HMPV కావచ్చు! 
ముక్కు దిబ్బడ ,గొంతు నొప్పి ఉందా? సాధారణ జలుబుగా పొరపాటు పడకండి! HMPV కావచ్చు! 
Family Planning Operation : పిల్లలు పుట్టకుండా చేసే ఆపరేషన్ మగవారు చేయించుకుంటే మంచిదా? లేక ఆడవారికా? నిపుణుల సలహాలు ఇవే
పిల్లలు పుట్టకుండా చేసే ఆపరేషన్ మగవారు చేయించుకుంటే మంచిదా? లేక ఆడవారికా? నిపుణుల సలహాలు ఇవే
Women Reservation Effect: రాబోయేది మహిళా నాయకురాళ్ల విప్లవమే - రాజకీయాల దారి మారుతుందా?
రాబోయేది మహిళా నాయకురాళ్ల విప్లవమే - రాజకీయాల దారి మారుతుందా?
Embed widget