అన్వేషించండి

AP Assembly : అక్టోబర్ పదో తేదీలోపు ఏపీ అసెంబ్లీ రద్దు - జగన్ నిర్ణయాలు ఆ దిశగానే ఉన్నాయా ?

వచ్చే నెల పదో తేదీ లోపు ఏపీ అసెంబ్లీని రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత వేగంగా పరిణామాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.


AP Assembly :   ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ విషయంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు భావిస్తున్నాయి. సీఎం జగన్ ఏ క్షణమైనా ఢిల్లీ వెళ్లే అవకశం ఉంది. ప్రధాని మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షాలతోనూ సమావేశం అవుతారని చెబుతున్నారు. ఆ భేటీలో ముందస్తు ఎన్నికల అంశాన్ని చెప్పి.. అసెంబ్లీ రద్దు అంశం, తదుపరి ఎన్నికల నిర్వహణ అంశంపై స్పష్టత తీసుకోవాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. 

డిసెంబర్ పోల్స్‌కే సీఎం జగన్ మొగ్గు ?

జమిలీ ఎన్నికలు అంటూ వస్తే డిసెంబర్ లో ఎన్నికలు జరుగుతాయని ఎక్కువ మంది భావిస్తున్నారు. సీఎం జగన్ కూడా ఈ దిశగానే కసరత్తు చేసుకుంటున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితులతో వెంటనే ఎన్నికలకు వెళ్తే మంచి ఫలితాలు వస్తాయని నమ్ముకుంటున్నారు. అందుకే ఆయన ప్రిపరేషన్స్ ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఈ నెల ఇరవయ్యే తేదీ లోపు అసెంబ్లీని సమావేశపర్చాల్సి ఉంది. ఆరేడు రోజుల పాటు అసెంబ్లీని సమావేశపర్చి .. వారం పాటు.. తాను చేసిన పనుల గురించి ప్రజెంటేషన్ ఇస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధి, సంక్షేమం మొత్తం ప్రజల ముందు పెడతారని అంటున్నారు. ఇది ఎన్నికలకు సన్నాహమేనని చెబుతున్నారు. 

చుట్టుముడుతున్న ఆర్థిక సమస్యలు !

ఏపీ ప్రభుత్వానికి ఆర్థిక సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే పలు పథకాలకు బటన్స్ నొక్కాల్సి ఉంది.  కానీ నెలాఖరు వచ్చే సరికి.. ఆర్బీఐ దగ్గర ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్తే తప్ప..జీతాలు , పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఆర్బీఐ దగ్గర ఐదున్నర నెలలు కూడా పూర్తి కాకుండానే నలభైవేల కోట్లకుపైగా అప్పు తెచ్చుకున్నారు. ఇది కేంద్రం ఇచ్చిన పరిమితులు దాటిపోయింది. ఆరు నెలలలో బడ్జెట్‌ అంచనాలంత  అప్పు చేసేసినట్లవుతుంది. తర్వాత అప్పులు దొరకడం కూడా కష్టమన్న వాదన వినిపిస్తోంది. వచ్చే ఏడాది మార్చి వరకూ ఇలా నెట్టుకు రావడం కష్టమవుతుందని.. ఇప్పుడే ఎన్నికలకు వెళ్తే.. చాలా సమస్యలు పరిష్కారమవుతాయని అంచనా వేస్తున్నారు. 

కేంద్రం నిర్ణయాన్ని బట్టే !

అయితే ముందస్తుకు వెళ్లాలంటే.. కేంద్రం సానుకూలత తప్పనిసరి. ఇప్పటికే ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియకు ఈసీ సన్నాహాలు చేస్తోంది. కానీ ఎలా చూసినా ఏపీకి సంబంధఇంచిన ప్రక్రియను అధికారికంగా ప్రారంభించలేరు. అసెంబ్లీ రద్దు అయిన తర్వాతనే ప్రారంభిస్తారు. కేంద్రం జమిలీ ఎన్నికలపై ఆలోచన చేస్తోంది. అదే ఆలోచన ఉంటే.. పార్లమెంట్ తో జరగాల్సిన రాష్ట్రం ఎన్నికలను ముందుకు జరిపేందుకు అంగీకరించదు. అంటే జగన్ అసెంబ్లీని రద్దు చేస్తే రాష్ట్రపతి పాలన విధిస్తారు కానీ ఎన్నికలు పెట్టారు. మొత్తం కేంద్రం అనుమతితోనే జగన్ మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

JD Vance India Visit: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు కేంద్ర మంత్రి ఘన స్వాగతం- సాయంత్రం మోదీతో విందు, ఢిల్లీలో భద్రత పెంపు
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు కేంద్ర మంత్రి ఘన స్వాగతం- సాయంత్రం మోదీతో విందు, ఢిల్లీలో భద్రత పెంపు
Gollapudi Panchayat: ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
KTR News: ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
AP DSC Notification 2025: గతంలో డీఎస్సీకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
గతంలో DSCకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Virat Kohli PoTM IPL 2025 | ఒకే రోజు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లు తీసుకున్న రోహిత్ - విరాట్  | ABP DesaAyush Mhatre Batting | MI vs CSK IPL 2025 మ్యాచ్ ద్వారా పుట్టిన మరో కొత్త స్టార్ ఆయుష్ మాత్రేVirat Kohli vs Shreyas Iyer Controversy | IPL 2025 లో కొత్త శత్రువులుగా విరాట్, శ్రేయస్ అయ్యర్Rohit Sharma 76* vs CSK IPL 2025 | హిట్ మ్యాన్ ఫామ్ లోకి వస్తే ఎలా ఉంటుందో చూపించిన రోహిత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JD Vance India Visit: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు కేంద్ర మంత్రి ఘన స్వాగతం- సాయంత్రం మోదీతో విందు, ఢిల్లీలో భద్రత పెంపు
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు కేంద్ర మంత్రి ఘన స్వాగతం- సాయంత్రం మోదీతో విందు, ఢిల్లీలో భద్రత పెంపు
Gollapudi Panchayat: ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
KTR News: ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
AP DSC Notification 2025: గతంలో డీఎస్సీకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
గతంలో DSCకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
Aishwaryarai Bachchan: ఐశ్వర్య రాయ్, అభిషేక్, ఆరాధ్య.. క్యూట్ ఫ్యామిలీ - విడాకుల రూమర్స్‌కు చెక్ పెట్టేశారుగా!
ఐశ్వర్య రాయ్, అభిషేక్, ఆరాధ్య.. క్యూట్ ఫ్యామిలీ - విడాకుల రూమర్స్‌కు చెక్ పెట్టేశారుగా!
Online Betting Case: వైసీపీ నేతపై ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ కేసు నమోదు, స్పెషల్ టీమ్స్‌ ఏర్పాటు చేసి గాలిస్తున్న పోలీసులు
వైసీపీ నేతపై ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ కేసు నమోదు, స్పెషల్ టీమ్స్‌ ఏర్పాటు చేసి గాలిస్తున్న పోలీసులు
Usha Vance Special Gift: అమెరికా ఉపాధ్యక్షుడి సతీమణి ఉషా చిలుకూరికి అరుదైన గిఫ్ట్ ఇవ్వనున్న కేంద్ర రైల్వే శాఖ
అమెరికా ఉపాధ్యక్షుడి సతీమణి ఉషా చిలుకూరికి అరుదైన గిఫ్ట్ ఇవ్వనున్న కేంద్ర రైల్వే శాఖ
Upcoming Movies: కామెడీ నుంచి లవ్ స్టోరీస్ వరకూ చూసేందుకు రెడీయేనా! - ఈ వారం మూవీ లవర్స్‌ను ఎంటర్‌టైన్ చేసే చిత్రాలివే!
కామెడీ నుంచి లవ్ స్టోరీస్ వరకూ చూసేందుకు రెడీయేనా! - ఈ వారం మూవీ లవర్స్‌ను ఎంటర్‌టైన్ చేసే చిత్రాలివే!
Embed widget