అన్వేషించండి

AP Vs TS : ఏపీ, తెలంగాణ మధ్య శ్రీశైలం కరెంట్ మంటలు - కృష్ణాబోర్డుకు లేఖ రాసిన జగన్ సర్కార్ !

అనుమతి లేకపోయినా శ్రీశైలం నుంచి ఏపీ సర్కార్ విద్యుత్ ఉత్పత్తి చేసిన నీటి వృధా చేస్తోందని ఏపీ ప్రభుత్వం కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేసింది. ఈ వివాదం ప్రతీ ఏడాది ఉంటుంది. ఈ సారి కూడా లేఖల యుద్ధం ప్రారంభమయింది.

AP Vs TS :  తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు సుదీర్ఘంగా సాగుతున్నాయి. తాజాగా మరోసారి తెలంగాణపై ఏపీ ప్రభుత్వం ఆరోపణలు చేస్తూ కృష్ణా బోర్డుకు లేఖ రాసింది.  అవసరం లేకున్నా శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం లో తెలంగాణ విద్యుత్ ఉత్పాదన చేస్తోందని  ఏపీ  అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు కేఆర్ఎంబీ చైర్మన్‌ కు ఏపీ జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్  లేఖ రాశారు. శ్రీశైలం , నాగార్జునసాగర్ ప్రాజెక్టు  ల్లో పూర్తి స్థాయి నీటి మట్టం ఉందని ఏపీ అధికారులు   లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ జల విద్యుత్ ఉత్పాదన  వలన నీరు వృథాగా సముద్రంలోకి వెళుతుందని అధికారులు పేర్కొన్నారు. ఇలా చేయటం వల్ల సీజన్ చివరిలో పంటలు సాగు, తాగునీరుకు ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఏపీ అధికారులు పేర్కొన్నారు. వెంటనే తెలంగాణ ప్రభుత్వాన్ని శ్రీశైలంలో విద్యుత్ ఉత్పాదన నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేయాలని కేఆర్ఎంబీ చైర్మన్‌ను  కోరారు.

తెలుగు రాష్ట్రాల మధ్య ప్రతీ ఏడాది విద్యుత్ ఉత్పత్తి పంచాయతీ

నిజానికి ఈ జలవిద్యుత్ ఉత్పత్తి వివాదం ఇదే మొదటి సారి కాదు. ప్రతీ సారి వస్తోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో విద్యుదుత్పత్తి విషయమై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం  తరచూ వస్తోంది.  ముఖ్యంగా శ్రీశైలంలో తెలంగాణ విచ్చలవిడిగా విద్యుదుత్పత్తి జరుపుతోందని ఏపీ ఆరోపిస్తుండగా..విద్యుదుత్పత్తి అవసరాల కోసమే శ్రీశైలం జలాశయం నిర్మాణం జరిగిందంటూ తెలంగాణ  వాదిస్తోంది. రాష్ట్ర అవసరాల మేరకు జలవిద్యుదుత్పత్తి కొనసాగిస్తామని, జల విద్యుత్‌ కేంద్రాలపై కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) పెత్తనాన్ని అంగీకరించేది లేదని తేల్చిచెబుతోంది.  

నీటిని దుర్వినియోగం చేస్తున్నారని తెలంగాణపై ఏపీ ఆరోపణ

తెలంగాణ విచ్చలవిడిగా విద్యుదుత్పత్తి జరిపి శ్రీశైలం జలాశయాన్ని దుర్వినియోగం (మిస్‌ మ్యానేజ్‌మెంట్‌) చేస్తోందని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే రాష్ట్ర విద్యుత్‌ అవసరాలు భారీగా పెరిగిపోయాయని, ఎత్తిపోతల పథకాలు, వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌ సరఫరా చేసేందుకు జల విద్యుదుత్పత్తి తప్ప మరో మార్గం లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇది దుర్వినియోగం కాదని, సంక్షోభ నివారణ కోసం జల విద్యుదుత్పత్తి చేస్తున్నామని పేర్కొంటోంది. రెండు రాష్ట్రాలు ఇలా వాదోపవాదాలు చేసుకుంటూనే ఉన్నాయి. అయితే కేఆర్ఎంబీ చాలా సార్లు ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ సర్కార్ పట్టించుకోలేదు. తమ అవసరాల కోసం విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తూనే ఉంది. ఇలా విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల నీటిని సముద్రంలోకి వదిలేయాల్సి వస్తోందని ఏపీ అంటోంది. 

తమ హక్కుల ప్రకారమే నీటిని వాడుకుంటున్నామన్న తెలంగాణ 

శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి ఏపీ తమ వాటాగా వచ్చే నీటిని రాయలసీమకు తరలిస్తూ ఉంటుంది.  పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలిచేలోపే... తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు వదిలేస్తోంది. ఈ కారణంగా సాగర్ లోకి నీరు చేరుతున్నాయి.ఇప్పటికే సాగర్ నిండిపోవడంతో దిగువకు వదిలి వేయక తప్పడం లేదు. అందుకే శ్రీశైలంలో నీరు రాయలసీమకు పూర్తి స్థాయిలో తరలించలేకపోతున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rahul Gandhi: భారత్‌లోనూ Gen Z ఉద్యమం.. ఓటు చోరీని అడ్డుకుని రాజ్యాంగాన్ని కాపాడుతుందన్న రాహుల్ గాంధీ
భారత్‌లోనూ Gen Z ఉద్యమం.. ఓటు చోరీని అడ్డుకుని రాజ్యాంగాన్ని కాపాడుతుందన్న రాహుల్ గాంధీ
Etela Rajender: బీజేపీపై ఈటల రాజేందర్‌ తీవ్ర అసంతృప్తి- మరోసారి ఆత్మగౌరవ కామెంట్స్‌- రాజీనామాకు సిద్ధం!
బీజేపీపై ఈటల రాజేందర్‌ తీవ్ర అసంతృప్తి- మరోసారి ఆత్మగౌరవ కామెంట్స్‌- రాజీనామాకు సిద్ధం!
Russia Earthquake: రష్యాలో 7.8 తీవ్రతతో భారీ భూకంపం, సునామీ హెచ్చరిక జారీ.. ఇండోనేషియాలోనూ భూ ప్రకంపనలు
రష్యాలో 7.8 తీవ్రతతో భారీ భూకంపం, సునామీ హెచ్చరిక జారీ.. ఇండోనేషియాలోనూ భూ ప్రకంపనలు
Sai Durgha Tej: తలకు హెల్మెట్ వల్లే ప్రాణాలతో బయటపడ్డా - ఫైన్, కౌన్సెలింగ్ కాదు స్మాల్ పనిష్మెంట్... ట్రాఫిక్ సమ్మిట్‌లో సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్
తలకు హెల్మెట్ వల్లే ప్రాణాలతో బయటపడ్డా - ఫైన్, కౌన్సెలింగ్ కాదు స్మాల్ పనిష్మెంట్... ట్రాఫిక్ సమ్మిట్‌లో సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్
Advertisement

వీడియోలు

India vs China Water war | చైనా మెగా డ్యాంకి ఇండియా కౌంటర్ ప్లాన్ అదుర్స్ | ABP Desam
యూఏఈతో మ్యాచ్ ఆలస్యం.. పాక్‌కి భారీ ఫైన్ వేయబోతున్న ICC?
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు మంధాన.. చరిత్ర సృష్టించిన మిస్ క్రికెటర్
పాక్ ఓవర్ యాక్షన్.. యూఏఈతో మ్యాచ్‌కి గంట ఆలస్యంగా టీం
UAE పై గట్టెక్కిన పాక్.. INDIAతో మ్యాచ్ కి డేట్ ఫిక్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi: భారత్‌లోనూ Gen Z ఉద్యమం.. ఓటు చోరీని అడ్డుకుని రాజ్యాంగాన్ని కాపాడుతుందన్న రాహుల్ గాంధీ
భారత్‌లోనూ Gen Z ఉద్యమం.. ఓటు చోరీని అడ్డుకుని రాజ్యాంగాన్ని కాపాడుతుందన్న రాహుల్ గాంధీ
Etela Rajender: బీజేపీపై ఈటల రాజేందర్‌ తీవ్ర అసంతృప్తి- మరోసారి ఆత్మగౌరవ కామెంట్స్‌- రాజీనామాకు సిద్ధం!
బీజేపీపై ఈటల రాజేందర్‌ తీవ్ర అసంతృప్తి- మరోసారి ఆత్మగౌరవ కామెంట్స్‌- రాజీనామాకు సిద్ధం!
Russia Earthquake: రష్యాలో 7.8 తీవ్రతతో భారీ భూకంపం, సునామీ హెచ్చరిక జారీ.. ఇండోనేషియాలోనూ భూ ప్రకంపనలు
రష్యాలో 7.8 తీవ్రతతో భారీ భూకంపం, సునామీ హెచ్చరిక జారీ.. ఇండోనేషియాలోనూ భూ ప్రకంపనలు
Sai Durgha Tej: తలకు హెల్మెట్ వల్లే ప్రాణాలతో బయటపడ్డా - ఫైన్, కౌన్సెలింగ్ కాదు స్మాల్ పనిష్మెంట్... ట్రాఫిక్ సమ్మిట్‌లో సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్
తలకు హెల్మెట్ వల్లే ప్రాణాలతో బయటపడ్డా - ఫైన్, కౌన్సెలింగ్ కాదు స్మాల్ పనిష్మెంట్... ట్రాఫిక్ సమ్మిట్‌లో సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్
AP Assembly: జీఎస్టీ తగ్గింపుతో ఏపీ ప్రజలకు 8 వేల కోట్ల ఆదాయం మిగులు-కేంద్రానికి ఏపీ అసెంబ్లీ కృతజ్ఞతల తీర్మానం
జీఎస్టీ తగ్గింపుతో ఏపీ ప్రజలకు 8 వేల కోట్ల ఆదాయం మిగులు-కేంద్రానికి ఏపీ అసెంబ్లీ కృతజ్ఞతల తీర్మానం
Komatireddy Rajagopal Reddy:  వైఎస్ఆర్‌సీపీలో చేరడం లేదు - ర్యాలీగా విజయవాడ వెళ్తోంది ఫంక్షన్‌కే - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ
వైఎస్ఆర్‌సీపీలో చేరడం లేదు - ర్యాలీగా విజయవాడ వెళ్తోంది ఫంక్షన్‌కే - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ
Gold Seized at Shamshabad airport: శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత, ముగ్గురు నిందితు అరెస్ట్
శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత, ముగ్గురు ఏపీ వ్యక్తుల అరెస్ట్
Navratri 2025: దసరా నవరాత్రి కలశ స్థాపన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత! ఎలాంటి కలశ పెట్టాలి తెలుసుకోండి
దసరా నవరాత్రి 2025: కలశ స్థాపన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, ఎలాంటి కలశ పెట్టాలి తెలుసుకోండి
Embed widget